-
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
సబ్ప్లాన్పై అధ్యయన కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ ఉప ప్రణాళికలో సవరణల కోసం గిరిజనసంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో మార్పు లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు. ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కొత్త పథకాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సభ్యులుగా ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, కోవా లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు నియమితుల య్యారు. ఈ మేరకు ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. -
ట్రావెల్ టూరిజం ఫేర్ను ప్రారంభించిన చందులాల్
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం 25 శాతం అభివృద్ధి చెందిందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో ట్రావెల్ టూరిజం ఫేర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కట్టడాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సందర్శకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ టూరిజం ఫేరులో 182 ఎగ్జిబిటర్లతో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఫేర్లో బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్లో 20 శాతం, ట్రాన్స్పోర్టులో 10 శాతంలతో పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
ఉప ప్రణాళిక నిధుల వ్యయంలో ఉపేక్ష వద్దు
అధికారులకు మంత్రి చందూలాల్ ఆదేశం సాక్షి,హైదరాబాద్:సబ్ప్లాన్ నిధుల వ్యయంలో నిర్లక్ష్యం చేస్తే గిరిజనులకు అన్యాయం చేసిన వారవుతారని వివిధశాఖల అధికారులనుద్దేశించి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి అజ్మీరా చందూలాల్ వ్యాఖ్యానించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఎస్టీ సబ్ప్లాన్నోడల్ ఏజెన్సీ సమావేశంలో ఉపప్రణాళిక వ్యయం తీరును మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీల కోసం కేటాయిస్తున్న ప్రతీపైసా వ్యయం చేయాల్సిందేనని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్టీ ఉపప్రణాళికను సమర్థంగా అమలుచేయాలని సూచించారు. గిరిజన పొదుపుసంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. మెక్రో ఇరిగే షన్ ద్వారా ఎస్టీ రైతులకు ఉపకరించే చర్యలను తీసుకోవాలన్నారు. గిరిజనప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తండాలు, గూడేలను ప్రధాన రోడ్లకు కలపడానికి రూ. 500 కోట్లు... తండాలు, గూడేలను ప్రధానరోడ్లతో అనుసంధానించేందుకు ఈ ఏడాది రూ.500 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు.అదేవిధంగా జాతీయ ఉపాధిహామీపథకంతో సమన్వయం చే సుకుని మరో రూ.500 కోట్లతో అంతర్గతరోడ్లను తీర్చిదిద్దుతామన్నారు. గృహనిర్మాణానికి రూ.84 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలియజేశారు. గిరిజనయువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకు వీలుగా రూ.36కోట్లతో 9 యువజనకేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. -
ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా?
► సబ్ప్లాన్ నిధులపై అధికారులను ప్రశ్నించిన ► మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగల ఉప ప్రణాళికకు అదనంగా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోతే ఎలా అని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వ్యయం చేయడంలో కొన్ని విభాగాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలున్నాయని, భవిష్యత్లో ఇలాంటివి పునరావృతమైతే ఆయా శాఖల అధికారులను బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఎస్టీ సబ్ప్లాన్ అమలుతీరుపై జరిగిన నోడల్ ఏజెన్సీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ప్లాన్కు కేటాయిస్తున్న నిధులను ఆయా విభాగాలు సకాలంలో ఖర్చుచేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
అమ్మవారికి గాజుల శోభ
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement