-
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్సోనియాగాంధీకి న్యూయార్క్లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
‘పబ్జీ బ్యాన్.. యువత పరిస్థితి ఏంటీ..?’
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం చైనా యాప్స్ బ్యాన్పై మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలో చైనాకు చెందిన మరో 47 యాప్స్ను కూడా బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా త్వరలో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీని కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. పబ్జీ బ్యాన్పై వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింగ్వీ కేంద్రంపై వ్యంగ్యాస్తాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ప్రముఖ ఆన్లైన్ వీడియో గేమ్ అయిన పబ్జీని నిషేధించాలని కేంద్రలోని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ఒకవేళ యువత ఆడటం మానేస్తే.. వారు దేశంలోని నిరుద్యోగ వంటి వాస్తవాల గురించి ప్రశ్నిస్తారు. ఇది మరింత తీవ్ర సమస్య అవుతోందని కేంద్రం గ్రహించింది’. అని అభిషేక్ మను సింగ్వీ పేర్కొన్నారు. (పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా... ) మరోవైపు కరోనా కారణంగా ఏర్పడిన సంకక్షోభంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితి ఎంటనీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా గతంలో బ్యాన్ చేసిన చైనాకు చెందిన 59 యాప్స్కు క్లోన్గా ఉన్నందున ఈ 47 మాప్స్ను బ్యాన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. వినియోగదారుల గోప్యత, జాతీయ భద్రత నియమాలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నయన్న నేపథ్యంలో వీటిని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం మరో 250కు పైగా యాప్స్ పై నిఘా పెట్టిందని, అయితే ఈ జాబితాలో పబ్జీ కూడా ఉన్నట్లు సమాచారం అందగా దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. (పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..) -
నేపాల్ ప్రధానికి మతి భ్రమించింది : అభిషేక్ సింగ్వి
ఢిల్లీ : రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ ప్రకటించిన నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మతి భ్రమించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్రధాని ఆదేశాల మేరకే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు రాముడు నేపాలీ దేశస్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది! ) సోమవారం ఓ మీడియాతో ఓలీ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్లో లేదు. అది నేపాల్లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో సీతను వివాహం చేసుకోవడానికి రాముడు జనక్పూర్కు ఎలా వచ్చాడంటూ ప్రశ్నించారు. ప్రస్తుత భారతదేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జనక్పూర్కు రావడం అసాధ్యమంటూ పేర్కొన్నాడు. అయితే నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. #Oli #NepalPM seems 2hv lost his mental balance or is puppet &parrot like mouthing lines scripted by desperate #Chinese. 1st he claimed territories never earlier claimed by #Nepal. Now he relocates #Ram #Sita #Ayodhya & #RamRajya a few hundred miles from Ayodhya inside Nepal! — Abhishek Singhvi (@DrAMSinghvi) July 14, 2020 -
5 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 17,296 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా 10 నగరాలు, జిల్లాల నుంచే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ, చెన్నై, థానే, ముంబై, పాల్గఢ్, పుణె, హైదరాబాద్, రంగారెడ్డి, అహ్మదాబాద్, ఫరీదాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 54.47 శాతం జూన్ 19 నుంచి 25 మధ్య నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది. రికవరీ రేటు 58 శాతానికి పెరగడం ఊరటనిస్తోందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనాకూ రాజధానే కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ విలవిల్లాడుతోంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయి 73,780కి చేరుకున్నాయి. ముంబైలో ఏప్రిల్ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఢిల్లీలో 12 రోజుల్లోనే రెట్టింపైతే, ముంబైలో 40 రోజులకి, చెన్నైలో 19 రోజులకి డబుల్ అయ్యాయి. జూన్ 24 నాటికి ముంబైలో మరణాల రేటు 5.7%గా ఉంటే ఢిల్లీలో 3.36%, చెన్నైలో 1.46%గా ఉంది. కాంగ్రెస్ నేత అభిషేక్కు కరోనా కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీకి కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టుగా ఆయన సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలకు వెళ్లారు. సింఘ్వీ భార్యకు కూడా కోవిడ్–19 సోకింది. గువాహటిలో 14 రోజుల లాక్డౌన్ కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో గువాహటి జిల్లాలోని కామ్రూప్ (మెట్రో)లో జూన్ 28 అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ అమల్లోకి రానుందని అస్సాం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట 12 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కరోనా ఆస్పత్రిగా మసీదు దేశంపై కరోనా పంజా విసిరిన వేళ ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలోని శాంతి నగర్ ప్రాంతంలో మసీదుని కోవిడ్ రోగులకు చికిత్సనందించడానికి వీలుగా మార్చారు. ఆక్సిజన్ సిలండర్లు, ఇతర వైద్య పరికరాలతో 5 పడకలను ఏర్పాటు చేయడమే కాదు, స్వల్ప లక్షణాలున్న వారికి 70 మంది వరకు చికిత్స చేసేలా సదుపాయాలు కల్పించారు. మతంతో ప్రసక్తి లేకుండా ఎవరు వచ్చినా చికిత్స అందిస్తామని మసీదుని నిర్వహిస్తున్న జమాత్–ఏ–ఇస్లామీ హింద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. భివాండీ మున్సిపాల్టీలో 1,332 కేసులు నమోదైతే మృతుల రేటు 5.26 శాతంగా ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement