మోత్కూరు : మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయ్యారనే వార్త శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. మునగాలకు చెంది న డి.కవిత, కరీంనగర్ జిల్లాకు చెందిన బాలరాజు మండల కేం ద్రంలో అబ్బాస్ చిల్డ్రన్ హోంను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది చిన్నారులు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఇందులో కోశాధికారిగా ఎం.వెంకటేశ్వర్లు, ట్యూటర్గా ఓర్సు జ్యోతి, ఆయాగా గొలుసుల లక్ష్మమ్మ పనిచేస్తున్నారు. దీని నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి నిధులు వస్తున్నట్టు తెలిసింది. అవి దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ గుట్టు రట్టవుతుందనే నిర్వాహకులు చిల్డ్రన్ హోంను మూసివేసినట్టు తెలుస్తోంది.
అప్రమత్తమైన అధికారులు
చిల్డ్రన్ హోం నుంచి 27 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని లీగల్సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తంచేశారు. రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య మూసివేసి ఉన్న చిల్డ్రన్హోం వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు.
చిన్నారులు ఏమైనట్టు..?
చిల్డ్రన్హోం ఈ నెల 18వ తేదీ రాత్రి నుంచి మూతబడినట్టు అందులో పనిచేస్తున్న ఆయా గొలుసుల లక్ష్మమ్మ పేర్కొంది. ఈ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్న సాయికుమార్, వేముల శివకృష్ణ, రవిశంకర్ను నిర్వహకులు బాలరాజు, కవిత గత జూన్ 24న మోత్కూరు పట్టణం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేయించినట్లు ఎంఈఓ విచారణలో తేలింది. దసరా సెలవుల వరకు ఈ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయినట్లు హాజరు రిజిస్టర్లో ఉంది. కాగా, అక్టోబర్ 17,18 తేదీల్లో చిల్డ్రన్హోంలో మీటింగ్లు నిర్వహించినట్లు సీఐ విచారణలో ఆయమ్మ గొలుసు ల లక్ష్మమ్మ తెలిపింది. నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే నేపథ్యంలో నిర్వహకులు చిల్డ్రన్హోం ను మూసివేశారా?, పిల్లలను ఇతర చోటుకు తరలించారా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా, 5 గురు పిల్లలతో కవిత తన తల్లిదండ్రులతో నకిరేకల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన 22 మంది పిల్లలు ఏమయ్యారనే విషయం తేలాల్సి ఉంది.
కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం
Published Sat, Nov 1 2014 3:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement