-
తిరిగి వచ్చినవాడు
మనం కూడా ధనానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఆలోచించుకోవాలి. వస్తు, సంపదలకు ఇచ్చే ప్రాముఖ్యం మనం మనుషులకు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆ తండ్రి ఆస్తికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కుమారుడు ప్రాణాలతో తిరిగి రావడమే చాలా గొప్ప అనే ఆ తండ్రి ప్రేమ ఈ రోజు మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తనకు ఇవ్వమని తండ్రిని అడిగాడు. తండ్రికి ఆస్తిని పంచడం ఇష్టం లేకున్నా పంచాడు. అయితే చిన్నవాడు కావడం వల్ల ఆ ఆస్తిని ఎలా వాడాలో తెలియని ఆ కుమారుడు తనకున్న సంపదని తీసుకుని ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయి తన ఆస్తినంతటినీ చెడ్డ పనులు చేసి పోగొట్టుకున్నాడు. దాంతో చేసేదేం లేక ఆ దేశంలో పందులను మేపే పనిని చేస్తూ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ ఎంతో వేదననుభవించాడు. చాలా బాధ పడ్డాక ఆ కుమారుడికి తన తండ్రి, తన ఇల్లు అన్నీ గుర్తుకొచ్చాయి. మళ్లీ తను అక్కడకు వెళితే బాగుంటుందనే ఆలోచన రావడంతోనే తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆ కుమారుడిని దూరం నుంచే చూసిన తండ్రి.. కుమారునికి ఎదురు వెళ్లి అతడిని ముద్దు పెట్టుకుని, తన దాసులతో కుమారుడు వచ్చాడని చెప్పి విందు చేయించాడు. అయితే ఆ తండ్రి వద్దనే ఉన్న పెద్ద కుమారుడికి తండ్రి చేస్తున్న ఆ పని నచ్చలేదు. ఆస్తి మొత్తాన్ని పోగొట్టి వచ్చిన వాడికోసం విందు చేసినందుకు అలిగాడు. అదే మాట తండ్రిని అడిగాడు. అందుకు ఆ తండ్రి ఇలా చెప్పాడు. (లూకా 15:32) ‘‘నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక మనం ఆనందించాలి’’ అన్నాడు. తన పెద్ద కుమారుడికి దేనిని ప్రేమించాలో నేర్పాడు. – బెల్లంకొండ రవికాంత్ -
ఆ కుటుంబానికి ‘షాక్’
రాయచోటి రూరల్/టౌన్ : ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. ఉన్న ఇద్దరు కొడుకులు చేతికి అంది వచ్చారనుకుంటున్న సమయంలో ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మళ్లీ ఇప్పుడు గురువారం మరో కుమారుడు కూడా విద్యుదాఘాతంతోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన అంపాబత్తుని రెడ్డెయ్య, రత్నమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె . ఆరేళ్ల క్రితం స్వగ్రామంలో మొబైల్కు చార్జింగ్ పెడుతుండగా పెద్ద కుమారుడు శంకర కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సంగీత మొబైల్ షాపులో పనిచేస్తున్న వీరి చిన్న కుమారుడు రెడ్డి కిరణ్ గురువారం మధ్యాహ్నం తన షాపునకు సంబంధించిన బ్యానర్ కట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడు విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. నిలువెత్తు నిర్లక్ష్యం రాయచోటి పట్టణ పరిధిలో ట్రాన్స్కో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ తీగలు వేలాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలుమార్లు కాలం చెల్లిన విద్యుత్ తీగలు నేలకూలిన సంధర్భాలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజలు మండిపడుతున్నారు. -
తండ్రి చేతిలో ఇద్దరు కొడుకులు హతం
న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఉన్న ఓ తండ్రి తన ఇద్దరు కుమారులను చంపిన దారుణ ఘటన బుధవారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఆయుష్(15), ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్యన్(13) తండ్రి చేతిలో హతమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. సంజయ్నగర్లో నివాసముంటున్న ముఖేష్(43) భార్య గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న ముఖేష్ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడని మహేంద్ర పార్క్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఇద్దరు కుమారులను గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానే ఈ నేరానికి పాల్పడ్డానంటూ పోలీసులతో వెల్లడించాడు. ఇటీవల అతడి ఇంట్లో చేపట్టిన నూతన నిర్మాణంపై ఇరుగుపొరుగువారు మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ముఖేష్ మరింత మనోవేదన చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముఖేష్ను అరెస్ట్ చేశారు. -
కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు
నార్కట్పల్లి (నల్గొండ జిల్లా) : నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గద్దకూటిబావిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపారు తనయులు. గ్రామానికి చెందిన భోగిని పిచ్చమ్మ(48)అనే మహిళకు వెంకన్న, నరేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో దశ దిన కర్మ జరుగుతోంది. ఈ సందర్భంగా వారు విపరీతంగా మద్యం తాగారు. దీంతో తల్లి కుమారులను అతిగా తాగద్దని వారించింది. ఆగ్రహించిన కుమారులు తల్లిని విపరీతంగా కొట్టి పురుగుల మందు బలవంతంగా తాగించారు. అదే సమయంలో వారి భార్యలు అడ్డురాగా వారి కూడా విపరీతంగా కొట్టారు. ఈ సమయంలో పిచ్చమ్మ వారి నుంచి తప్పించుకుని వెళ్తుండగా మళ్లీ ఆమెను పట్టుకుని గదిలో బంధించారు. పరిస్థితి విషమించి పిచ్చమ్మ అక్కడ్నే ప్రాణాలు వదిలేసింది. ఈమేరకు గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పొలాల్లో దాక్కున్న నిందితులను స్టేషన్కు తరలించారు. నిందితుల భార్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రి చేతిలో తనయుల కిడ్నాప్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తనయులనే కిడ్నాప్ చేసిన ఓ తండ్రి ఉదంతం చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. అంబత్తూరు సమీపం కల్లికుప్పంకు చెందిన కిరణ్కుమార్ (39) చెన్నై చేట్పట్లోని కాల్సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇతనికి వికాస్ (11), జయదీప్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్కూలుకు వెళ్లేందుకు నిల్చుని ఉండగా వ్యాన్ రిపేరుకు గురైంది, అందుకే కారు పంపారు అంటూ ఇద్దరు వ్యక్తులు పిల్లలు ఇద్దరిని ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో మరో ఇద్దరు కారు ఎక్కారు. కిరణ్కుమార్కు వారు ఫోన్ చేసి రూ.30లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్లు పిల్లలను విడిచిపెట్టి పారిపోయారు. కిరణ్కుమార్కు రూ.30లక్షల వరకు అప్పు ఉందని, రిటైర్డు శాస్త్రవేత్తై తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉన్న లక్షలాది రూపాయలతో అప్పు తీర్చుకోవచ్చని పథకం పన్ని కిరణ్కుమార్ స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీస్ విచారణలో తేలింది. కిరణ్కుమార్తోపాటు ఇద్దరు స్నేహితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement