ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం

Published Tue, Mar 31 2015 6:28 AM

12 members injured in a road accident in ananthapur district

కొత్తచెరువు (అనంతపురం) : అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొడపగాని పల్లె వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. షిరిడి నుంచి కర్ణాటకలోని బాగేపల్లికి తిరుగు ప్రయాణంలో బస్సు కనగానిపల్లె సమీపంలో అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం, పుట్టపర్తిలోని ఆస్పత్రులకు తరలించారు.

Advertisement
Advertisement