పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ

Published Thu, Nov 27 2014 12:50 PM

TDP issue whip for Appropriation Bill

హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ గురువారం విప్ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై రేపు అసెంబ్లీలో జరిగే ఓటింగ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్లో పేర్కొంది. ఈ విషయంపై  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సభలో విప్ అందచేశామన్నారు.  విప్ను ఉల్లంఘించాలనుకుంటే పదవులుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సండ్ర వెంకట వీరయ్య సూచించారు.

 

Advertisement
Advertisement