దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి

Published Sat, Nov 28 2015 12:22 PM

jyothi rao pule death anniversary in gandhi bhavan

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలను భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) తెలిపారు. అయితే అంబేద్కర్కి ఇస్తున్న గౌరవం పూలేకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్లో జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement