మహాత్ముడికి వైఎస్ఆర్ సీపీ నేతల నివాళి | Sakshi
Sakshi News home page

మహాత్ముడికి వైఎస్ఆర్ సీపీ నేతల నివాళి

Published Thu, Oct 2 2014 11:31 AM

మహాత్ముడికి వైఎస్ఆర్ సీపీ నేతల నివాళి - Sakshi

హైదరాబాద్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని  వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయంలోని లాల్‌ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేశారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీలు విజయసాయిరెడ్డి,  పీఎన్వీ. ప్రసాద్‌, వైఎస్ఆర్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్‌లు పాల్గొన్నారు. గాంధీజీ పుట్టిన రోజంటే జాతికే పర్వదినమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలు.. ఆశయాలు మరుగున పడిపోకుండా వాటిని పాఠ్యాంశాలుగా చేర్చాలని ఆయన కోరారు.

 

Advertisement
Advertisement