సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్రస్థాయి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. సరుకుల పంపిణీలో కీలకమైన రేషన్ డీలర్ల మాయాజాలానికి తెరవేసేందుకు ఆకస్మిక తనిఖీలకు నడుంబిగించింది. జాయింట్ కలెక్టర్ మొదలు.. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌరససరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లంతా కలిసి ఇరవై బృందాలుగా ఏర్పడి సోమవారం మూకుమ్మడిగా తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 75 దుకాణాలను పరిశీలించారు.
ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్రమంగా కొనసాగుతున్న డీలర్లు.. ప్రజలకు పంపిణీ చేసే సరుకులు బొక్కేసిన నిర్వాహకుల బాగోతాలు వెలుగుచూశాయి. రేషన్ దుకాణాల్లో బినామీలు పాతుకుపోయినట్లు యంత్రాంగం గుర్తించింది. సోమవారం మల్కాజిగిరి డివిజన్లో 75 దుకాణాలను తనిఖీ చేయగా అందులో పది శాతం బినామీలే ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిపై పౌరసరఫరాల చట్టం ప్రకారం సెక్షన్7, 407 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా మరికొన్ని దుకాణాల్లో సరుకుల పంపిణీ తర్వాత మిగులు సరుకుల కోటాలోనూ భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఇకనుంచి తనిఖీలే తనిఖీలు..
రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల గుట్టు తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా వరుసగా వారం రోజుల పాటు తనిఖీల ప్రక్రియ కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి దుకాణాల్లో సరుకుల పంపిణీపై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8వరకు తనిఖీలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తనిఖీ చేస్తారు.
‘రేషన్’లో అక్రమాలు
Published Mon, May 25 2015 11:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement