-
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి.గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్ల్లోని జట్లు తమతమ గ్రూప్ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్లకు, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.దాయాదుల సమరం ఎప్పుడంటే.. పొట్టి ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.మరోసారి హాట్ ఫేవరెట్గా ఆసీస్..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి. 2016 ఎడిషన్లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. -
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది. ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే ‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ సైతం.. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది. ఐసీసీ హర్షం ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్మనీలో సమానత్వం
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్లలో టోర్నీ ప్రైజ్మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా -
బ్యాటింగ్తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లద్దాఖ్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
మెక్గ్రాత్ ఆల్రౌండ్ షో.. పాక్ను మట్టికరిపించిన ఆసీస్
కామన్వెల్త్ క్రీడల మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్-ఏలో హాట్ ఫేవరెట్ అయిన ఆసీస్.. వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయాలతో ఆరు పాయింట్లు సాధించి గ్రాండ్గా సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభ మ్యాచ్లో భారత్పై 3 వికెట్లు తేడాతో గెలుపొందిన ఆసీస్.. ఆతర్వాత బార్బడోస్పై 9 వికెట్ల తేడాతో, తాజాగా పాక్పై 44 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలైన పాక్.. గ్రూప్లో ఆఖరి స్థానంలో నిలిచి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. పాక్.. తమ తొలి మ్యాచ్లో పసికూన బార్బడోస్ చేతిలో, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో, తాజాగా ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్-ఏలో రెండో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు ఇవాళ భారత్-బార్బడోస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆసీస్తో పాటు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 3) రాత్రి 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక ఆసీస్-పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బెత్ మూనీ (49 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్), తహీల మెక్గ్రాత్ (51 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన పాక్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాటింగ్లో రాణించిన తహీల మెక్గ్రాత్ (3/13) బౌలింగ్లోనూ చెలరేగి పాక్ పతనాన్ని శాసించింది. పాక్ బ్యాటర్లలో ఫాతిమా సనా (26 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. చదవండి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్కు మంగళం పాడిన స్టార్ స్పోర్ట్స్.. కారణం అదేనా..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement