ఎర్రవల్లిచౌరస్తా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ ఎంపీ, బీఎస్పీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మందా జగన్నాథం అన్నారు. బీఎస్పీలో చేరిన సందర్భంగా గురువారం ఎర్రవల్లి మండలంలోని కొండేరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలంతా ఏకదీక్షతో బాబా సాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలన్నారు. అన్ని రంగాల్లో కూడా బహుజనులు పైకి రావడానికి అంబేద్కర్ చేపట్టిన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి బీఎస్పీ ఉద్దేశాలను వివరించాలన్నారు. రేపటి నుండే కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి ఎం.జి కృష్ణ, జిల్లా అద్యక్షుడు రాంబాబు, నాయకులు రాజు, సునంద, యేసురాజు, సవరన్న, వెంకట్, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
విజయమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి
Published Fri, Apr 19 2024 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement