సాక్షి, న్యూఢిల్లీ : నగర అగ్నిమాపక శాఖకు దీపావళినాటి రాత్రి 293 కాల్స్ వచ్చాయి. గత ఐదేళ్లలో ఇన్ని కాల్స్ రాలేదని సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. దీపావళి రోజు సాయంత్రం మొదలుకుని శుక్రవారం ఉదయం ఏడుగంటల వరకు మొత్తం 293 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 55 కాల్స్ బాణాసంచావల్ల జరిగిన అగ్నిప్రమాదాలకు సంబంధించినవన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య తమకు అత్యధికంగా 37 కాల్స్ వచ్చాయని, రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు 73 వచ్చాయన్నారు.
సాధారణంగా దీపావళి రోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఎక్కువ కాల్స్ వచ్చేవన్నారు. ఈ సంవత్సరం మాత్రం ఈ సమయంలో తక్కువగా వచ్చాయన్నారు. అగ్నిపమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టమూ లేదని, మంటలను ఆర్పే ప్రయత్నంలో తమ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని మరో అధికారి చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో ఓ చిన్న దుకాణంలో చెలరేగిన మంటలను ఆర్పుతుండగా గాయపడినట్లు చెప్పారు. సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.గాయపడిన ఇద్దరు ఉద్యోగులను చికిత్స కోసం సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఆయన తెలిపారు.
దీపావళి రోజున డీఎఫ్ఎస్కు చెందిన మూడు వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది విధుల్లోఉన్నారు. మంటలను ఆర్పడం కోసం 180 వాహనాలను మోహరించారు. సేవల సమన్వయం కోసం 25 నుంచి 30 వాహనాలను వినియోగించారు.కాశ్మీర్ గేట్ వద్ద కారు విడిభాగాలమార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం గురువారం నాటి ప్రమాదాలనంటిలోనూ పెద్దది. ఓ మూడంతస్తుల భవనంలో చె లరేగిన మంటలను ఆర్పడం కోసం అగ్నిమాపక శాఖసిబ్బంది మూడు గంటలపాటు శ్రమించారు. దీపావళి పూజ అనంతరం యజమానులు దీపాలు ఆరిపోకముందే దుకాణాలు మూసి వెళ్లిపోయారు. అవి పెద్దఎత్తున అంటుకుని మంటలు భవనం కింద అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్స్ వెల్లువ
Published Fri, Oct 24 2014 10:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement