సీఎం జగన్‌కు వీఆర్‌ఏ సంఘం నేతల కృతజ్ఞతలు  | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు వీఆర్‌ఏ సంఘం నేతల కృతజ్ఞతలు 

Published Sat, Oct 14 2023 4:42 AM

Village Revenue Assistants Association leaders call on Andhra CM Jagan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: వీఆర్‌ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు.   ఏపీజీఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్‌ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement
Advertisement