‘బీజేపీతోనే అభివృద్ధి’ | Sakshi
Sakshi News home page

‘బీజేపీతోనే అభివృద్ధి’

Published Sat, May 4 2024 7:35 AM

-

సారంగపూర్‌: మోదీ పదేళ్ల పాలనలో దేశం సుభిక్షంగా ఉందని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ అధికారిమిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సాయినగర్‌తండా, రాంసింగ్‌తండా, దుప్యాతండా, ఆదివాసిగూడ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలకు కేంద్రమే నిధులు మంజూరు చేసిందని వివరించారు. చిరు వ్యాపారులకు రుణాలు, మహిళల ఆర్థిక ఎదుగుదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. హిందువుల 500 ఏళ్ల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని పే ర్కొన్నారు. నిర్మల్‌ ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డిని ఆదరించినట్లుగానే తన ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, రాజేందర్‌రెడ్డి, విలాస్‌, విజయ్‌, తిరుమలచారి, నానక్‌ సింగ్‌, గంగారెడ్డి, తేజు, రాజారెడ్డి, మధు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement