'వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా?' | Sakshi
Sakshi News home page

'వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా?'

Published Sun, Apr 19 2015 8:20 AM

'వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా?'

నెల్లూరు: రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదన్న మంత్రికి నెల్లూరులో వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా అని సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వతీరును అసెంబ్లీలో ఎండగడతామని కాకాని తెలిపారు. ఈనెల 25న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో పబ్లిక్ అకౌంట్స్ కమీటీ పర్యటించనుందని చెప్పారు.

Advertisement
Advertisement