-
యువతి కిరాతకం.. అడ్డుగా ఉన్నాడని 11 ఏళ్ల బాలుడిని..
న్యూఢిల్లీ: బాయ్ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లయిందని తెలిసినా.. పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. ఇలా దొరికింది.. హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
ఐదేళ్లుగా పని, నమ్మి ఇంటి తాళం ఇస్తే.. రూ.10కోట్లతో జంప్..
న్యూఢిల్లీ: ఐదేళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని తాళం అతనికే అప్పగించి అమెరికా వెళ్లాడు ఓ యజమాని. తీరా అతనే దొంగతనానికి పాల్పడి రూ.10కోట్లు దోచుకెళ్లాడని తెలిసి షాక్కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన నిందితుని పేరు మోహన్ కుమార్(26). ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని అతని ఇంటి యజమాని తాళాలు అప్పగించి కుటుంబంతో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి యజమానికి ఫోన్ చేశాడు. మోహన్ కుమార్ ఇంట్లో దొంగతనం చేశాడని, డబ్బు, నగలతో పారిపోయాడని తెలియజేశాడు. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మోహన్ ఇంట్లో నుంచి సూట్కేసుతో కారులో పారిపోతున్నట్లు అందులో రికార్డు ఉయ్యింది. అతనితో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు మొదట మైనర్ జాడ కనుగొన్నారు. అతడు మోహన్ బంధువని, బిహార్లోని శివహర్ జిల్లాలో ఉంటున్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడ్ని ఆదివారం అరెస్టు చేశారు. అతడు చెప్పిన వివరాలతో మోహన్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బంధువు మైనర్ అయినందున అతడ్ని జువెనైల్ హోంకు తరలించారు. మోహన్ దొంగతనం చేసిన డబ్బులు, నగలు, వజ్రాల మొత్తం విలువ రూ.10కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిలో కొంతమాత్రమే స్వాధీనం చేసుకున్నామని, మిగతా మొత్తం ఎక్కుడుందో తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు -
అయ్యో భగవంతుడా!.. బతుకులు బుగ్గి చేశావే (ఫోటోలు)
-
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కీలక అంశాలు
నూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కీలక అంశాలు.. ► మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయంలో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. ► భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన కాసేపటి పొగలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీలోంచి కిందకి దూకేశారని, మరికొందరు కిందకి దిగడానికి తాళ్లను ఉపయోగించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు కాగా మరికొందరు మృతి చెందారు. ► భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ బిల్డింగ్ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ►మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్ స్పీచ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►కేవలం ఒక మెట్లు ద్వారం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్ని మాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు. ►అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు తీవ్రంగా శ్రమించాయి. ►బాధితుల గుర్తింపు గురించి పోలీసులు ఇంకా వివరాలు పంచుకోలేదు. ఘటనలో గాయపడిని వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారని, మరికొందరు ఇంకా లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. ►అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం -
ఢిల్లీ ప్రమాదంలో 29 మంది గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 29 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 27 మందిలో ఏడుగురిని ఇప్పటివరకు గుర్తించారు. మంటలను ఆర్పిన అనంతరం శనివారం ఉదయం భవనంలో మాడిమసైన మృతదేహ భాగాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. దీంతో, మృతుల సంఖ్య 30కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనంలో పూర్తి స్థాయి గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలోకి వేర్వేరు పనుల నిమిత్తం వచ్చి గల్లంతైనట్లు భావిస్తున్న 29 మంది ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహాల గుర్తింపు సాధ్యంకాని సందర్భాల్లో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు తెలిపారు. మిస్సయిన 24 మంది మహిళలు సహా మొత్తం 29 మంది జాబితాను పోలీసులు తయారు చేశారు. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న నాలుగంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. భవనం మొత్తానికి ఒకే గేట్ ఉన్న కారణంగా మరణాలు పెరిగాయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. ఏసీ యంత్రం పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామన్నారు. అయితే, ఒకటో అంతస్తులోని సీసీటీవీ కెమెరా ఉత్పత్తి యూనిట్లో మంటలు మొదలయ్యాయనే అనుమానంతో ఆ యూనిట్ యజమానులైన హరీశ్ గోయెల్, వరుణ్ గోయెల్ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. భవనంలోని నాలుగంతస్తులను వీరి కంపెనీయే వాడుకుంటోందని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని అన్నారు. భవన యజమాని మనీశ్ లక్రాపైనే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. శనివారం ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
తప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
Advertisement