-
చింతలపూడి గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు
-
అడవిలో 15 కిమీ నడిస్తే గాని మా ఊరు రాదు..జగన్ వచ్చాకే మా జీవనం మెరుగ్గా..
-
గిరిజన గూడేల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో అనేక గిరిజన ఆవాసాల్లో మొన్నటివరకు కరెంటంటే ఏమిటో తెలియని పరిస్థితి. కొన్ని ఆవాసాల్లో సోలార్ ప్యానల్స్ ద్వారా గతంలో కరెంటు సరఫరా ఇచ్చామనిపించారు. అయితే ఇక్కడ కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కరెంటును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాకాకుండా రెగ్యులర్గా విద్యుత్ స్తంభాలు వేసి రోజంతా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని గిరిజన ఆవాసాలకు రోడ్డు వసతికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గిరిజన గూడేనికి విద్యుత్ సరఫరా ఉండాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో 85 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ సరఫరా పనులు చేపట్టారు. కొన్ని ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మిగిలిన ఆవాసాల్లో కూడా విద్యుత్ పనులు చేపట్టనున్నారు. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలు ఏజెన్సీలో గ్రామాల సంఖ్య, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం మొన్నటివరకు ఎవరివద్దా లేవు. ప్రభుత్వశాఖలు ఒక్కొక్కటి ఒక్కో సమాధానం చెప్పేవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీపై పూర్తిసమాచారం కోసం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఈ సర్వే ద్వారా ఆవాసాల సంఖ్య, అక్కడి సమస్యలు, సౌకర్యాల సమాచారం అందింది. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలున్నాయని, 1,21,727 కుటుంబాలకు చెందిన 6,04,047 మంది నివసిస్తున్నారని తేలింది. ఇంకా 149 ఆవాసాలకు కరెంటు సదుపాయం లేదని తెలిసింది. దీంతో వెంటనే 85 ఆవాసాల్లో కరెంటు సదుపాయం కల్పించే మొదటివిడత పనులను ప్రభుత్వం రూ. 50 కోట్లతో చేపట్టింది. విద్యుత్శాఖ కేవలం 85 ఆవాసాల్లో మాత్రమే కరెంటు సదుపాయం లేదని, వాటికి డిసెంబర్ నాటికి కరెంటు వసతి కల్పిస్తామని చెబుతోంది. ఒకవేళ తాజా సర్వే ప్రకారం మరిన్ని ఆవాసాలకు అవసరమైతే అక్కడ కూడా విద్యుత్ సరఫరా పనులు చేపడతామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని 2014లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ‘పవర్ ఫర్ ఆల్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. 2014 డిసెంబర్లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్దేశించింది. మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం వివిధ పథకాల ద్వారా నిధులు విడుదల చేసింది. నేరుగా విద్యుత్ స్తంభాల ద్వారా తీగలను లాగి విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం లేని ఏజెన్సీ ప్రాంతాల్లో సౌరఫలకల ద్వారా సౌర విద్యుత్ కూడా సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు తీసుకుంది. అంతిమంగా మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఘనంగా ప్రకటించేసింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 149 ఆవాసాలకు కరెంటు సౌకర్యం లేదంటే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదారి పట్టించిందని అర్థమవుతోంది. అన్ని ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించామని కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిధులను ఏంచేశారనే విషయం తేలాల్సి ఉంది. ► అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని మందబుద్ది గ్రామానికి మొన్నటివరకు కరెంటు లేదు. కొండకోనల్లో ఉండే ఈ ఆవాసానికి కరెంటు పోల్స్ తీసుకెళ్లి.. తీగలు లాగి వెలుగులు నింపింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఊళ్లో విద్యుత్ వెలుగులు నిండాయి. ► అనంతగిరి మండలంలోని దాయార్తి గ్రామ ప్రజలు.. మా ఊరికి కరెంటివ్వాలని గతంలో అనేకసార్లు నిరసనలు చేశారు. పొద్దుపోయాక కనీసం గూడెం నుంచి బయటకురాలేని దుస్థితి. పురుగుపుట్రతో ఇబ్బందులు. కొద్దిరోజుల కిందట ఈ గిరిజన గూడెంలో కరెంటు బల్బులు వెలిగాయి. ఇన్నాళ్లూ చీకట్లోనే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. కటిక చీకట్లోనే కాలం వెల్లదీశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరికి కరెంటొచ్చింది. – కొర్ర మల్లన్న, బందబుద్ది గ్రామం, హుకుంపేట మండలం దశాబ్దాల కల నెరవేరింది దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాం. ఇన్నాళ్లు గుడ్డి దీపాలే దిక్కు. జగనన్న సీఎం అయ్యాక మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య తీరింది. – సీదరి మల్లేష్, రీడబంద గ్రామం, హుకుంపేట మండలం కరెంటివ్వమన్నా ఇన్నాళ్లు ఇవ్వలేదు మండల కేంద్రం అనంతగిరి నుంచి మా గ్రామానికి 125 కిలోమీటర్ల దూరం. మా గ్రామంలో 25 కుటుంబాలున్నాయి. రాత్రిళ్లు జంతువుల బెడద ఎక్కువ. కరెంటు లేకపోవడంతో బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిరసన చేపట్టినా మా సమస్యను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా సమస్య పరిష్కారమైంది. రెండు నెలల కిందటే మా గ్రామానికి కరెంటు వచ్చింది. – కొర్ర సోమన్న, దాయార్తి గ్రామం, అనంతగిరి మండలం -
'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం
కొయ్యూరు: గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఆ గ్రామంలోని యువకులు ముందుకు కదిలారు. తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేయటంతోపాటు.. ఇకపై గ్రామస్తులు ఎవరూ గంజాయి పండించకూడదని తెలియజెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చౌడుపల్లి గ్రామాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. కొందరు గ్రామస్తులు అక్కడ గంజాయిని పండిస్తున్నారు. గ్రామ యువకులు పలువురు గురువారం అక్కడికి చేరుకుని, సుమారు ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక నుంచి గ్రామస్తులు ఎవరూ గంజాయిని పండించరని, ఎవరైనా తోటలను వేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. దీనిపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ.. గంజాయి ఎక్కువగా సాగవుతున్న మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు ఈ విధంగా చైతన్యవంతులై గంజాయి తోటలను స్వయంగా వారే ధ్వంసం చేయటం శుభపరిణామమన్నారు. -
అడవికి రాచబాట!
► విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. ► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం ఇప్పటికే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. –ఆర్.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో దశాబ్దాల కల సాకారం గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. – వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం డోలి కష్టాలకు తెర... సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది. – తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement