మంత్రులకు చంద్రబాబు క్లాస్! | Sakshi
Sakshi News home page

మంత్రులకు చంద్రబాబు క్లాస్!

Published Fri, Aug 1 2014 6:33 PM

మంత్రులకు చంద్రబాబు క్లాస్!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్లాస్‌ తీసుకున్నారు.  పనితీరు బాగోలేదని సగానికిపైగా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిని వెళ్లగక్కారు. 
 
పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడులు కేటాయిస్తూ మంత్రులకు చంద్రబాబు షాకిచ్చారు. ఏ గ్రేడులో ఆరుగురు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పించినట్టు తెలిసింది. మంత్రుల పనితీరును ప్రతిరోజు సమీక్షించేందుకు రహస్య యంత్రాంగం ఏర్పాటు చేశారు.  
 
వంద రోజుల తర్వాత పూర్తి స్థాయి గ్రేడుల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు పంపారు.

Advertisement
Advertisement