-
ఔటర్ చుట్టూ.. వాటర్ వండర్!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ చేపట్టనున్న జలహారం(వాటర్గ్రిడ్) పనుల్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఔటర్ చుట్టూ 18 ప్రదేశాల్లో భూమి పైభాగం నుంచి సుమారు3–4 మీటర్ల లోతున సొరంగమార్గాలు తవ్వి వాటిల్లో రేడియల్ మెయిన్ భారీ తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. సొరంగాలతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లు, రహదారులు, గ్రామాలు దెబ్బతినకుండా చూడవచ్చు. మహానగర దాహార్తిని దూరం చేసేందుకు రూ.4,765 కోట్ల అంచనా వ్యయంతో భారీ రింగ్ మెయిన్ పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, జలమండలి మార్గదర్శకాల మేరకు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో ప్రతి అంశం సాంకేతికంగా ఎన్నో అద్భుతాలకు మూలం కానుండటం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ చుట్టూ 120 మిలియన్ లీటర్ల నీటినిల్వ సామర్థ్యంతో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఈ రింగ్మెయిన్ ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాలను నగరం నలుమూలలకూ కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. దేశంలో ఇప్పటివరకు ఏ నగరంలో లేని తరహాలో ఈ రింగ్ మెయిన్ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం చేయడం విశేషం. నవంబర్ నాటికి ఔటర్ గ్రామాల దాహార్తి దూరం ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 183 పంచాయతీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు పది లక్షల మంది దాహార్తిని ఈ ఏడాది నవంబర్ నాటికి సమూలంగా దూరం చేస్తామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ తాగునీటి పథకంలో ఇప్పటికే 70 గ్రామాల దాహార్తిని దూరం చేసేందుకు 60 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. 615 కి.మీ. మార్గంలో నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు మూడు లక్షల మంది దాహార్తిని దూరం చేశామన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఔటర్ గ్రామాల్లో ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలో ఒకటి, మహేశ్వరం మూడు, శంషాబాద్ 5, సరూర్నగర్ మూడు, రాజేంద్రనగర్ ఏడు, హయత్నగర్ తొమ్మిది, పటాన్చెరు 10, ఘట్కేసర్ 9, కుత్బుల్లాపూర్ ఐదు, కీసర 4, శామీర్పేట్ 4 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. మిగిలిన 112 రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిలో అక్టోబర్లో 20, మిగిలిన వాటిని నవంబర్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు ఇదీ.. రూ. 3,965 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158 కి.మీ. మార్గంలో 3000 ఎంఎం వ్యాసార్థంలో భారీ పైపులైన్ నిర్మాణానికి వ్యయం రూ. 550 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు లోపల 18 చోట్ల 98 కి.మీ. మార్గంలో రేడియల్ మెయిన్ పైపులైన్ల ఏర్పాటుకు.. రూ. 250 కోట్లు - ఔటర్ చుట్టూ 12 చోట్ల భారీ గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ల(జీఎల్ఎస్ఆర్) నిర్మాణానికి.. రూ. 4,765 కోట్లు - మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం... -
ప్రాజెక్ట్ వరద నీటిలోనే మిషన్ భగీరథ
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ప్రస్తుతం నీటి మట్టం 146.80 మీటర్లు కాగా, ఎల్లంపల్లిలో దాదాపు 16 టీఎంసీలపైగా నీటి సామర్థ్యం ఉంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో చేపడుతున్న మిషన్ భగీరథ(వాటర్ గ్రిడ్) పనులు ఇంకా నీట మునిగి ఉన్నాయి. దాదాపు ఆరు రోజులుగా ఈ పనులు మొత్తం నీటిలోనే ఉండటంతో పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం, ప్రాజెక్ట్లో ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రూ. 8 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో స్లాబ్ పనులు పూర్తి కాగా, 20 శాతం పనులు..ఫుట్బ్రిడ్జ్, బ్రిక్స్ వర్క్స్, మోటార్ల బిగింపు తదితర పనులు మిగిలి ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్లో నీటి మట్టం పెరగడంతో ఇంటెక్ వెల్ పనులు నిలిచిపోయాయి. ఓ వైపు సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ కాగా ఇంకా ఈ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు నీట మునగడంతో పనులు తిరిగి ప్రారంభం కావడంతో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఇప్పట్లో వరద నీరు తగ్గే అవకావం కనిపించడం లేదు. ఏది ఏమైనా పనులు ప్రారంభం కావాలంటే నీరు తగ్గే వరకు వేచి చూడటం తప్పదు. -
ఏప్రిల్ 30లోపు తాగునీరివ్వాలి
వాటర్గ్రిడ్పై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం నిర్ణీత సమయంలో పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం ప్రోత్సాహకం శరవేగంగా ఇంటింటికీ నల్లా నీరు అందించాలి పైపులైన్ల అనుమతులకు ప్రత్యేకంగా డీఎఫ్వో వాటర్గ్రిడ్ పనులపై ఐదు గంటలపాటు సమీక్ష సాక్షి, హైదరాబాద్: నిర్ణీత సమయంలో వాటర్గ్రిడ్ పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం అదనపు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. హైదరాబాద్కు మంచినీరు సరఫరా చేసే పైపులైన్ ద్వారా అనుసంధానమయ్యే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోగా మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా సాధించడానికి ప్రత్యేకంగా డీఎఫ్వోను నియమించాలని అటవీ శాఖకు సూచించారు. వాటర్గ్రిడ్ పథకానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేయడానికి అనుగుణంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారమిక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో వాటర్గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి ఐదు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష జరిపారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడి స్థానికంగా ఉండే ఇబ్బందులకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఇన్టెక్ వెల్స్ నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులపైనే ఉందని, అందుకే నీటి సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. రైల్వే క్రాసింగ్ల వద్ద త్వరితగతిన అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. నా పొలం నుంచే పైపులైన్ పోతోంది వాటర్గ్రిడ్ ప్రాధాన్యాన్ని గుర్తించి పనుల్లో వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే.. ఓట్లు అడగబోమని తాను మాట ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇంటింటికీ నల్లా నీటిని ఇచ్చే ఈ పథకంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పారు. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం ఆరు అడుగుల లోతున పైపులైన్ వేయాలని, ఇది ఎవరి భూముల నుంచైనా వేసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో వేసే పైపులైన్ తన వ్యవసాయ భూమి (ఎర్రవెల్లి ఫామ్) నుంచే పోతోందని చెప్పారు. సీఎం మెదలుకుని ఎవరూ చట్టానికి అతీతులు కాదని అధికారులకు చెప్పారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేలా పనులు చేయాలని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పథకాలంటే పది, పదిహేనేళ్లు సాగదీసే అలవాటు ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ పద్ధతి పూర్తిగా మారాలి. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది. వీటిని అనుకూలంగా మలుచుకొని పనుల్లో వేగం పెంచాలి’’ అని చెప్పారు. పరస్పర సహకారం ఉండాలి రైల్వేశాఖ, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల ముఖ్య అధికారులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పరస్పర సహకారంతో ముందుకు పోవాలని వారిని సీఎం కోరారు. విద్యుత్ శాఖ చేస్తున్న ప్రయత్నాలను జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వివరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, సీనియర్ అధికారులు, వివిధ జిల్లాల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తాం'
ఆదిలాబాద్: జిల్లాలోని మోడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సిద్ధిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. వాటర్ గ్రిడ్ కు రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
యూపీలోనూ వాటర్గ్రిడ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వెల్లడి ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంస త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని స్పష్టం యూపీలో అఖిలేశ్తో సమావేశమైన కేటీఆర్ వాటర్గ్రిడ్పై మంత్రి పవర్పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాగునీటి సరఫరా పథకం (వాటర్గ్రిడ్) దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కొనియాడారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కోట్లాది మంది దాహార్తి తీర్చే బృహత్ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ ఆహ్వానం మేరకు గురువారం లక్నో వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.చంద్రశేఖర్రావుకు, వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అధికారుల బృందానికి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. అఖిలేశ్తో పాటు ఆ రాష్ట్ర అధికారులతో కేటీఆర్ బృందం సమావేశమైంది. వాట ర్గ్రిడ్ ప్రాజెక్టు గురించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని గ్రామాలన్నిటికీ మూడున్నరేళ్లలో నల్లా ద్వారా సురక్షిత మంచి నీరందించడమే వాటర్గ్రిడ్ లక్ష్యమని చెప్పారు. నీరివ్వలేని పరిస్థితి తలెత్తితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాజెక్ట్లో భాగంగా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించామని మంత్రి చెప్పారు. పైప్లైన్ల ఏర్పాటు సమయంలోనే ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ కేబుల్స్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నట్లు తెలిపారు. రుణాలిచ్చేందుకు హడ్కో, నాబార్డ్తో పాటు దేశవ్యాప్తంగా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో పర్యటిస్తా: అఖిలేశ్ యాదవ్ వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ తీరుతెన్నుల గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణకు వస్తానని అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేపడతామని, సాంకేతిక సహాయం అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. యువకుడు అయినప్పటికీ మంత్రిగా కేటీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సురేశ్కుమార్, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆ రాష్ట్ర జల నిగమ్ మేనేజింగ్ డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ములాయంతోనూ కేటీఆర్ భేటీ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన విందు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాలపై కొద్దిసేపు ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ లో బృహత్తర పథకాల అమలు పట్ల మంత్రి కేటీఆర్ చొరవను ములాయంసింగ్ యాదవ్ మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement