భార్య గొంతుకోసి హత్య సంక్రాంతి రోజే దారుణం
కేవీబీ పురం(పిచ్చాటూరు): మద్యానికి డబ్బు ఇవ్వలేదని గొంతుకోసి భార్యను హత్య చేసిన సంఘటన కేవీబీపురం మండలం సీకే పురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సీకేపురానికి చెందిన కృష్ణయ్య(49), అముద(37) 19 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రమ్య(17), శశి చంద్రిక(8) కుమార్తెలు ఉన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ఆదిత్య మిల్లులో అముద, పెద్ద కుమార్తె రమ్య కూలి పని చేస్తున్నారు.
కృష్ణయ్య కూడా అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మానేశాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బు కోసం తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. శనివారం తెల్లవారుజామున అముద కేకలు వేసింది. పక్క గదిలో పడుకున్న పిల్లలు లేచి వెళ్లారు. కృష్ణయ్య పరుగులు తీస్తూ కనిపిం చాడు. లోపలికి వెళ్లి చూడగా తల్లి అముద రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్థానికులు వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందింది. పండుగ రోజే హత్య జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ సాయినాథ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి పెద్ద కుమార్తె రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దార్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మద్యానికి డబ్బివ్వలేదని..
Published Mon, Jan 16 2017 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శిక్షణలో నేర్పించే అంశాలు
ప్రభుత్వబడిలో చదివి జిల్లా ఫస్ట్ వచ్చింది
కళ్లు చల్లబడ్డాయా.. బాబు!
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నికల సంఘం
టీడీపీ ప్రలోభాల పర్వం
శిక్షణలో నేర్పించే అంశాలు
పోలింగ్ బూత్ల వద్ద భద్రత కట్టుదిట్టం
వేసవిలో ప్రత్యేక రైళ్లు
బీసీలందరికీ అండగా ఉంటా
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement