పాత సామాను దుకాణంలో పేలుడు | Sakshi
Sakshi News home page

పాత సామాను దుకాణంలో పేలుడు

Published Mon, Sep 28 2015 2:29 PM

Two injured, Blast incident in Old utensils shop

దేవరకద్ర(మహబూబ్‌నగర్): పాత ఇనుప సామాను దుకాణంలో పేలుడు సంభవించి ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక తహశీల్దార్ ఆఫీసు రోడ్డులోని ఓ పాత సామాను దుకాణంలో సిబ్బంది ఇనుప వస్తువులను సుత్తితో కొట్టి వేరు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అజిలాపురం గ్రామానికి చెందిన మల్లమ్మ(55), గద్వాలకు చెందిన వెంకటేశం తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా, బండరాళ్లను పగులగొట్టే వ్యక్తులెవరో పాత వస్తువులతో కలిపి జిలెటిన్‌స్టిక్స్‌ను విక్రయించి ఉంటారని, ఆ విషయం తెలియక వాటిని వేరుచేసే క్రమంలో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement