ఒంగోలు సబర్బన్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గడబిడ మొదలవుతుందని కాపు సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఒంగోలులో శనివారం కాపు సంఘాల ఆధ వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక రాజపానగల్ రోడ్డులో జయరాం సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రిలే దీక్షలు ప్రారంభించారు. జిల్లా కాపు సంఘ అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో నాయకులు గొర్రెపాటి అర్జున్రావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళన చేస్తే ఎందుకంత ఆక్రోశమని ధ్వజమెత్తారు.
ముద్రగడ ఆమరణ దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బీసీల్లో చేర్చే వరకు ఆందోళనలు ఆపేది లేదని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జీవో 30ని వెంటనే అమలు చేయూలని డిమాండ్ చేశారు. ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో కాపులకు హామీలు ఇవ్వటం, అనంతరం విస్మరించటం ఓపికతో భరిస్తూ వస్తున్నారని, ఇక అంత ఓపిక లేదని అన్నారు. బీసీ ఉద్యమ నేతగా ఎదిగిన ఆర్.కృష్ణయ్య టీడీపీ తరఫున తెలంగాణాలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఏం పని అని ప్రశ్నించారు. ఏమైనా ఉంటే తెలంగాణాలో రాజకీయాలు చేసుకోవాలన్నారు. చంద్రబాబు ద్వంద్వ విధానాన్ని, నాన్చుడు ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. దీక్షలో కొక్కిరాల సంజీవ్కుమార్, గొర్రెపాటి అర్జునరావు, వై.వెంకటేశ్వరరావు, తాటిపర్తి వెంకటరంగారావు, చెంగలశెట్టి కుసుమకుమారి, పసుపులేటి గోవిందరావు, నాగిశిట్టి బ్రహ్మయ్య, బేతంశెట్టి హరిబాబు, గాదిరెడ్డి కిషోర్, వెలనాటి మాధవరావు, దండే రామారావు, వేలం వె ంకటేశ్వరరావు, ఆరిగ మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.
దీక్షకు మద్దతు తెలిపిన వారిలో గాదె వెంకటకృష్ణ, ఆరిగ చలమయ్య, కుర్రా ప్రసాదబాబు, దండే వెంకటకృష్ణారావు, తోట సోమశేఖర్, గంటా రమణయ్య, గంటా రాము, వెలనాటి హరిబాబు, పాలెం సురేష్బాబు, ఆరిగ శంకర్, ఉమ్మడిశెట్టిశ్రీనివాసరావు, ఆరిగ వీర ప్రతాప్, చెంగలశెట్టి శ్రీనివాసరావు, చాకిరి ధనుంజయ, ఆరిగ శివ, పోదుల మల్లిఖార్జునరావు, వరదా నాగేశ్వరరావు, పోకల సత్యం, కావలి శ్రీనివాసులు, చొప్పవరపు శ్రీనివాస్(ఓఎంసి), పసుపులేటి కొండయ్య, చిక్కాల రామారావు తదితరులు ఉన్నారు.
ముద్రగడను చూస్తే చంద్రబాబుకు గడబిడ
Published Sun, Feb 7 2016 6:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భరత్ను ఎందుకు దూరం పెడుతున్నారు?
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
బీఆర్ఎస్ టీషర్టు విప్పించిన కాంగ్రెస్ నాయకులు
రాజమౌళికి వివాదాస్పద ప్రశ్న.. ఆయన ఏమన్నారంటే?
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
పింఛన్ కోసం వెళ్తూ..
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement