-
వల నిండా.. కొండచిలువలు
అల్లాదుర్గం (మెదక్) : చేపలు పట్టేందుకు వల వేస్తే రెండు కొండచిలువలు చిక్కాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు మంగళవారం అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. మీటరున్నర పొడవున్న వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సాయిలు తెలిపారు. (క్లిక్: మస్క్ మలన్తో మస్తు పైసలు) -
కేసీఆర్ సభను జయప్రదం చేయాలి
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రచారసభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు అన్నారు. ఆదివారం మండలంలోని బుజ్రాన్పల్లి, టెంకటి, జంబికుంట, దానంపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కుల గ్రామాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ప్రచారం చేశారు. ఏప్రిల్ 3న అల్లాదుర్గంలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సురేష్గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్రెడ్డి, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు హరి, గోవర్దన్, పున్నయ్య, అంజయ్య ఉన్నారు. -
వినూత్న బోధన
అల్లాదుర్గం(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య గాడి తప్పుతుంటే, ఈ ఉపాధ్యాయుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఐతే ఆయనకు వినూత్నమైన ఆలోచన తట్టింది. సేల్ఫోన్ సహాయంతో ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆయన ఒక తరగతిలో బోధిస్తూ , మిగితా వాటిలో ఫోన్ ద్వారా యూట్యూబ్లోని వీడియోలను డౌన్లోడ్ చేసి దానికి సౌండ్ బాక్స్లను అనుసంధానం చేసి పలు తరగతుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి తెలుగు వర్ణమాల, గుణితాలు, పద్యాలు, ఆంగ్ల వర్ణమాల నంబర్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా చార్ట్లను తయారు చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నాడు. బ్లూటూత్ ద్వారా కనెక్షన్.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ తండా (మాణిక్యరాజ్తండా) ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యబోధన జరుగుతోంది.ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెల్ఫోన్కు చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం గగనంగా మారింది.దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టిబాబుకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్కు బ్లూటూత్ ద్వారా చిన్న చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేశారు. అఆలు రాస్తు చెబుతుంటే అందులో విద్యార్థులు వింటూ నేర్చుకుంటున్నారు. విద్యార్థులు చక్కగా వింటూ పలకడం, రాయడం చేస్తుండటంతో ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం విజయవంతమైంది. ఉపాధ్యాయుడి రూపొందించిన వివిధ రకాల చార్ట్లు పాఠశాల గోడలపై అతికించిన చార్ట్లు సులువుగా నేర్చుకుంటున్నారు.. రాష్ట్రంలోనే ఈ విధంగా విద్యబోధన చేయడం ఏ ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. కూడికలు, తీసివేతలు, గుణితాలు, సంయుక్త అక్షరాలు, వివిధ రకాల చాట్లు 500 వరకు ఆయన తయారు చేశాడు. విద్యార్థులకు చార్ట్లు ఇచ్చి కూడికలు, తీసివేతలు, గుణితాలు చేయాలని చేప్తూ విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే రైమ్స్ పద్యాలు విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. బొమ్మల కథలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ పదాలు, కాకుర్తాలు ఫోన్లో వింటూ నేర్చుకుంటున్నారు. ఇబ్బందిగా ఉండేది.. ఐదు తరగతులకు ఒక్కడినే బోధించాంలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఐడియా ద్వారా విద్యబోధన సులువు అయ్యింది. ఫోన్లో అక్షరాలు రాయడం, పలకడంతో విద్యార్థులు శ్రద్ధగా వింటూ నేర్చుకుంటున్నారు. 3 , 4 తరగతుల విద్యార్థుల కోసం చార్ట్లు తయారు చేసి , విద్యార్థుల ముందు పెట్టడంతో వారే వాటిని చూసుకుని గణితం, తెలుగు, సైన్స్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ల్యాప్ట్యాప్, ట్యాబ్ పంపిణీ చేస్తే ఇలాంటి బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు. – చిట్టిబాబు, ఉపాధ్యాయుడు, గడిపెద్దాపూర్తండా -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అల్లాదుర్గం (మెదక్) : ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగి బీరప్ప(16) సాయంత్రం ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. -
వాహనం ఢీకొని బాలుడి మృతి
అల్లాదుర్గం (మెదక్ జిల్లా): అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన బాలుడిని తూఫాన్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెద్దశంకరంపేటకు చెందిన నగేష్(9)గా గుర్తించారు. పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన నగేష్ మార్గమధ్యంలో ఉన్న గుడికి వెళ్లాడు. దైవదర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులను వదిలి ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోన్న తూఫాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement