న్యూ ఢిల్లీ: పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తమ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
లలిత్మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ల రాజీనామాలకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పక్షం చర్చకు సిద్ధమంటుంటే.. ముందు రాజీనామా చేసిన తరువాతే చర్చ అని ఎవరికి వారు భీష్మించుకున్నారు. రెండువారాలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో అఖిలపక్షాన్ని సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.