మోదీ పర్యటనకు ముందు జమ్మూలో కాల్పులు | Sakshi
Sakshi News home page

మోదీ పర్యటనకు ముందు జమ్మూలో కాల్పులు

Published Fri, Nov 28 2014 10:47 AM

Gunfight in Jammu hours ahead of Narendra Modi's arrival

జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు జమ్మూకాశ్మీర్ సరిహద్దున హింస చెలరేగింది. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం మోదీ జమ్మూ రానున్నారు. ఆ రాష్ట్ర రెండో విడత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు.

గురువారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్నియా వద్ద ఉగ్రవాదులు భారత స్థావరాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించారు.

Advertisement
Advertisement