-
నారాయణ మనుష్యులు మరీ..!
సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్లోని నారాయణ కాలేజీ వార్డెన్గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. -
హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..
హయత్నగర్(హైదరాబాద్): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్ వార్డెన్ను ఆదివారం హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్నగర్లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్లో నెల రోజుల క్రితం వార్డెన్గా చేరాడు. చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి.. విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యాయత్నం
-
చందాల కోసం వేధింపులు భరించలేక
విశాఖపట్నం , కశింకోట(అనకాపల్లి): చందాల కోసం కొందరు స్థానికులు పెడుతున్న వేధింపులు భరించలేక మనస్తాపంతో స్థానిక హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సమగ్ర బాలికల వసతి గృహం సంక్షేమ అధికారి(వార్డెన్) లొడగల శ్రీదేవి ప్రధానంగా మూడు అంశాల్లో స్థానికులు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నిం చారు. స్థానిక గ్రామ ఉత్సవాలకు చందాలతోపాటు మరో అంశం ఇందుకు కారణం. నాలుగు నెలల క్రితం ఇక్కడ నిర్వహించిన ఓ ఉత్సవానికి నిర్వాహకులు చందా కోసం వెళ్లి రూ.పది వేలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమనడంతో ససేమిరా అంటూ బెదిరించారు. అలాగే రెండు నెలల క్రితం వసతి గృహం నుంచి చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లిపోయిన పదవ తరగతి విద్యార్థి మూడు రోజుల తర్వాత తల్లితో వస్తే చేర్చుకోవడానికి వార్డెన్ నిరాకరించారు. దీంతో విద్యార్థి తల్లి స్థానికులను తీసుకు వచ్చి వార్డెన్పై వత్తిడి చేశారు. దీంతో సంజా యిషి పత్రం రాసి ఇస్తే చేర్చుకుంటాననడంతో అందుకు వారు సమ్మతించడంతో చేర్చుకున్నారు. తాజాగా ఇటీవల జరిగిన ఒక ఉత్సవానికి చందా కోసం ఒకరు వెళితే రూ.2 వేలు ఇచ్చారు. అది సరిపోదని ఎక్కువ ఇవ్వాలని వత్తిడి చేశారు. ఈ సంఘటనలన్నింటినీ మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురై మనస్తాపం చెంది సోమవారం మోతాదుకు మించి 40 వరకు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సంఘటనలకు సంబంధించి స్థానికులతోపాటు విద్యార్థిని తల్లిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. -
టీడీపీ నేతల వేధింపులు: హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యయత్నం
Pagination
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement