- గొంతుకోసి చంపిన వైనం
- స్నేహితులపైనే అనుమానం?
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మల్యాల : మండలంలోని నూకపల్లి శివారులో బుధవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యూడు. గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నారు. హత్యాస్థలాన్ని పరిశీలిస్తే కొద్ది సేపు పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్నేహితులే చంపారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ విజయ్రాజ్, ఎస్సైలు శ్రీనివాస్, ప్రవీణ్కుమార్ గురువారం పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు.
సంఘటన స్థలంలో వైద్యుడి రాసిన చీటితోపాటు, రెండు ద్విచక్ర వాహనాల తాళం చెవులు లభించాయి. మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులోని వైద్యుడి చీటి ప్రకారం కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన అఖిలేశ్రావు(25)గా గుర్తించినట్లు జగిత్యాల సీఐ విజయ్రాజ్ చెప్పారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్నేహితులే హంతకులా?
తన స్నేహితుల దగ్గరకు వెళ్తున్నానని బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడని మృతుడి తండ్రి సత్యనారాయణ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల దాటిన ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిపారు. అరుుతే సంఘటన స్థలానికి వచ్చిన మృతుడి మరో మిత్రుడు మాట్లాడుతూ తనకు రాత్రి ఫోన్ చేసి.. తన ఫ్రెండ్స్తో మద్యం సేవించానని, గొడవ అవుతుందని చె ప్పినట్లు పేర్కొన్నారు. అరుుతే దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వెళ్లిన వాహనాల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతుడి స్నేహితుల వివరాలు ఆరా తీస్తున్నారు.
వరద కాలువ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
వరద కాలువ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మూడేళ్ల క్రితం కోరుట్ల మండలం కల్లూరుకు చెందిన ఓ వివాహితను హత్య చేసి ఇక్కడే పడేశారు. నూకపల్లి అర్బన్హౌసింగ్ శివారులోని మామిడితోటల్లో జగిత్యాల మండల నర్సింగాపూర్కు చెందిన యువకుడిన దారుణంగా హత్య చేశారు. పోలీసుల నిఘా కరువవడంతో వరదకాలువ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
యువకుడి దారుణ హత్య
Published Fri, Jul 3 2015 4:03 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
Advertisement