ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో సినీ నటీ రెజీనా సందడి చేసింది. బుధవారం జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి షాపింగ్మాల్లో ఉన్న చీరలు, ఇతర డ్రెస్సులను వీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్కు రావడం సంతోషంగా ఉందని, మొదట హైదరాబాద్నుంచి ఇక్కడికి రావాలంటే దూరమవుతుందని ఆలోచించానని చివరకు ఇక్కడికి వచ్చిన తర్వాత అభిమానులను చూసి సంతోషంగా ఉందన్నారు.
వరసిద్ధి షాపింగ్మాల్ ప్రారంభించడం ద్వారా జిల్లాలో అందుబాటులోకి అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలో రాణించడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమం అనంతరం బయల్దేరే ముందు ఆమెకోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు రెజీనా అభివాదం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కేకలు ఈలలతో సినిమా రోడ్ మారుమోగిపోయింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరమైంది. మొదటి సారిగా జిల్లా కేంద్రానికి ఓ పాపులర్ హిరోయిన్ రావడంతో ఆమె అభిమానులతో పాటు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమె వెంట జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, షాపింగ్మాల్ యజమానులు అనిల్ చల్లావార్, సాయికృష్ణ చల్లావార్లు ఉన్నారు.
సినీ నటి రెజీనా సందడి..
Published Wed, Mar 15 2017 9:08 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
Advertisement