* అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దైదె న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక దానిపై కమిటీ వేస్తే... ఫ్యాక్టరీని అడ్డగోలుగా ప్రైవేటుకు కట్టబెట్టారంటూ నివేదిక ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. రానురానూ ప్రభుత్వ రంగం కుంచించుకుపోతుందని, ప్రైవేటురంగమే ముందుకు వస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల జోక్యం చేసుకుంటూ.. పై వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఎన్డీఏ సర్కారులో టీడీపీ భాగస్వామ్యంగా ఉందని, ఆ సమయంలో నిజాం కాలం నాటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మారని మంత్రి మండిపడ్డారు. హెచ్ఎంటీ, ఆంధ్రా స్పిన్నింగ్, హెచ్ఏఎల్లను ఎవరు మూసేశారని ప్రశ్నించారు. అనంతరం ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. తెలంగాణలో పని జరగకుండా చూడాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో జాప్యాన్ని గమనిస్తే కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
బీసీ గురుకులాలకు సన్న బియ్యం
తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలకు బీపీటీ రకం సన్నబియాన్ని సరఫరా చేయాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ‘మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల’ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆయన ప్రారంభించారు. బీసీ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలలో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చాలీచాలని కూరలతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించేవారన్నారు.
నిజాం షుగర్స్ను అమ్మడాన్ని వైఎస్ వ్యతిరేకించారు
Published Tue, Nov 25 2014 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నోటుతో ఓటుకు ఎర
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం
No Headline
కందుకూరులో.. ఇక దూకుడే
సీఎం సవాల్ను స్వీకరించే దమ్ముందా చంద్రబాబూ?
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
గెలిపించండి.. అండగా ఉంటా
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement