-
అమెరికాలో దారుణం.. ప్రోమ్ పార్టీపై కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇంట్లో జరుగుతున్న హైస్కూల్ ప్రోమ్ పార్టీపై కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో 9 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అమెరికాలోకి టెక్సాస్లో జాస్పర్ కౌంటీలో ఉన్న ఓ ఇంట్లో హైస్కూల్ ప్రోమ్ పార్టీ జరుగుతోంది. ఈ సందర్భంగా పిల్లలందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ దుండగుడు ప్రోమ్ పార్టీపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పుల్లో గాయపడిన వారంతా 15-19 ఏళ్ల మధ్య వారుగా తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక, కాల్పల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు జాస్పర్ కౌంటీ షరీష్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కాల్పలకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
ఆ దుర్ఘటన కళ్లముందే మెదులుతోంది
తణుకు : ‘బస్సు వేగంగా వెళుతోంది.. అర్ధరాత్రి.. అందరం గాఢ నిద్రలో ఉన్నాం.. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ పెద్ద శబ్దం.. ఒక్కసారిగా కుదుపు.. కళ్లు తెరిచి చూస్తే నీళ్లల్లో ఉన్నాం.. చుట్టూ హాహాకారాలు.. ఇంతలో కొందరు యువకులు వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టి మమ్మల్ని బయటకు తీశారు.. అప్పుడు తెలిసింది మేం ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైందని’. ఇదీ ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడినlతణుకు మండలం పైడిపర్రుకు చెందిన గొర్రె లక్ష్మి, నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణిల మనోగతం. వీరిని సోమవారం అర్ధరాత్రి తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిద్దరికీ ఛాతీ, నడుంభాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో సొంత జిల్లాలోనే చికిత్స అందజేయాలనే ఉద్దేశంతో వీరిని ప్రత్యేక అంబులెన్సులో ఖమ్మం నుంచి తణుకు తరలించారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నారు. ఇప్పటికీ ఘోర దుర్ఘటన దృశ్యాలు తమ కళ్లముందే కదలాడుతున్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు. కూతురి వెంట వెళ్లి.. తిరుగు ప్రయాణంలో.. నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణి కూతురు, అల్లుడు హైదరాబాదులో ఉంటున్నారు. ఈనెల 19న కుమార్తె ఆకుల పుణ్యసాయి హైదబాద్ వెళ్తూ తనతోపాటు నాగమణిని తీసుకెళ్లారు. సోమవారం తిరుగు ప్రయాణంలో షాపూర్ వద్ద నాగమణిని కూతురు, అల్లుడు బస్సుక్కించారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే నాగమణి పుష్కరాలు, పెళ్లి ముహూర్తాల వల్ల రైళ్లు ఖాళీ లేకపోవడంతో చివరి నిమిషంలో బస్సు ప్రయాణం ఎంచుకున్నారు. తనతోపాటు నిడర్రుకు చెందిన బంధువు వానపల్లి పెద్దిరాజు అదే బస్సులో ఉండటంతో తోడుగా ఉంటారని ఆ బస్సు ఎక్కారు. డ్రైవర్ వెనుక రెండో సీట్లో కూర్చున్న నాగమణి వెనుక సీట్లో పెద్దిరాజు కూర్చున్నారు. ఈ ప్రమాదంలో పెద్దిరాజు మృతి చెందడంతో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడి వద్దకు వెళ్లి వస్తూ.. తణుకు మండలం పైడిపర్రు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొర్రె లక్ష్మి కుమారుడు రాజు హైదరాబాద్లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కొన్ని రోజులు కుమారుడు వద్ద ఉండి వద్దామని దాదాపు నెల రోజుల క్రితం లక్ష్మి హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి మియాపూర్ వద్ద కుమారుడు రాజు ఆమెను బస్సు ఎక్కించారు. నాగమణి సీటు పక్కనే లక్ష్మి కూర్చున్నారు. వీరిద్దరూ కూర్చున్న సీటుకు ముందున్న రాడ్ వీరిద్దరికీ రక్షణగా ఉండటంతో వీరి ప్రాణాలు దక్కాయి. అయితే సీటు భాగం నొక్కేయడంతో ఛాతీ, నడుం భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement