మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Aug 6 2017 5:09 PM

road accident in makthal

మహబూబ్‌నగర్: జిల్లాలోని మక్తల్ మండలం, కాచ్వార్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌ వైపు నుంచి వస్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా చామన్‌పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement