-
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు.. చరిత్ర సృష్టించిన సీఎం జగన్
-
ఏది నిజం?: ప్రాజెక్టులనడుగుదాం.. నీళ్లెవరిచ్చారో?
విశాఖలో రాజధాని కోసం స్థానికులంతా గర్జిస్తే... అప్పుడు రామోజీరావుకు విశాఖలో భూ కుంభకోణాలు కనిపించాయి. రాయలసీమ వాసులంతా ఏకమై మాకు ‘న్యాయ’ రాజధాని కావాలని ఇప్పుడు నినదిస్తే... రామోజీకి సడెన్గా రాయలసీమ వెనకబాటుతనం గుర్తుకొచ్చింది. పూర్తికాని ప్రాజెక్టులు మాత్రమే కనిపించాయి. కానీ... చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 17.85 టీఎంసీల నీళ్లు నిండటం ‘ఈనాడు’కు కనిపించలేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 10 టీఎంసీలను నిల్వచేయటం ప్రస్తావించనే లేదు. ఇక గండికోట రిజర్వాయర్లో గరిష్ఠ సామర్థ్యానికి తగ్గట్టు 26.85 టీఎంసీల నీరు నిల్వచేయటం కూడా రామోజీకి పట్టదు. ఎందుకంటే... ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో చెయ్యలేని పనులు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలోనే సాధించిన విజయాలు. లీకేజీలకు అడ్డుకట్ట వేస్తే బ్రహ్మం సాగర్ బాగుపడుతుందని, పునరావాసం కల్పిస్తే గండికోటలో గానీ, చిత్రావతిలో గానీ గరిష్ఠంగా నీటిని నిల్వ చేయొచ్చని చంద్రబాబు నాయుడికి తెలియదా? మరెందుకు చేయలేదు? అప్పుడెందుకు రామోజీరావు ఇలాంటి కథనాలు రాయలేదు? ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వంపై కూడా పనిగట్టుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి... ‘న్యాయ’ రాజధానిగా చేస్తానని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పటం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. బాబుకు ఇష్టం లేనిదేదైనా... రామోజీకీ నచ్చదు కదా!!. ‘సీమ’ంతైనా మేలు చేశారా... అంటూ వండివార్చిన కథనంలో నిజమెంత? ఏది నిజం? చూద్దాం... ఒక్క నీరే కాదు. పరిశ్రమలు, వైద్య కళాశాలలు... ఇలా రాయలసీమ సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ఐదు వైద్య కళాశాలలు, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటు చేస్తుండటం ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నడుంకట్టారు. ఒకటీ అరా పరిశ్రమలు కాదు... ఏకంగా పారిశ్రామిక క్లస్టర్లతోనే సీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలమైతే.. అక్కడ రాజకీయంగా తమకు నూకలు చెల్లినట్లేనన్నది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన. అప్పుడు తమ డీపీటీకి (దోచుకో..పంచుకో..తినుకో) శాశ్వతంగా తెర పడుతుందనే రామోజీరావు బాధ. అందుకే వికృతరాతలకు ప్రాణంపోస్తూ.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికిపుడు రాయలసీమలో బ్రహ్మంసాగర్, గండికోట, సీబీఆర్, వెలుగోడు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు ఇలా ఏ ప్రాజెక్టును చూసినా ఇపుడు నిండుకుండను తలపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందుతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టుల్లో నాలుగో వంతు కూడా నిండని పరిస్థితి. కొన్నిటికి లీకేజీలు... మరికొన్నిటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవటం... ఇలా అన్నీ సమస్యలే. వాటికి నిధులు ఖర్చుచేసి ప్రాజెక్టుల్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపాల్సిన ప్రభుత్వం ఆ ఊసే గాలికొదిలేసింది. ‘సీమం’తైనా న్యాయం చేయలేకపోయింది. కాకపోతే చంద్రబాబు ఏం చేసినా కరెక్టేనని చెప్పటమే తమ బాధ్యతగా భావించే ‘ఈనాడు’, దాని తోక పత్రిక, ఇతర ఛానెళ్లు ఈ వాస్తవాలను ఎన్నడూ చెప్పలేదు. ఇపుడు మాత్రం అకస్మాత్తుగా వాటికి రాయలసీమ గుర్తుకొచ్చింది. అమ్మో... సీమ అన్యాయమైపోతోందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గరిష్ఠ సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసి గరిష్ఠ సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేద్దామనే ప్రయత్నాలు చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీల నిల్వతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ఖరీఫ్ పూర్తయినా ఇప్పటికీ బ్రహ్మంసాగర్లో 15.11 టీఎంసీల నీరు నిల్వ ఉందనే విషయం రామోజీకి తెలియదా? ఎందుకు రాయరు? గండికోట రిజర్వాయర్ గరిష్ఠ సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం కల్పించే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్ఠంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇలాంటి వాస్తవాలను రాస్తే రాయలసీమకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!!. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ది (సీబీఆర్) కూడా గండికోట లాంటి కథే. దీని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్లో 9.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇదీ వాస్తవం. బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలను తవ్వాలి. ఇందులో ఒకటి మహానేత వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగంలో మిగిలిన 162 మీటర్ల పనులను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేక చేతులెత్తేశారు. ఫాల్ట్ జోన్లోని ఆ సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనంతో ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సొరంగం పూర్తి కాబోతున్నది కూడా. అప్పుడు గాలేరు–నగరి ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించడానికి మార్గం సుగమం అవుతుంది. రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో సొరంగాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. తాకట్టు పెట్టిన బాబే గొప్పా..? రాయలసీమ తాగు, సాగునీటికి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి అక్రమంగా నీటిని తరలించడానికి 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపడితే నాటి సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ ఎడాపెడా నీటిని తోడేస్తే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుంది. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువన ఉంటే కృష్ణా బోర్డు కేటయింపులున్నా సరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో 854 అడుగులకు దిగువన ఉన్నా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షణకు నడుం బిగించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. దీనిపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాకనే రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించాలని ఎన్జీటీ ఆదేశించడంతో.. ఆ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసిన ప్రభుత్వం.. ఆ అనుమతిని తెచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కాకపోతే కబోదిలా మారిన రామోజీకి ఇవేవీ కనిపించవు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబే రామోజీకి ఆదర్శ నాయకుడు. ఎందుకంటే.. తన అక్రమాలకు రక్షకుడు కాబట్టి. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులను రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా రూ.43,336 కోట్ల వ్యయంతో చేపట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. అదీ... సీమకు చేతల్లో చేస్తున్న న్యాయం. వైద్యంతో పాటు ‘న్యాయం’... వైద్య సౌకర్యాలలోనూ రాయలసీమ ముందుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలను, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో వైద్య విద్య సీట్లు పెరగటమే కాదు... మెరుగైన వైద్యమూ అందుబాటులోకి రానుంది. ఇక శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుతో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఇప్పటికే ఈ నిర్ణయంలో భాగంగా లోకాయుక్త, వినియోగదారుల కోర్టుతో సహా కొన్ని న్యాయాధికార ప్రాంగణాలు అక్కడ కొలువుదీరాయి. హైకోర్టు రావాలంటూ యావత్తు రాయలసీమ ఉద్యమిస్తోంది కూడా. కాకపోతే రామోజీరావుకు ఈ వాస్తవాలతో పనిలేదు. అందుకే అసలు రాయలసీమ వాసులెవ్వరికీ అక్కడ న్యాయస్థానం రావాలని లేదని, అందరూ అమరావతికే కట్టుబడి ఉన్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలెట్టారు. తాను కర్నూలు వెళ్లి అడిగానని, అక్కడి వారంతా అమరావతి రాజధానిగా ఉండటానికే అంగీకరించారని చెప్పటం ఆరంభించారు. దానికి కొనసాగింపుగానే... రామోజీ ఈ వంకర రాతలు మొదలెట్టారు. ఇదీ.. గురుశిష్యుల గూడుపుఠానీ. సీమలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి... వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపైనా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహానేత వైఎస్ హయాంలో శ్రీ సిటీ రాకతో రాయలసీమ రూపు రేఖలు మారగా...... సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి వద్ద, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రెండు భారీ పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిని పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూడన్నరేళ్లలో వివిధ రంగాలకు చెందిన 29 భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టబడుల ప్రోత్సాహక కమిటి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ 29 ప్రాజెక్టులు ద్వారా రూ.88,333.66 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 76,992 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటిలో తిరుపతి జిల్లా ఇనగలూరు వద్ద హిల్టాప్ (అపాచీ) సెజ్ భారీ పాదరక్షల తయారీ, పులివెందులలో సుమీత్ ఫుట్వేర్, కొప్పర్తి వద్ద నీల్కమల్, పిట్టి లామినేషన్స్, నాయుడుపేట వద్ద గ్రీన్టెక్ ఎనర్జీ, చిత్తూరు జిల్లా ఎలకటూరు వద్ద అమ్యప్పర్ టెక్స్టైల్, తిరుపతి జిల్లా తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్, పులివెందుల వద్ద ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, బద్వేల్ వద్ద సెంచురూ ప్యానల్స్, కొప్పర్తి వద్ద కాసిస్ ఎలక్ట్రిక్ బస్సులు తయారీ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కర్నూల్ జిల్లా్ల ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రూ.428 కోట్లతో 74 ఎంఎల్డీ నీటి సరఫరా, కొప్పర్తికి రూ.150 కోట్లతో 46 ఎంఎల్డీ నీటి సరఫరా ప్రాజెక్టులను ఏపీఐఐసీ చేపట్టంది. ఎండాకాలంలో నీటి ఎద్దటి లేకుండా కొప్పర్తి వద్ద రూ.38 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిక్డిక్ట్ సహకారంతో ఓర్వకల్లు వద్ద 4,742 ఎకరాలు, కొప్పర్తి వద్ద 2,595 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇది కాకుండా రూ.750 కోట్లతో కొప్పర్తి వద్ద వైఎస్ఆర్ ఈఎంసీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్ ఈఎంసీలో డిక్సన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. సెంచురీ ప్లై యూనిట్కు నీటి సరఫరా కోసం గోపవరం వద్ద రూ.45 కోట్లతో నీటి తరలిపంపు ప్రాజెక్టును అభివద్ధి చేస్తోంది. పీఎం గతిశక్తి కింద రూ.31 కోట్లతో కృష్ణపట్నం నుంచి కొప్పర్తికి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టింది. -
ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఆపండి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు/అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులన్నింటినీ నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.60 వేల కోట్లతో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదించిన 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది. కడప జిల్లాలోని గండికోటలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతిచ్చినట్టుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వీటి నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. గతంలోనే వద్దన్నాం.. ఏపీ తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల అవసరాలకని చెప్పుకుంటూ ..నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి తరలిస్తున్న జలాలను విద్యుదుత్పత్తి/పంప్డ్ స్టోరేజీ పథకాలకు వినియోగించడం సరికాదన్నారు. చిత్రావతి, గోరకల్లు రిజర్వాయర్ల వద్ద ఏపీ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు గతంలోనే అభ్యంతరం తెలిపామని, అనుమతులొచ్చే వరకు నిలుపుదల చేయాలని బోర్డుకు లేఖ సైతం రాసినట్టు గుర్తుచేశారు. ఈ రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరారు. కొత్త బ్యారేజీలనూ నిలిపివేయాలి ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు చేస్తోందని, వీటినిర్మాణం కూడా చేపట్టకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ మరో లేఖలో కృష్ణా బోర్డును కోరారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్లను ఏపీ సిద్ధం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను బోర్డుకు పంపించారు. -
ప్రాజెక్టులకు కొత్త కళ
బి.కొత్తకోట : అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా రెండోదశ సాగు, తాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులకు సర్వేకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తయ్యాయి. ఈ రెండింటికి పాలనాపర అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. గుర్రంకొండ మండలంలో కొత్తగా రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి స్టేజ్–1 పనులు పూర్తయ్యాయి. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల 13న జరిగే రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలపనుంది. గడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానుండగా, కుప్పం ఉపకాలువ మిగులు పనులు సత్వరమే పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కొత్త పథకాల రూపకల్పనతో ప్రాజెక్టు విస్తరణ పెరిగి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది. రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన రిజర్వాయర్ గుర్రంకొండ మండలం చెర్లోపల్లె వద్ద ప్రభుత్వం ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి తొలిదశ సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పూర్తయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్కు మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలించి ఎగువతోటపల్లె వద్ద రిజర్వాయర్ను నిర్మిస్తారు. 5 వేల ఎకరాలకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్టీ, రామానాయినిచెరువుకు 35 ఎంసీఎఫ్టీల నీటిని మళ్లించి నింపుతారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.359 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. స్టేజ్–1 స్థాయి పనులు పూర్తి కావడంతో పాలనాపరమైన అనుమతి కోసం నివేదికను చీఫ్ ఇంజినీర్, ప్రభుత్వానికి పంపారు. రామసముద్రం ఉపకాలువ మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలో మీటర్ నుంచి రామసముద్రం ఉపకాలువ మొదలవుతుంది. ఇక్కడికి 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వుతారు. దీనికింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్ను నిర్మించి, ఇక్కడినుంచి తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రతిపాదన ఉంది. కాలువ సర్వే, సమగ్ర నివేదిక కోసం ప్రభు త్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ పొందిన సంస్థ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించింది. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీ టిని అందించాలన్నది లక్ష్యం. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీ వా కాలువ ద్వారా మళ్లిస్తారు. దీని సమగ్ర సర్వే, ప్రా జెక్టు నివేదిక రూపొందించడం కోసం రూ.59.22 లక్షలతో సర్వే పనులు పూర్తవగా రూ.73.43 కోట్లతో ప నులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికింద 24 చెరువులకు నీటిని అందించి 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం. త్వరలో గుడిసిబండ పనులు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందించే గుడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 1,400 ఎకరాలు చెరువులకింద, 2,600 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఈ పనులకు టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనున్నారు. రూ.21.05 కోట్లతో పనులకు ఒప్పందం జరిగింది. బాహూదాకు కృష్ణా జలాలు నిమ్మనపల్లె మండలంలోని బాహూదా రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. అలాగే వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. పీబీసీపై 13న ఎస్ఎల్టీసీ భేటీ పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై ఈ నెల 13న జలవనరులశాఖ రాష్ట్రస్థాయి సాంకేతిక క మిటీలో చర్చించి అమోదం తెలపనుంది. రూ.1,929 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు, సాంకేతిక అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద కిలోమీటర్ 79 నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె వద్ద 220.350 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. ఈ కాలువ 140.75 కిలోమీటర్లు ఉండగా కుడివైపున కాలువను 4.8 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కాలువ సామర్థ్యం ప్రకారం ఒక్కో పంపు 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. కాలువలో 1,180 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించేలా నిర్మాణాలు చేపడతారు. వేగంగా చర్యలు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పూర్తికి వేగంగా చర్యలు చేపట్టాం. రెడ్డెమ్మకోన రిజర్వాయర్, రామసముద్రం కాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి పాలనాపర ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాం. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై కమిటీ నిర్ణయం తర్వాత చర్యలు వేగవంతం అవుతాయి. కొత్త పథకాలకు రూపకల్పన చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాం. – రాజగోపాల్రెడ్డి, ఎస్ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు కుప్పంకు కొత్త కాంట్రాక్టర్ గత టీడీపీ హయాంలో కుప్పం ఉపకాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అందినంత దోచుకొని 2019 నుంచి పనులను నిలిపివేసింది. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఖాతరుచేయలేదు. మిగిలిపోయిన రూ.117.18 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తొలగించారు. ఇదే విలువకు పనులు చేపట్టాలని పలు కాంట్రాక్ట్ సంస్థలను ప్రభుత్వం కోరగా హైదరాబాద్కు చెందిన నాలుగైదు నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ కంపెనీల సాంకేతిక అధికారులు ప్రస్తుతం కుప్పం కాలువలో మిగిలిన పనులను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక మిగులుపని విలువతో పనులు చేసేందుకు ముందుకొస్తే టెండర్లు లేకుండా అప్పగించేందుకు నిర్ణయిస్తారు. లేనిపక్షంలో ప్రస్తుత నిర్మాణ ధరల ప్రకారం అంచనావేసి టెండర్లను ఆహ్వానించనున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement