భీమవరం అర్బన్ : మోసపూరిత హామీలిచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నయవంచనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పో రాటం చేస్తున్నారని, దీనిలో భాగంగా తణుకులో ఈనెల 31, వచ్చేనెల 1న ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం బుధవారం భీమవరం వచ్చిన నాయకులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నివాసంలో సమావేశమయ్యారు.
పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రుణమాఫీ హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచి లక్షలాది మందికి పెన్షన్ అందకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నిలువునా ముంచారు
మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, పంట కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెబుతూ సీఎం చంద్రబాబు రైతులను వంచిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీలిచ్చి కేవలం రూ.10 వేలు రివాల్వింగ్ ఫండ్గా ఇస్తామనడం తగదన్నారు. బాబు వస్తే జాబు, నిరుద్యోగుల భృతి అంటూ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు వాటి అమలుకు ప్రయత్నించడం లేదని విమర్శించారు.
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు
ప్రజా సమస్యలపై యువత ప్రశ్నిం చడం లేదని, మౌనంగా ఉండిపోతోందని చెబుతున్న సినీ నటుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో సమస్యలపై, అమలుకాని చంద్రబాబు హామీలపై ఎందుకు ప్రశ్నించడం లేదని భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తొలి సంతకం అంటూనే రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధ, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజు సూరి, మచిలీపట్నం మునిసిపాలిటీ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, ముదునూరి సుబ్బరాజు, కోడే యుగంధర్, మద్దాల సత్యనారాయణ పాల్గొన్నారు.
‘నయ వంచన’పై జగన్ పోరాటం
Published Thu, Jan 29 2015 3:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement