-
‘డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ చేసిన కార్మికులకు వన్టైం చాన్స్ కింద ఉద్యోగాలివ్వాలని తెలంగాణ సింగరేణి డిస్మిస్ కార్మికుల సంఘం అ«ధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వన్టైం చాన్స్ కింద అవకాశం కల్పించే అంశంపై చర్చిస్తామన్న యాజమాన్యం ప్రతిసారీ దీన్ని వాయిదా వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ సమస్యలపై స్పందించాలని కోరారు. -
డ్యూటీ చేయకున్నా.. జీతం డ్రా
ఏడు నెలలపాటు విధులకు డుమ్మా.. అయినా పూర్తి కాలానికి వేతనం విడుదల ఈఓపీఆర్డీ, ఎంపీడీఓ సహకారంతో పంచాయతీ కార్యదర్శి లీలలు కనీసం సెలవు పత్రం ఇవ్వని వైనం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి మహబూబాబాద్ : ఆయనొక పంచాయతీ కార్యదర్శి.. ఉండేది విజయవాడలో.. ఉద్యోగం చేసేది మాత్రం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో. చెప్పా పెట్టకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడం ఆయన నైజం. అయినా ఆయనకు స్థానిక అధికారులు ఒక్క మెమో ఇవ్వడం కాదు కదా.. కనీసం మందలించడం కూడా చేయలేదు. డ్యూటీ తప్పించిన కాలానికి సెలవు కూడా పెట్టకుండా, ఏడు నెలల జీతం ఎత్తుకోగల నేర్పరితనం ఆయనది. స్థానిక ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ ప్రోత్సాహం, సహకారంతో గుట్టుగా చేసిన వ్యవహారం అధికారుల మధ్య వచ్చిన గొడవతో బట్టబయలైంది. అసలేం జరిగిందంటే... వి.శ్రీనివాసరావు అనే పంచాయతీ ఉద్యోగి పూర్వ నర్సింహులపేట మండలం.. ప్రస్తుత దంతలాపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ముంగిమడుగు, రామన్నగూడెం, గుండంరాజుపల్లి గ్రామాలను కూడా ఇ¯ŒSచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ నుంచి వచ్చి వెళ్తుంటాడు. దీంతో తరుచూ విధులకు డుమ్మా కొడుతుంటాడు. ఒక్కొక్క సారి నెలల తరబడి కనిపించకుండా వెళ్తాడు. ఇలా 2015లో జనవరి, ఫిబ్రవరిలో రెండు నెలలు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. తర్వాత తిరిగి రాగానే స్థానిక అధికారులు రెండు నెలల జీతం చేసి పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. అలాగే మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ సారి ఏకంగా ఏడు నెలల వరకు రాలేదు. అధికారులకు లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయతీ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన ఈఓపీఆర్డీ, ఎంపీడీఓలు అతడు అబ్ స్కాండింగ్(కనిపించకుండా పోవడం)లో ఉన్నట్లు గానీ, సెలవు పెట్టినట్లుగానీ ఉన్నతాధికారులకు సమాచారమివ్వలేదు. తీరా 7 నెలల తర్వాత ఆగస్టులో మళ్లీ తానో ఉద్యోగం చేస్తు న్న విషయం గుర్తుకొచ్చి శ్రీనివాసరావు తిరిగొచ్చా డు. వచ్చి రావడంతో నే ఆయనకు ఏడు నెలల ఏరియర్స్ (రూ.1,00,097) ఎంపీడీఓ, ఈఓపీర్డీ కలిసి ఒకేసారి మంజూరు చేశా రు. ఈ వ్యవహారమంతా ఎంపీడీఓ కార్యాలయంలోని సంబంధిత సూపరిం టెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సంతకాలు లేకుండా నే సాగినట్లు తెలిసింది. విధులకు హాజరు కానీ ఉద్యోగికి గైర్జాజర్ వేసి,ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అతడిని ప్రోత్సహించడం అనుమానాలకు తావి స్తోంది. కాగా ఈ వ్యవహారంపై పలువురు ఈ నెల 17న గ్రీవెన్స్సెలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ కార్యాలయంలో కలిసిన నర్సిం హులపేట ఈఓపీఆర్డీ ఎ.గవర్రాజును ‘సాక్షి’ వివర ణ కోరగా శ్రీనివాసరావు విధులకు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడని, అనారోగ్యంతో ఉన్నానంటే రిక్వెస్ట్ మీద జీతం చేశామని చెప్పడం గమనార్హం. కానీ అత డు రాని రోజుల్లో ఆబ్సెంట్ వేయాలి కదా అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. డీపీఓ విచారణ లో అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. రిక్వెస్ట్ చేయడం వల్ల జీతం ఇచ్చాం శ్రీనివాసరావు అనారోగ్యంతో ఉండటం కారణంగానే సక్రమంగా విధులకు హాజరుకాలేదు. ఫిబ్రవరి నుంచి కుమ్మరికుంట్ల గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు విధులు సక్రమంగా నిర్వహించలేదు. విధులకు డుమ్మా కొట్టాడు. దీంతో కొన్ని నెలలు పడమటిగూడెం పంచాయతీ కార్యదర్శికి కొన్ని బాధ్యతలు అధికారికంగా కాకుండా అప్పగించాం. కానీ శ్రీనివాసరావు పొరపాటు జరిగిందని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ నాలుగు నెలల వేతనాన్ని ఇచ్చాం. ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు కానీ అనారోగ్య సమస్యతో సక్రమంగా రావడం లేదు. –ఈఓపీఆర్డీ ఎ.గవర్రాజు రెగ్యులర్గా రాలేదు మహబూబాబాద్ : కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు రెగ్యులర్గా విధులకు హాజరుకానీ మాట నిజమే. అనారోగ్యం కారణం చెబుతూ వచ్చారు. ఆ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టడం వల్ల మరో పంచాయతీ కార్యదర్శి యాకయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. లాంగ్ లీవ్ పెట్టకుండా అప్పుడప్పుడు సెలవు పెడుతూ విధుల కు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. మెడికల్ బిల్లులు చూపడం వలనే వేతనాలు ఇచ్చాం. ఎంపీడీఓ టి.ఉపేందర్ అధికారులను విచారిస్తున్నా కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి విషయంపై విచారణ చేపడుతున్నాం. ఈ విషయమై ఈఓపీఆర్డీ గవర్రాజును నేను వివరణ అడుగగా ఎంపీడీఓనే వేతనాలు ఇచ్చారని బదులిచ్చారు. అయితే విధులకు డుమ్మా కొట్టినట్లు మాత్రం ఆయన అంగీకరించారు. ఆ పంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టలేదని కానీ అనారోగ్యంతో విధులకు హాజరుకాలేదని మాత్రమే సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. –జిల్లా పంచాయతీ అధికారి రాణిభాయి -
సహాయ నిరాకరణం
♦ వైవీయూలో కొనసాగుతున్న సమ్మె ♦ వీసీ కారు డ్రైవర్ సహా అందరూ సమ్మెలోకి.. ♦ మంగళవారం విధులకు గైర్హాజరు ♦ బోధనేతర సిబ్బంది సమస్యలపై కమిటీ ఏర్పాటు వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణలో భాగంగా మంగళవారం విధులకు గైర్హాజరయ్యారు. స్నాతకోత్సవ పనులకు సైతం వీరంతా దూరంగా ఉండిపోయారు. విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నీటిసమస్య తలెత్తడంతో అధికారులు బయటి నుంచి మినరల్ వాటర్ తెప్పించుకుని పనులు కానించారు. దీంతో పాటు వైస్ చాన్స్లర్ వాహన డ్రైవర్ సైతం సమ్మెలోకి వెళ్లడంతో ఆయన ప్రైవేట్ డ్రైవర్ను పిలిపించుకుని విధులకు హాజరయ్యారు. సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ...! గత నాలుగురోజులుగా బోధనేతర సిబ్బంది సమ్మెబాట పట్టడంతో వైవీయూలో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. కాగా బోధనేతర సిబ్బంది పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటుండగా... తమ సమస్యలను పట్టించుకోనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని బోధనేతర సిబ్బంది వాదిస్తున్నారు. దీనికి తోడు స్నాతకోత్సవం, ఈనెల 30 నుంచి వైవీయూ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సమ్మె మరింతకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. సమ్మెను విరమించేందుకు పలు ప్రతిపాదనలతో సబ్కమిటీ వేసినట్లు సమాచారం. వైవీయూ రెక్టార్, పాలకమండలి సభ్యుడు అయిన ఆచార్య ఎం. ధనుంజయనాయుడు అధ్యక్షతన పలువురు పాలకమండలి సభ్యులతో పాలకమండలి సబ్కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
ఎస్కేయూలో వీసీ తనిఖీలు
ఎస్కే యూనివర్సిటీ వీసీ కె. రాజగోపాల్ ఇవాళ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. విధులకు గైర్హాజరైతున్న తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు మెమొ జారీ చేశారు. కళాశాలలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement