-
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్నగర్లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..
సాక్షి, చిత్తూరు: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడిపొయింది. ఎవరు చూడకపోవటంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. వివారాల్లోకి వెళితే.. తిరుమల బాలాజీనగర్లోని 689 నెంబర్ గల ఇంటిలో భాను ప్రకాష్, జయంతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం పెద్దపాప శశికళ ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలోకి జారి పడిపోయింది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఊరంగా గాలించగా, ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించలేదు. చదవండి: అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన చివరకి ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. పాప తండ్రీ భాను ప్రకాష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మెత్తకుప్పం. అక్కడి నుంచి బతుకు తెరువు కోసం తిరుమలకు వచ్చి ఓ దుకాణంలో పని చేస్తు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
నీటి టబ్బులో ముగిసిన చిన్నారి ‘జీవిత’ం
కూడేరు : కూడేరు శ్రీనివాసరావు కాలనీలో నివాసముంటున్న నెట్టికంటు, మమత దంపతుల కుమార్తె జీవిత(18 నెలలు) నీటి టబ్బులో పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తల్లీబిడ్డ ఇద్దరూ కలసి సాయంత్రమే నిద్రపోయారు. మధ్యలో పాపకు మెలకువ రావడంతో బాత్రూం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న టబ్బులోని నీటిని చూస్తూ ఒక్కసారిగా అందులోకి పడిపోయింది. కాసేపటికి మెలకువ వచ్చిన మమత, బిడ కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతికింది. చివరకు బాత్రూంలోకి వెళ్లి చూడగా టబ్బులో పడి ఉండడం గమనించి బయటకు తీసి, వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు నిర్ధరించాడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. -
నీళ్ల బకెట్లో పడి బాలుడు మృతి
నిజామాబాద్: జిల్లాలోని బోధన్ శక్కర్నగర్లో ఓ చిన్నారి నీళ్ల బకెట్లో పడి మృతిచెందాడు. తల్లి ప్రమీల స్నానం చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి చందు ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయాడు. తల్లి వచ్చి చూసేసరికి బిడ్డ శవమై తేలాడు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్ : నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన దమ్మిసెల్లి అశోక్ హైదరాబాద్లో ఉంటున్నాడు. సోమవారం తన భార్య ప్రశాంతి, కుమార్తె లీలారాణి (2)తో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల ఇంటివద్ద జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక్కడ చిన్నారి లీలారాణి ఆడుకుంటూ నీళ్లతొట్టెలో పడిపోయింది. బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement