-
రికార్డు స్థాయిలో పసుపు ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రికార్డుస్థాయి ధర లభిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. క్వింటా పసుపు గరిష్టంగా కడప మార్కెట్ యార్డులో రూ.13,712 పలకగా, దుగ్గిరాల పసుపు యార్డులో రూ.13,600 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెల తిరక్కుండానే పెరిగిన ధర రాష్ట్రంలో 2022–23 సీజన్లో 83,540 ఎకరాల్లో పసుపు సాగవగా.. 3.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2023–24 సీజన్లో వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల 78 వేల ఎకరాల్లో సాగైంది. హెక్టార్కు సగటున 11 టన్నుల దిగుబడి వచ్చింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. మరోవైపు ధర తగ్గినప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. గతేడాది జూన్, జూలైల్లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలకడంతో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.36 కోట్లు వెచ్చించి 5,020 టన్నుల పసుపును మద్దతుధరకు సేకరించింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్లలో క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,750 పలికింది. ఆ తర్వాత ఏ దశలోను మార్కెట్లో ధర తగ్గలేదు. ప్రస్తుతం ఎమ్మెస్పీ కంటే రెట్టింపు ధర పలుకుతుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కడప మార్కెట్లో కనిష్టంగా రూ.11,555, గరిష్టంగా రూ.13,712 పలికింది. దుగ్గిరాల మార్కెట్ యార్డులో కనిష్టంగా రూ.12,300, గరిష్టంగా రూ.13,600 పలికింది. బాబు హయాంలో క్వింటా రూ.6,358 మించని ధర టీడీపీ హయాంలో అసలు మద్దతు ధర ప్రస్తావనే లేదు. మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే «ధర.. చెల్లించిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. ఆ ఐదేళ్లలో సగటున క్వింటాకు రూ.6,358 మించి ధర లభించిన పరిస్థితి లేదు. ఆ ఐదేళ్లలో గరిష్ట ధరలు 2014–15లో రూ.5,335, 2015–16లో రూ.7 వేలు, 2016–17లో రూ.5,755, 2017–18లో రూ.7,200, 2018–19లో రూ.6,500 ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో ఒకటి రెండు సీజన్లలో అదీ ఒకటిరెండు నెలలు మాత్రమే అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి మార్కెట్కు రావడంతో ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్ని సీజన్లలో ప్రభుత్వ చర్యల ఫలితంగా ఎమ్మెస్పీకి మించే ధరలు పలికాయి. రెండేళ్ల పాటు గరిష్టంగా క్వింటా రూ.10 వేలకు పైనే పలికింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, ఈ ప్రభుత్వం 2019–20 నుంచి ఇప్పటివరకు రూ.449 కోట్ల విలువైన 57,973 టన్నుల పసుపును సేకరించింది. ప్రభుత్వ జోక్యం వల్లే.. ఐదేళ్లుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. మార్కెట్లో ధరలు తగ్గిన ప్రతిసారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తోంది. ప్రతి రైతుకు ప్రతి పంటకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుతం పసుపు క్వింటా ధర గరిష్టంగా రూ.14 వేలకు చేరుకోగా, మిగిలిన పంట ఉత్పత్తులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు లభిస్తున్నాయి. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఈ రైతు పేరు ఆవుల వెంకటచినసుబ్బయ్య. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం బుచ్చంపల్లి గ్రామానికి చెందిన ఈయనకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవలే 70 క్వింటాళ్ల పసుపును మార్కెట్ యార్డులో విక్రయించారు. క్వింటా గరిష్టంగా రూ.12,700కు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం క్వింటా నాణ్యతను బట్టి రూ.14 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిధర ఎప్పుడూ చూడలేదని వెంకటచినసుబ్బయ్య సాక్షి వద్ద తన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జోక్యం వల్ల ఒక్క పసుపే కాదు.. దాదాపు ఇతర పంట ఉత్పత్తులకు మార్కెట్లో రికార్డు స్థాయిలోనే ధరలు పలుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. -
పసుపు ధర పైపైకి
సాక్షి, అమరావతి: మూడేళ్ల తర్వాత పసుపు ధర పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 వరకు పలుకుతున్న పసుపు మరో నెలలో రూ.10 వేల మార్క్ను అందుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. పసుపు సాగులోనే కాదు.. ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో 70–75 శాతం మనదేశంలోనే జరుగుతుంది. పసుపు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్కువగా సాగవుతుంది. మన రాష్ట్రంలో 30,518 హెక్టార్లలో సాలెం, దుగ్గిరాల, మైదుకూరు రకాల పసుపు సాగవుతుండగా దుగ్గిరాల, నంద్యాల, కడప మార్కెట్ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఖరీఫ్లో ఏటా జూన్–జూలైలో పంట వేస్తారు. మరుసటి ఏడాది మార్చి నాలుగో వారం నుంచి పంట మార్కెట్లోకి వస్తుంది. రాష్ట్రంలో పండే పసుపులో 50 శాతం రాష్ట్ర పరిధిలోను, 20 శాతం పొరుగు రాష్ట్రాల్లోను వినియోగమవుతుండగా, 30 శాతం వరకు ముంబై, కోల్కతాల మీదుగా బంగ్లాదేశ్, సౌదీ, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కూడా మన మార్కెట్లకు వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. గతేడాది మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు తొలిసారిగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వమే ఎమ్మెస్పీ ప్రకటించింది. దానికంటే మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు పథకం (మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్) ద్వారా పెద్ద ఎత్తున సేకరించి పసుపు రైతుకు అండగా నిలిచింది. 2019–20లో 26,878 మంది రైతుల నుంచి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున రూ.342.75 కోట్ల విలువైన 50,035 మెట్రిక్ టన్నుల పసుపును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇలా సేకరించిన పసుపులో ఇప్పటివరకు 17,678 మెట్రిక్ టన్నులను క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.4,991 చొప్పున వేలంలో విక్రయించింది. మరో 32,357 మెట్రిక్ టన్నుల పసుపును వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో ఆ మేరకు మార్క్ఫెడ్కు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలరోజుల్లో రూ.3 వేలు పెరుగుదల 2019–20 సీజన్లో 3.8 లక్షల టన్నుల దిగుబడి రాగా, గతేడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల 2020–21లో 3,66,218 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మూడేళ్లుగా మార్కెట్లో క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్యలో ఉన్న ధర ఈ ఏడాది ఊహించని రీతిలో పెరుగుతోంది. మన రాష్ట్రంలో ఇప్పటికే రూ.7,,500 నుంచి రూ.7,900 వరకు పలుకుతోంది. పంట పూర్తిగా మార్కెట్ కొచ్చే సమయానికి ఈ ధర రూ.10 వేల మార్క్ను దాటే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినియోగం పెరగడంతో మార్కెట్లో పసుపునకు డిమాండ్ ఏర్పడింది. రేటు పెరుగుతోంది మూడేళ్ల తర్వాత పసుపునకు మంచిరేటొస్తోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 దాటింది. ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఫ్యూచర్ ట్రేడింగ్స్ కంపెనీ వాళ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ధర పెరుగుదల రైతులకే కాదు.. వ్యాపారులకు కూడా మంచిది. – శ్రీనివాస్, పసుపు వ్యాపారి, దుగ్గిరాల ధర మరింత పెరిగే అవకాశం గడిచిన మూడేళ్లుగా మార్కెట్లో ధర లేదు. అందుకే మార్క్ఫెడ్ మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్ ఎమ్మెస్పీ రూ.6,850గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువగా ఏ ఒక్కరూ అమ్ముకోవద్దు. ధర మరింత పెరిగే అవకాశం ఉంది. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
క్వింటాల్కు రూ. 10 వేలు: రైతుల సంబరం!
సాక్షి, జగిత్యాల: పసుపు పంట క్వింటాల్కు రూ.10 వేల వరకు పలుకుతుండటంతో రైతులు సంబరపడి పోతున్నారు. వర్షాలు, చీడ పురుగుల కారణంగా పసుపు దిగుబడి సగానికి తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డుకు రోజుకు సుమారు 200 క్వింటాళ్ల పసుపు వస్తోంది. సోమవారం మెట్పల్లి మార్కెట్లో అత్యధికంగా క్వింటాల్కు రూ.8,800 ధర పలికింది. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు నిత్యం 25 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా సోమవారం అత్యధికంగా 50 వేల క్వింటాళ్లకు పైగా పంటను రైతులు మార్కెట్కు తీసుకొచ్చారు. క్వింటాల్ పసుపునకు అత్యధికంగా రూ.10,555 ధర పలకడం విశేషం. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే రెట్టింపయ్యింది ఈసారి పసుపు ధర గతం కంటే రెట్టింపు పలుకుతోంది. రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు చేరువైంది. ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. -
రూ.9వేల మార్కు దాటిన పసుపు ధర!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాలు పసుపు ధర రూ.9 వేల మార్కు దాటింది. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామానికి చెందిన సామ శ్రీనివాస్ అనే రైతు సోమవారం తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల పసుపుపంటకు ఈ సీజన్లో అత్యధికంగా రూ.9389 ధర పలికింది. అలాగే 135 క్వింటాళ్లకు రూ.8500 పైచిలుకు, 481 క్వింటాళ్లకు రూ.8వేలకుపైగా ధర వచ్చిందని మార్కెటింగ్శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మార్కెట్కు 19,282 క్వింటాళ్ల పసుపు వచ్చింది. గత పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ.2 వేల వరకు ధర పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రోజురోజుకూ పచ్చ బంగారం ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బండరాళ్లు మోది భర్తను చంపిన భార్య -
పసుపు ధర పైపైకి..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): సీజన్ కాని వేళలో పసుపు పంటకు ధర పెరుగుతోంది. పసుపు పంటను నిలువ ఉంచుకున్న వ్యాపారులు, స్టాకిస్టులకు ప్రయోజనం కలిగేలా ధర పెరుగుతూ పోతుంది. పసుపు పంటకు ఇప్పుడు ధర పెరగడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. వారం రో జుల కింద పసుపు పంటకు క్వింటాలుకు రూ. 5,500 ఉన్న ధర ఇప్పుడు రూ. 6,100కు చేరింది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 600ల ధర పెరగడం విశేషం. కరోనా ప్రభావంతో నిజామాబాద్లోని వ్యవ సాయ మార్కెట్లో కొద్దిరోజులు వ్యాపార లావా దేవీలు స్తంభించిపోయాయి. ఇటీవలే పరిస్థితి మెరుగు అవుతుండగా పసుపు పంటకు కొంత ధర పెరిగింది. పసుపు పంటకు సీజన్లో క్వింటాలుకు రూ. 5 వేలకు మించి ధర లభించలేదు. మహారాష్ట్ర నుంచి పసుపు నిజామాబాద్ మార్కెట్కు దిగుమతి కావడం, ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు ఆశించిన విధంగా ఎగుమతులు లేకపోవడంతో గడిచిన సీజన్లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లోనూ పసుపు పంటకు ధర లభించకపోవడం రైతులను కుంగదీసింది. గతంలో కూడా అన్సీజన్లో పసుపు ధర పెరగడాన్ని గమనించిన కొందరు రైతులు కోల్డ్స్టోరేజీలలో పసుపును నిలువ ఉంచారు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్కెట్ మూతబడడంతో రైతులు తక్కువ ధరకే విక్రయించుకుని నష్టపోయారు. కాగా ఇప్పుడు ఉన్న స్థితిలో పసుపు పంటకు ధర పెరగగా ఇదే ధర కొనసాగుతుందా లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ధర ఇలాగే ఉంటే రానున్న సీజన్లో పసుపు సాగు చేసిన వారికి కొంతైనా ఊరట లభించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి పసుపు పంటకు మార్కెట్లో ఎప్పుడైనా డిమాండ్ ఒకేలా ఉంది. కానీ వ్యాపారులే ధరను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పసుపు పంటకు ధర క్షీణించకుండా చర్యలు తీసుకోవాలి. ధర నియంత్రణపై దృష్టి సారించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – బూత్పురం మహిపాల్, రైతు, మోర్తాడ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement