-
వరదలపై సన్నద్ధంగా ఉండాలి
● గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ సతీష్ కుమార్ ● ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ధవళేశ్వరం: వరదల సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా వీటిని ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ ఆర్.సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి వరదల సీజన్ సమీపిస్తున్నందున ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్మినెంట్, సెంట్రల్, టెంపరరీ ఫ్లడ్ స్టోర్స్లో వరద సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రమాద స్థాయిలో వరదలు వచ్చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు తదితరల శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమష్టి కృషితో వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరదల సమయంలో ధవళేశ్వరంలో ఏర్పాటు చేసే ఫ్లడ్ కంట్రోల్ రూముకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని సతీష్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈలు ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, కె.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, డీఈలు యు.రమేష్, వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, కె.సుబ్బారావు, ఏఈలు అద్దంకి సాయిరామ్, ప్రసాద్, రాధాకృష్ణ, విశ్వనాథరాజు, సుబ్బారావు, నాగలక్ష్మి, సునీల్బాబు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
రాయవరం: సమాజంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవనాన్ని సాగిస్తున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. వీటిలో ముఖ్యంగా హైపర్టెన్షన్ అత్యంత ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె, మెదడు, నరాలు, కిడ్నీపై బీపీ దుష్ప్రభావాన్ని చూపుతోంది. ఒక్కోసారి పక్షవాతం, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యాలతో ప్రాణాలకు హాని చేస్తోంది. చాలా మందికి బీపీ ఉందన్న విషయాన్ని గమనించే లోపు ఆ వ్యాధి వలన కలిగే అనర్థాలతో శరీరంలోని పలు అవయవాలు దెబ్బ తింటున్నాయి. శుక్రవారం ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... సైలెంట్ కిల్లర్ శరీరంలో అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడితో (ప్రెజర్) రక్తాన్ని పంపిస్తుంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింప చేసే శక్తినే బ్లడ్ ప్రెజర్గా పేర్కొంటారు. ఒక వ్యక్తి గుండె సాధారణ స్థితిలో బీపీ 120/80గా పేర్కొంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే పరిగణించాలని సూచించింది. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. చాలామందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్టు కూడా తెలియక ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి బీపీ చెక్ చేయించుకోవాలి. నేటి ఆధునిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో హైపర్ టెన్షన్ ప్రధాన సమస్యగా మారింది. హైపర్ టెన్షన్లో అసాధారణ రీతిలో 160/100, 170/110, 200/120 చూపుతుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి మెదడు, గుండెలోనూ నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదముంటుంది. కరోనా అనంతరం మనిషి జీవన స్థితిగతులు మరింత జటిలం అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా అనంతరం యువతలో సైతం హైపర్ టెన్షన్ ప్రభావం అధికంగా ఉందనే అభిప్రాయం ఉంది. ఇటీవల 20–30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు సాధారణంగా అధిక రక్తపోటు వయసు మళ్లిన వారికి వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పనిచేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపోథెరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ద్వారా బీపీ వస్తుంది. 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ల వద్దకు చికిత్స కోసం వెళ్లేవారిలో అధిక శాతం మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారు. వీరి వద్దకు చికిత్సకు వెళ్తున్న వారిలో 20 నుంచి 30 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు ఉంటున్నారన్నది ఒక అంచనా. ప్రభుత్వం ఎన్సీడీ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేయించి బీపీ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తోంది. జిల్లాలో 14,85,148 మందిని స్క్రీనింగ్ చేయగా, వారిలో 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్టు ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించారు. 1,07,053 మంది డయాబెటీస్ పేషెంట్స్, 70,491 మంది హైపర్ టెన్షన్, సుగర్ వ్యాధిని కలిగి ఉన్న వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. ఉచితంగా ప్రభుత్వ సేవలు గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లోనే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించి ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, మందులు కూడా అందజేస్తోంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు హైపర్ టెన్షన్తో బాధపడే రోగులు ముఖ్యం గా ఆహార పదార్థాల్లో ఉప్పును తక్కువగా వినియోగించాలి. మసాలాలు, నిల్వ పచ్చళ్లు, కారం తగ్గించాలి. ప్రతి రోజూ గంటపాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ లక్షణాలు మెడ నరాల లాగేస్తున్నట్టు ఉండడం. కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచుగా తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం. యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిర్లుగా ఉండడం. అధిక రక్తపోటుతో అనర్థాలు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమే నేడు వరల్డ్ హైపర్టెన్షన్ డే -
తీపర్రు ఇసుక ర్యాంపుపై అధికారుల దాడి
పెరవలి: తీపర్రు ఇసుక ర్యాంపుపై విజిలెన్స్, మైనింగ్ అధికారులు గురువారం ఉదయం 10.30 గంటలకు దాడి చేశారు. మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ టి.గోపాలకృష్ణ, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రాత్రి 10 గంటల వరకూ తనిఖీలు చేశారు. వారిని చూసి నిర్వాహకులు, సిబ్బంది పరారయ్యారు. రెండు పొక్లెయిన్లు, రెండు లారీలు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశామని ఏడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తీపర్రు ఇసుక ర్యాంపులో ఇసుక తవ్వకాలకు 2025 వరకూ అనుమతులు ఉన్నాయని, ఇక్కడ 48 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకూ ఎంత మేర తవ్వకాలు జరిపారో లెక్కలు వేయాలన్నారు. దాడులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ర్యాంపు తమ సొంత స్థలమని, ఇక్కడ తమ లారీలు ఎప్పుడూ ఉంటాయని, వాటిని ఎలా స్వాధీనం చేసుకుంటారని వాటి యజమానులు ప్రశ్నించారు. ర్యాంపులో లారీలు ఉన్నందున కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెప్పారు. -
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ధాటికి ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమేపీ అడుగంటుతున్నాయి. దీంతో దిగువ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున రోజురోజుకూ నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 68.95 మీటర్లు, 24,11 టీఎంసీలకు గాను 3.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 54 వేల ఎకరాలకు రాబోయే రోజుల్లో సాగు నీరందని పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. దీంతో పాటు దిగువ ఏలేరు కాలువలో నీటి సరాఫరా నిలిపివేయడంతో పశువులు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పశువులతో పాటు, సమీప గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయినా, విశాఖపట్నానికి నీటిని తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులో నీటిని మోటార్ల సాయంతో పది పైపుల ద్వారా విశాఖ పట్నానికి 140 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఖరీఫ్పై అనుమానాలు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో పాటు, వరిసాగు పూర్తి కావడంతో ఏలేరు కాలువకు నీటి సరాఫరా నిలిపివేశారు. ప్రస్తుత నీటినిల్వల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖరీఫ్ సాగుపై ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిని బట్టే ఆయకట్టులో సాగు ఆధారపడి ఉంటుంది. అలాంటిది నీటి నిల్వల తగ్గుదలతో రైతులు నిరాశ చెందుతున్నారు. -
No Headline
పథకాలే చోదక శక్తి? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టి నవరత్నాలు పథకాల వల్ల సింహభాగం కుటుంబాలు లబ్ధి పొందాయి. చాలా కుటుంబాలు ఐదేళ్లలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు లబ్ధి పొందాయి. సంక్షేమ ఫలాలన్నీ మహిళల పేరు మీదే అందించడం, నేరుగా వారి అకౌంట్లలోనే నగదు జమ చేస్తుండటం వల్ల ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడినట్లు తెలిసింది. అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ రుణాలు, ఇంటి పట్టాలు, విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం. భరోసా తదితర పథకాలకు సంబంధించి మహిళల అకౌంట్లలోనే నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఎలాంటి లాంచాలకు తావులేకుండా పారదర్శకంగా అమలవుతుండటం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లడం, పథకాలు ప్రకటించినా అధికారంలోకి వచ్చాక అమలు చేయరన్న అపనమ్మకంతో ఫ్యాన్కు మద్దతు పలికారు. జగన్ ఓడిపోతే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయన్న ఆందోళన నెలకొంది. పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్ సీపీకే మద్దతు పలకాలన్న భావనతో గంపగుత్తగా తరలివచ్చి సీఎం జగన్కు మద్దతు ప్రకటించారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
డీవీఈవో సుబ్రహ్మణ్యం సస్పెన్షన్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) జేవీఎస్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ వివరాలను ఇంటర్బోర్డు అధికారులు బుధవారం వెల్లడించారు. ధవళేశ్వరం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న జేవీఎస్ సుబ్రహ్మణ్యంపై వేధింపుల ఆరోణలు వచ్చాయి. కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో ఆమె నెల రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకులను, మహిళా అధ్యాపకులను తీవ్రంగా వేధిస్తారని సుబ్రమణ్యంపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
రాజానగరం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను ఈనెల 17, 18 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
కాకినాడ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులకు మొదటి జాబితా సీట్లను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించామని జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు. మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ద్రాక్షారామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలురకు, కాకినాడ సాంబమూర్తి నగర్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం బాలికలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. ఆయా విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే సమాచారం అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఇతర సమాచారం కోసం జి.దేవి 63040,97747, వి.ప్రసాద్బాబు 94404 99016 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు రెండేళ్ల జైలు
ధవళేశ్వరం: ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు రెండ్లేలళ్ల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డి విజయ్ గౌతమ్ తీర్పు ఇచ్చారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ 11వ తేదీ రాత్రి సుమారు 15 ఏళ్ల బాలుడు వెళుతుండగా ధవళేశ్వరం కంచర్లలైన్ వద్ద అప్పలబత్తుల కృష్ణవంశీ, కూరపాటి సతీష్, ఉమ్మాడి సాయిగణేష్ దాడి చేశారు. బాలుడి వద్ద ఉన్న అతడి తాతయ్యకు చెందిన మోటారు సైకిల్తో ధవళేశ్వరం ప్రభుత్వాస్పత్రి సమీపానికి తీసుకువెళ్లారు. అనంతరం బాలుడి వద్ద ఉన్న రూ.100, వాచీని బలవంతంగా లాక్కుని గాయపరిచారు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి చేరిన బాలుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి సీఐ కె.మంగాదేవి కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్దిరెడ్డి శంభూ ప్రసాద్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ముగ్గురికి పైవిధంగా శిక్ష విధించారు. కాగా.. కేసును పురోగతి సాధించేందుకు కృషి చేసిన అప్పటి సీఐ కె.మంగాదేవి, డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, ప్రస్తుత సీఐ జీవీ వినయ్ మోహన్, ఏఎస్సై జి.వెంకటేశ్వర్లును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. -
ఉచిత నిర్బంధ విద్య పిల్లల హక్కు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉచిత నిర్బంధ విద్య పొందడం ఆరేళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లల హక్కు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్బాబు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నివారణపై కార్మిక శాఖ, ఇతర సమన్వయ శాఖల సహకారంతో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చిన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరమని, ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పిల్లల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలందరికీ మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం మనందరి అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని బృందాలను ఏర్పరచి పట్టణంలోని పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని, ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ కే.విజయ కుమారి, డీఈవో కె.వాసుదేవరావు, అర్బన్ డీఐ బి.దిలీప్కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ పి.సూర్యప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది, ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు. -
No Headline
● వైఎస్సార్ సీపీ గెలుపునకు సోపానాలు కానున్న సంక్షేమ పథకాలు ● లబ్ధి పొందిన మహిళలే పార్టీ గెలుపులో కీలకం అంటున్న విశ్లేషకులు ● అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం పథకాల్లో లబ్ధి ● పురుషుల కంటే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్న వైనం ● ఓటు వేసిన 6.66 లక్షల మహిళలు, 6.47 లక్షల పురుషులు సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఓటరు జాబితాలోనే కాదు.. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల గెలుపును నిర్ణయించే శక్తిగా అవతరించారా? ఇందుకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో అత్యధిక శాతం మంది పాల్గొనడం నిదర్శనంగా నిలుస్తోందా? అతివల ఆశీస్సులు ఉన్నవారే అధికార పీఠం కై వసం చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి అనుకూలతను చేకూరుస్తుందన్న భావన వెల్లడవుతోంది. ‘తూర్పు’లో ఓటెత్తిన మహిళలు సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా మహిళలు ఓటెత్తారు. ఏడు నియోజకవర్గాల పరిధిలోనూ వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రతి నియోజకవర్గంలోనూ పురుష ఓటర్ల కంటే మహిళలే అగ్రస్థానంలో నిలిచారు. ఇందుకు ఎన్నికల అధికారులు వెల్లడించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, పింఛనుదారులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ఈ పరిణామం ఓటింగ్ పెంపునకు ఎంతగానో దోహద పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా 16,23,149 మంది ఓటర్లున్నారు. అందులో మహిళలు అత్యధికంగా 8,30,735 మంది ఉండగా.. పురుషులు 7,92,317 మంది ఉన్నారు. ఇతరులు 97 మంది. ఓటర్ల జాబితాలోనూ మొదటి స్థానంలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగంలోనూ పైచేయి సాధించారు. ఎన్నికల్లో పురుషులు 6,47,474 మంది ఓటేయగా.. వారి కంటే ఎక్కువగా మహిళలు 6,66,113 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే ఎక్కువగా 18,639 మంది మహిళలు ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపై మహిళల ప్రభావం అధికంగా ఉంటుందన్న చర్చ బలంగా నడుస్తోంది. మహిళలు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయం తథ్యమంటూ లెక్కలు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీలో ధీమా సార్వత్రి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పోలింగ్ శాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 66.55 శాతంగా ఉన్న పోలింగ్ అనంతరం క్రమంగా పుంజుకుంది. మహిళలు, వృద్ధులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఇదే సమయంలో ఓటేసేందుకు రావడంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికలు ముగిసే సమయానికి ఏకంగా 80.93 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ పరిణామం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో గుబులు రేపుతోంది. సాయంత్రం మహిళలు, వృద్ధులు అధిక శాతం ఓటేశారు. ఆయా వర్గాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో తమ పరిస్థితేంటన్న మీమాంస ఆ పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్టు సమాచారం. ప్రతి ఒక్కరిలో విస్తృత చర్చ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఏ ఇద్దరు కలిసినా పెరిగిన ఓటింగ్ శాతం, మహిళలు అత్యధికంగా పాల్గొనడంపైనే నడుస్తోంది. ఇరు పార్టీల మద్దతు దారులు పోటీ పడి ఓట్లు వేసేందుకు తరలిరావడంపై మరింత చర్చ సాగుతోంది. పథకాలతో ఆర్థిక పురోగతి సాధించిన పేద, మధ్యతరగతి వర్గాలు అధికార పార్టీ అభ్యర్థులకే మద్దతుగా నిలిచి ఓట్లేశారని జనం విశ్వసిస్తున్నారు. మహిళా ఓటింగ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.25,436 కోట్ల సంక్షేమంపేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్న తలంపుతో ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే రూ.25,436 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందించింది. అమ్మ ఒడి కింద రూ. రూ.234 కోట్లు, వసతి దీవెన రూ.65.56 కోట్లు, విద్యాదీవెన రూ.142.99 కోట్లు, సున్నా వడ్డీ రూ.145.94 కోట్లు, వైఎస్సార్ ఆసరా రూ.728.9 కోట్లు, శ్రీనిధి రూ.374.58 కోట్లు, కాపునేస్తం రూ.174.44 కోట్లు ఇలా ప్రతి పథకానికి రూ.కోట్లల్లో నిధులు వెచ్చించింది. ఫలాలు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఈ పరిణామం సైతం ఓటింగ్ శాతం పెరిగేందుకు దోహదపడిందన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. జిల్లాలో మహిళా ఓటర్ల శాతం ఇలా..నియోజకవర్గం ఎన్నికల్లో పాల్గొన్న అధికం పురుష మహిళా ఓటర్లు ఓటర్లు అనపర్తి 96,161 98,761 2,600 రాజానగరం 94,571 94,928 357 రాజమండ్రి సిటీ 87,192 93,517 6,325 రాజమండ్రి రూరల్ 97,530 1,01,673 4,143 కొవ్వూరు 77,991 80,182 2,191 నిడదవోలు 89,198 91,488 2,290 గోపాలపురం 1,04,831 1,05,564 733 -
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కార్ మార్కెట్లోకి విడుదల
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సరికొత్త ఫీచర్లతో, జెడ్ సిరీస్ ఇంజన్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన స్విఫ్ట్ కార్ను ఎస్బీఐ డివిజనల్ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ మిశ్రా రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారు. స్థానిక లాలాచెరువులోని ఎస్బి మోటార్స్ షోరూమ్లో మంగళవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్బీఐ డీజీఎం ప్రమోద్ కుమార్ మిశ్రా, రీజనల్ మేనేజర్ తటవర్తి శ్రీనివాస్, వర్ధమాన నటుడు గోల్డెన్రెడ్డి, ప్రముఖ రచయిత మను శ్రీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాల వారిని సైతం ఆకట్టుకునేలా ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును మార్కెట్లోకి విడుదల చేయడం శుభ పరిణామం అన్నారు. ఎస్బీ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రామ్కుమార్, జనరల్ మేనేజర్ ఎంవీఎస్ఎస్ఆర్ గుప్తా మాట్లాడుతూ నేటి యువతరానికి నచ్చేలా.. మెచ్చేలా సరికొత్త భద్రతా ప్రమాణాలతో ఈ కారును తూర్పుగోదావరి జిల్లా మార్కెట్లోకి తీసుకురావడం ఆనందదాయకమన్నారు. ఈ సరికొత్త స్విఫ్ట్ కారు 25.75 కిలోమీటర్ల మైలేజీతో నడవడం మరో అద్భుతం అన్నారు. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ను అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
భవిత భద్రం
ఫ జిల్లాలో 80.93 శాతం పోలింగ్ ఫ అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటెత్తిన మహిళలు ఫ స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎంలు ఫ గెలుపోటముల అంచనాల్లో నేతల తలమునకలుసాక్షి, రాజమహేంద్రవరం: దాదాపు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతలతో కొద్ది నెలలుగా చెలరేగిపోయిన సూర్యుడు కొద్ది రోజులుగా కాస్త శాంతిస్తున్నాడు. వాతావరణ మార్పులతో ఉష్ణతాపం నుంచి కాస్త విరామం లభిస్తోంది. మండిపోయిన ఎండలకు తోడా అన్నట్టుగా కొద్ది నెలలుగా పెరిగిన పొలిటికల్ హీట్కు కూడా ప్రస్తుతానికి తెర పడింది. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ చూడని విధంగా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అర్ధరాత్రి వరకూ పోలింగ్ ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం కాస్త మందకొడిగా నమోదైనా.. సాయంత్రం ఓటర్లు అధిక సంఖ్యలో పోటెత్తారు. మహిళలు అత్యధికంగా ఓటు బాట పట్టడం విశేషం. సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. అనంతరం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంతో పాటు, దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలను రాజానగరం సమీపంలోని నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. సాయంత్రం 5 గంటలకు 66.55 శాతం ఓటింగ్ జరగగా.. పోలింగ్ ముగిసే సమయానికి అది ఏకంగా 80.93 శాతానికి చేరింది. ఫ జిల్లావ్యాప్తంగా మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా వీరిలో 13,13,645 మంది ఓట్లు వేశారు. వీరిలో పురుషులు 6,47,474 మంది ఉండగా, అత్యధికంగా 6,66,113 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ జిల్లాలో అత్యధికంగా రాజానగరం నియోజకవర్గంలో 87.53 శాతం పోలింగ్ నమోదైంది. ఫ అత్యల్పంగా రాజమండ్రి సిటీలో 67.57 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ కాస్త పెరిగింది. ఆ ఎన్నికల్లో ఇక్కడ 66.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఫ అనపర్తిలో 86.23, కొవ్వూరు 85.90, నిడదవోలు 84.67, గోపాలపురం 86.67 చొప్పున పోలింగ్ శాతం నమోదైంది. ఫ రాజమండ్రి రూరల్లో 2014 ఎన్నికల్లో 73.97 శాతం, 2019లో 74.21 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 73.02 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. ఫ రాజానగరంలో 2014లో 85.93 శాతం, 2019లో 87.83 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి అది 87.53గా నిర్ధారణ అయ్యింది. టెన్షన్.. టెన్షన్ ఫ ఇన్నాళ్లుగా ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు.. పోలింగ్ పూర్తవడంతో గెలుపోటములపై అంచనాలు వేయడం మొదలుపెట్టారు. ప్రత్యర్థికి ఎక్కడ అనుకూలంగా ఓట్లు పోలయ్యాయి, మన బలమెంత, విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై కసరత్తు ప్రారంభించారు. ప్రత్యర్థి కంటే ఎలక్షనీరింగ్ సమర్థంగా నిర్వహించామని, కచ్చితంగా విజయం తమనే వరిస్తుందని భావిస్తున్నారు. ఎక్కడ ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా పోలయ్యాయనే లెక్కలు తీస్తున్నారు. ఎవరికి లాభమో! మొత్తం మీద జిల్లాలో పోలింగ్ భారీగానే జరగడం, ఓట్లు వేసిన వారిలో మహిళలే అధికంగా ఉండటం ఎవరికి లాభం చేకూరుస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలికారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనేందుకు నిదర్శనమనే భావన ప్రజల్లో కలుగుతోంది. కొందరు యువతీ యువకులు సైతం తమ విద్యావసరాల కోసం జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరిన కారణంగా సీఎం వైఎస్ జగన్ పాలన తిరిగి రావాలని ఓటు వేసినట్లు బహిరంగంగా వెల్లడించడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది ఓటర్లు వచ్చారని సమాచారం.స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు సోమవారం రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈవీఎంలను కేంద్ర బలగాల రక్షణలో నన్నయ వర్సిటీలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. వర్సిటీ నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరచి సీల్ వేశారు. రికార్డులు, ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సమక్షంలో స్క్రూట్నీ నిర్వహించారు. అందులో ఎటువంటి లోపాలూ లేకపోవడంతో పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి ఈవీఎంలను వచ్చే నెల 4న కౌంటింగ్ సమయంలో తిరిగి బయటకు తీయనున్నారు. జిల్లాలో పోలింగ్ వివరాలు ఇలా.. నియోజకవర్గం మొత్తం పోలైన ఓట్లు ఓటర్లు అనపర్తి 2,26,053 1,94,924 రాజానగరం 2,16,491 1,89,505 రాజమండ్రి 2,67,484 1,80,733 సిటీ రాజమండ్రి 2,72,826 1,99,220 రూరల్ కొవ్వూరు 1,84,136 1,58,176 నిడదవోలు 2,13,396 1,80,688 గోపాలపురం 2,42,763 2,10,399తూర్పున ఫ్యాన్ గాలి? జిల్లాలో మళ్లీ ఫ్యాన్ గాలి బలంగా వీచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ స్థానం పక్కాగా గెలుపొందే అవకాశం ఉందని చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో మళ్లీ ఫ్యాన్ గాలి వీచ్చే సూచనలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. అనపర్తి, రాజానగరంలో ఫ్యాన్ గిర్రున తిరిగే అవకాశం ఉంది. రాజమండ్రి సిటీ, రూరల్లో టీడీపీ కంచుకోటలు బద్దలయ్యే సూచనలున్నాయని భావిస్తున్నారు. -
ఏపీఆర్జేసీ ఫలితాలలో తిరుమల హవా
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎంపీసీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, బైపీసీ విభాగంలో సెకండ్ ర్యాంకులతో పాటు టాప్టెన్లో ఎనిమిది ర్యాంకులను సాధించి అత్యుత్తమ ఫలితాలను అందించారని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమి చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జే.యశ్వంత్సాయి స్టేట్ ఫస్ట్ర్యాంకును, జి.ప్రభవ్తేజ స్టేట్ సెకండ్ ర్యాంకును, ఎం.మారుతి సత్యశ్రీకర్ స్టేట్ సెకండ్ ర్యాంకును, పీవీఎన్ సూర్యధావన్ రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకును, బీఎస్ఎస్ భవ్య రాష్ట్రస్థాయి ఆరవ ర్యాంకును, ఎంకెఎస్ సాకేత్ రాష్ట్ర స్థాయి ఆరవ ర్యాంకును, డి.శ్రీవేద్ రాష్ట్రస్థాయి 8వ ర్యాంకును, సీహెచ్ త్రివేణి రాష్ట్రస్థాయి 10వ ర్యాంకును కై వసం చేసుకున్నారని ఆయన తెలిపారు. 10లోపు 8మంది, 50లోపు 26మంది, 100లోపు 46మంది ర్యాంకులు సాధించారని నున్న తిరుమలరావు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
రత్నగిరికి కల్యాణశోభ
ఫ 18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఫ 24 వరకూ నిర్వహణ ఫ 19వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం అన్నవరం: సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారికి ఎడమ భాగాన లక్ష్మీదేవి అంశగా దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున శంకరుడు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే దివ్యధామం ఈ హరిహర క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విఖ్యాతం. కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై గత నెల 28వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించారు. నిత్య కల్యాణాలు రద్దు కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు. సీతారాములే పెళ్లి పెద్దలు భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం. ఇదీ కల్యాణోత్సవాల క్రమం ఫ మే 18: వైశాఖ శుద్ధ దశమి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులుగా అలంకరిస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఫ మే 19: వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి 9 నుంచి 11.30 గంటల వరకూ రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఫ మే 20: వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం నిర్వహిస్తారు. ఫ మే 21: వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం నిర్వహిస్తారు. ఫ మే 22: వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొండ దిగువన దేవస్థానం గార్డెన్స్లో సత్యదేవుని వనవిహారోత్సవం. ఫ మే 23: వైశాఖ పౌర్ణమి గురువారం ఉదయం 8.30 గంటలకు పంపా నదిలో స్వామివారి శ్రీచక్రస్నాన మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన కార్యక్రమాలు. ఫ మే 24: వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం రాత్రి 7 గంటలకు నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా రథోత్సవం సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వామివారికి రూ.1.04 కోట్ల వ్యయంతో భారీ టేకు రథంపై నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథాన్ని ఇప్పటికే గత నెల 26న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆ రథానికి రంగులు వేసే కార్యక్రమంతో పాటు, ఆరు చక్రాలకు పట్టీలు, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు, ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసి, ఆ రోజు ఉదయం 9 గంటలకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ వేయనున్నారు. దీనికోసం రథం ఉన్న పంపా సత్రం గేట్లు తొలగించి ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. పంపా సత్రం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా సత్యదేవుని తొలి పావంచా వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ పంపా సత్రానికి తీసుకుని వస్తారు. రథాలను లాగడంలో అనుభవం కలిగిన ధవళేశ్వరానికి చెందిన నిపుణులను ఈ రథోత్సవానికి తీసుకుని వస్తున్నామని అధికారులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులకు మంత్రి వనిత కృతజ్ఞతలు
దేవరపల్లి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాదాపు మూడు నెలలుగా రేయింబవళ్లు వైఎస్సార్ సీపీ విజయానికి సైనికుల్లా పని చేసిన గోపాలపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లకు పార్టీ అభ్యర్థి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపులో కూడా ఏజెంట్లు ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని ఆమె కోరారు. నాలుగో తేదీన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు నన్నయలో భద్రం రాజానగరం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూములకు సాయుధ బలగాల బందోబస్తు నడుమ తరలించారు. కొన్ని కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీంతో రాత్రంతా ఈవీఎంలను నన్నయ వర్సిటీకి తీసుకుని వస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము వరకూ వచ్చిన ఈవీఎంలను ఆయా రిసెప్షన్ కౌంటర్ల ద్వారా స్వీకరించారు. అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో వాటిని పరిశీలించి, నియోకవర్గాల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఆయా గదులకు సీల్ వేసి, కేంద్ర బలగల రక్షణ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎ.చైత్రవర్షిణి, రాజమండ్రి లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీసు యంత్రాంగానికి ఎస్పీ అభినందనలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేసిన కృషిని ఎస్పీ పి.జగదీష్ మంగళవారం ఒక ప్రకటనలో అభినందించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. పక్కా ప్రణాళికతో పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి, ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై కేసు నిడదవోలు రూరల్: మండలంలోని రావిమెట్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేసిన ఘటనలో ఇద్దరి టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై రమేష్ మంగళవారం తెలిపారు. రావిమెట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ చిలుకూరి చిట్టిప్రసాద్కు, టీడీపీ కార్యకర్తలకు సోమవారం పోలింగ్ సమయంలో ఎన్నికల బూత్ వద్ద వివాదం తలెత్తింది. దీంతో చిట్టిప్రసాద్పై టీడీపీ కార్యకర్తలు కొట్టేందుకు వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన చిట్టిప్రసాద్ కుమారుడు భవానీ శివశంకరకుమార్పై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు భవానీ శివశంకర్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ కార్యకర్తలు రాంగోను శ్రీను, రాంగోను సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
దాడి కేసు నమోదు
రాయవరం: మండలంలోని కూర్మాపురంలో సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడి కేసు నమోదు చేసినట్లు రాయవరం ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వీరబోయిన వీరవెంకటదుర్గాప్రసాద్ వలంటీర్గా పనిచేసి ఇటీవల రాజీనామా చేశాడు. సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సమయంలో వలంటీర్ బయట వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీకి చెందిన చెక్కు మహేష్ మరో 13 మంది దుర్గాప్రసాద్ వద్దకు వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడకు ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలు
● వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు ● మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యకు గాయాలు ● ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ కాకినాడ: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటమి భయంతో టీడీపీ నేతలు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. ఏదో ఒక విధంగా అలజడులు సృష్టించి పోలింగ్కు అంతరాయం కలిగించి ఓటర్లను భయపెట్టే లక్ష్యంతో చేసిన వీరి ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఘర్షణలో కాకినాడ వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణ(సత్య) గాయపడ్డారు. కాకినాడలో టీడీపీ కవ్వింపు చర్య కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలో పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా కనిపించడంతో కొంతమంది టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఉదయం నుంచి ఈ తరహాలో రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఓ దశలో జగన్నాథపురం ప్రాంతానికి చెందిన వనమాడి ఉమామహేశ్వరరావు, చింతా కామేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రోకళ్ళ సత్యపై దాడి చేశారు. ఘటనలో రోకళ్ళ చేతికి గాయమై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ రోకళ్ళను కలిసి పరామర్శించారు. ఘర్షణ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆస్పత్రికి వెళ్లి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరపలో దౌర్జన్యం కాకినాడ రూరల్ కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో జనసేన నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలింగ్బూత్ వద్ద దాడికి దిగారు. చేతిలోని సెల్ఫోన్ లాక్కుని దౌర్జన్యం చేశారు. స్థానిక నాయకులు చింతా సత్యనారాయణపై ఈ దాడి జరిగింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పాడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కృష్ణునిపాలెంలో లాఠీచార్జి జగ్గంపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతమైన కృష్ణునిపాలెంలో టీడీపీ నేతల కవ్వింపు చర్యలు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యూలో ఉన్న ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పల్లంలో టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో మల్లాడి చిన ధర్మారావు, నరసింహమూర్తి గాయపడ్డారు. ఇరువురు పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మల్లాడి చిన ధర్మారావుకు తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు 13 కుట్లు వేశారు. మల్లాడి నరసింహమూర్తి తలకు బలమైన గాయం కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ వర్గీయులు దాడిలో అరధాని శ్రీను గాయపడ్డారు. పల్లంలో అడుగడుగునా ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుండలేశ్వరం, కందికుప్ప, బలుసుతిప్ప తదితర గ్రామాలలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయులు కొట్లాటకు దిగారు. ముమ్మడివరం సీఐ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు చేరుకుని ఇరువర్గాలను చెదర గొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. పల్లంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు
వైభవంగా రుద్రహోమం ఐ.పోలవరం: నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువు జరుగనుంది. సోమవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, పంచవింశతి, కలశస్థాపన పూర్వక అభిషేకం, సరస్వతి హోమం, రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించిన ్ఙసూర్య ప్రభశ్రీ వాహనంపై ఊరేగించారు. పచ్చిపూలతో స్వామివారి, అమ్మవారి అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో భారీ చలువ పందిళ్లు, పచ్చిపూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం
యానాం: యానాం పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సోమవారం ఎస్పీ రాజశేఖరన్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్లో సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు గల పురుషుని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. పురుగు మందు వంటి విష పదార్థాలను సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని యానాం జీజీహెచ్ మార్చురీకి తరలించినట్లు చెప్పారు. వివరాలు తెలిసినవారు యానాం పోలీస్స్టేషన్ 0884–2321244, 6300035449, 978555246కు ఫోన్ చేయాలని కోరారు. -
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారుల అలసత్వం
ఓట్లు వేసే పరిస్థితి లేక వెవెనుదిరిగిన ఓటర్లు కాట్రేనికోన: మండలంలో బ్రహ్మసమేథ్యం, పల్లం పంచాయతీలలో అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటు వేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నా అంటీముట్టనట్టు వ్యవహరించడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలుసుతిప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలలో లోపలికి వెళ్లేందుకు మాత్రమే మార్గం ఉండటం, ఓటు వేసి బయటకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సహితం గ్రామాలకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ సజావుగా సాగకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ఓటర్లు మండి పడ్డారు. కనీసం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోఅధికారులు విఫమయ్యారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో జరిగిన తోపులాటలో మహిళలకు గాయాలు అయ్యాయి. ఈ ప్రాంతంలో మరొక పాఠశాల భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇరుకు గదులలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పడుతున్న ఇబ్బందులపై మీడియా ప్రతినిధులు తహసిల్దారు దాసరి ప్రశాంతిని వివరణ కోరగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు విషయంలో తనకు సంబంధం లేదని, ఎన్నికల కమిషనర్, ఆర్ఓలు చూసుకోవలసి ఉందన్నారు. -
జగన్ వెంటే జనం
రాజానగరం నియోజకవర్గంలో విజయం నాదే. రానున్న ఎన్నికల ఫలితాల్లో ఇదే నిజం కాబోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఒకేఒక ఆకాంక్షతో ఎక్కువ మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పట్టి ఓట్లతో గెలుపును అందిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటా. రాష్ట్రం కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూటమి ఎన్ని కుయుక్తులు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాజానగరం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement