⇒సింహాద్రి హత్య కేసులో ముగ్గు్గరిని అరెస్ట్ చేసిన ద్వారకా పోలీసులు
⇒ఇద్దరితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న మృతుని బావవివరాలు వెల్లడించిన ఏసీపీ
⇒రామచంద్రరావు, సీఐ రాంబాబు
సీతమ్మధార (విశాఖ ఉత్తరం) : ఆస్తి తగాదాలు, చిన్నచిన్న గొడవలు పెరిగి పెద్దవై హత్యకు దారి తీశాయి. సొంత చెల్లెలి భర్తే కిరాయి మనుషులతో బావమరిదిని హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకునేలా చేశాయి. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన వంకల సింహాద్రి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గతంలో ఉన్న ఆస్తి తగాదాల వల్లే సొంత చెల్లెలు భర్త పథకం ప్రకారం హత్య చేయించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం మధ్యాహ్నం ద్వారక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పి.రామచంద్రరావు వెల్లడించారు.
గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వంకల సింహాద్రి చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి విషయంలో చెల్లెలి భర్త వీనుకొండ వీర వెంకట సురేష్తో తరచూ గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఏదో ఒక విషయంపై సింహాద్రి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేందుకు బావ ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో మార్చి నెల ప్రారంభంలో (హత్య జరగడానికి వారం రోజుల ముందు) జరిగిన కొట్లాటలో బావను సింహాద్రి కొట్టాడు. దీంతో పగ తీర్చుకోవడంతోపాటు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ భావించాడు.
రూ.5 లక్షలకు ఒప్పందం
కొటక్ మహేంద్రలో బీమా మేనేజర్గా పనిచేస్తున్న సురేష్ తన వద్ద ఏజెంట్గా పనిచేస్తున్న కొల్లపల్లి జ్యోతి భాస్కర్ శ్రీధర్(20)కు జరిగిన కొట్లాట విషయం చెప్పి ఎలాగైనా సింహాద్రిని అంతమొందించాలని కోరారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఉద్యోగరీత్యా ఏడాది కిందట నగరానికి వచ్చి మద్దిలపాలెం సమీపంలోని కృష్ణా కళాశాల వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉంటున్న తన స్నేహితుడు కాండ్రేగుల సాయిరాం (22) అలియాస్ చిరుతను సురేష్కు పరిచయం చేశాడు అనాథ అయిన సాయిరాం గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడు. సింహాద్రి హత్య చేసేందుకు వీరిరువురితో సురేష్ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం మంచి ఉద్యోగాలు ఇప్పస్తానని కూడా చెప్పారు.
తీవ్ర పెనుగులాట తర్వాత హత్య
ఈ నెల 9న గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సింహాద్రి ఇంటికి శ్రీధర్, సాయిరాం వెళ్లి తలుపుకొట్టారు. సింహాద్రి తలుపు తీసిన వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య ఘటనతో బిత్తరపోయిన సింహాద్రి ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలోనే ఉన్న బీరువా, టీవీ అద్దం పగిలి ధ్వంసమయ్యాయి. అక్కడే లభించిన గాజు ముక్కతో సింహాద్రి గొంతులో సాయిరాం గుచ్చడంతో కుప్పకూలిపోయి మరణించాడు. హత్య జరిగిన తర్వాత నిందితులిద్దరూ చేతులు కడుక్కునేందుకు సురేష్ నీళ్లిచ్చి సత్యం జంక్షన్ వద్ద ఉండమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి వారిద్దరికీ తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోమని రూ.15వేలు ఇచ్చాడు. మరసటి రోజు ఇసుకతోట దరి ఒక బార్ వద్దకు వెళ్లి ఇద్దరికీ రూ.30 వేలు ఇచ్చాడు.
మిస్టరీ ఛేదించిన పోలీసులు
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింహాద్రి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో ఈ నెల 11న ద్వారక పోలీసులు రంగంలోకి దిగారు. ముందు నుంచీ ఆస్తి తగాదాలే హత్యకు దారితీసి ఉంటాయని భావించిన పోలీసులు మృతుడి బావ సురేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు.అతడి ఫోన్కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసిన ఇద్దరితోపాటు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అయన అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్ఐలు బి.మురళి, కె.మధుసూదనరావు, అడపా సత్యారావు, ఏఎస్ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు ఎన్.జ్యోతేశ్వరరావు, శంకర్, ఆగస్టిన్ పాల్గొన్నారు.
బావే సూత్రధారి
Published Wed, Mar 22 2017 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement