* సీఎం పదవిని కాపాడుకోవడానికి చేరికలకు ప్రోత్సాహం
* కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మండిపాటు
తాండూరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్కు నమ్మకంలేదని.. ఉన్న 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు ఉన్నారని.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పరోక్షంగా హరీష్రావును ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు. సీఎంకు సొం త పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకంలేకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు వాళ్లను తీసుకొస్తున్నారన్నారు. ‘తీగల’ వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి వర్గంలో, నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. 2005 లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరితే.. అది ప్రజాస్వామ్యపద్ధతి కాదని, వారిపై అనర్హత వేటు వేయాలన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించా రు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు.
మహబూబ్నగర్ను నిర్లక్ష్యం చేస్తూ జూరాల,నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకువస్తానని చెబుతుం డటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ కాలం పనిచేయదని, టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలనే కేసీఆర్ కల నెరవేరదని అన్నారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి ఎలాంటి అ భ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వస్తే తాను తెలంగాణ సీఎం అవుతానన్నది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. అందరికీ ఆశలు ఉంటా యి.. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రేవంత్రెడ్డి పేర్కొన్నా రు. మంత్రులు డమ్మీలు అని, సీఎం నకిలీ మాటల నాయకుడు అని ఆయన తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు.
‘సిద్దిపేట’వెంట 20మంది ఎమ్మెల్యేలు
Published Sat, Nov 1 2014 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement