పోలీసుల వేధింపులతోనే చనిపోతున్నా... | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులతోనే చనిపోతున్నా...

Published Sat, Mar 28 2015 10:05 AM

పోలీసుల వేధింపులతోనే చనిపోతున్నా... - Sakshi

గుంటూరు: పోలీసులు తరచుగా తనను వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలివీ... బొనిగల రోశయ్య(35) ఈనెల 26న రాత్రి విధి నిర్వహణలో భాగంగా బస్సు నడుపుతుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఢీకొట్టి చనిపోయాడు. అతని మృతికి రోశయ్యే కారణమంటూ విచారణ చేపట్టిన పొన్నూరు అర్బన్ ఎస్సై ఎంవీ చరణ్ కేసు నమోదు చేశారు. ఇదే విషయమై కొంతకాలంగా ఎస్సై తనను వేధిస్తున్నారంటూ ఆందోళన చెందిన రోశయ్య శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభ్యమైంది. రోశయ్య మృతికి పోలీసులే కారణమని ఆయన బంధువులు పొన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కాగా, రోశయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
(పొన్నూరు)

Advertisement
Advertisement