-
గాలిలో దీపంలా డయాలసిస్
వేల సంఖ్యలో పెరుగుతున్న రోగులు చాలీచాలని రక్తమార్పిడి యంత్రాలు నెలల తరబడి ఎదురు చూస్తున్న వైనం సకాలంలో రక్తమార్పిడి చేసుకోలేక అవస్థలు తిరుపతి మెడికల్ : చిత్తూరుకు చెందిన రమేష్ (పేరు మార్చాం) రెండు కిడ్నీలు పాడవడంతో రక్తమార్పిడి (డయాలసిస్) వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడ పెరిటోనియన్ (పొట్టలోని రక్తాన్ని నీటితో పరిశుభ్రం చేసే ప్రక్రియ) డయాలసిస్ చేసేందుకు అవసరమైన సౌకర్యం లేకపోవడంతో వెనుదిరిగాడు. రెండు రోజుల్లోనే ఆ రోగి మరణించాడు... మరో రోగి రాము(పేరుమార్చాము) సకాలంలో రక్తమార్పిడి చేసుకోలేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఎంతో మంది కిడ్నీలు చెడిపోయి.. సకాలంలో డయాలసిస్ చేసుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు... ఆరోగ్యశ్రీనా.. ఖాళీ లేవు! ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేసుకునే సౌలభ్యం ఉన్నా ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డయాలసిస్ కోసం వచ్చే నిరుపేదలకు ‘అయ్యో ఆరోగ్యశ్రీనా...మా వద్ద ఖాళీగా లేవు. ఏడాది సమయం పడుతుంది. మీరు రుయా ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక స్థోమత ఉన్న రోగులకు సేవలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నాయి. పక్కన పెట్టేస్తున్నారు జిల్లాలో 1,150 నుంచి 1,200 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. చిత్తూరు, మదనపల్లి, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, పలమనేరు, కుప్పం, పీలేరు తదితర ప్రాంతాల నుంచి డయాలసిస్ రోగులు తిరుపతికి వస్తుంటారు. వీరి కోసం స్విమ్స్, రుయా ఆస్పత్రులతోపాటు నగరంలో మరో 8 ప్రయివేట్ డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేసుకునే సౌకర్యం ఉంది. ప్రయివేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేసుకునేందుకు ఆరోగ్యశ్రీ రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఎవరైతే అధిక డబ్బులు చెల్లిస్తారో వారికి మొదట ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యశ్రీ రోగులను పక్కన పెట్టేస్తున్నారు. బిల్లులు ఆలస్యమవుతాయనీ.. సాధారణంగా ఆరోగ్యశ్రీ రోగులకు ప్యాకేజీ కింద డయాలసిస్కు ఒక సిట్టింగ్కు రూ.1250 చొప్పున నెలలో 25 రోజులకు 10 సిట్టింగ్లకు కలిపి రూ.12,500 ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే ప్యాకేజీల వల్ల నెలలు తరబడి బిల్లులు రావడం లేదని, అప్పులు మిగులుతున్నాయంటూ రోగులను తిప్పి పంపేస్తున్నారు. స్పాట్ పేమెంట్ పేరుతో రోగికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి ఒక సిట్టింగ్ రూ.2వేల నుంచి రూ.2,900 వరకు వసూలు చేస్తున్నారు. అదికూడా నిర్థిష్టమైన 4గంటల సమయంలో, నిపుణుల చేత డయాలసిస్ చేయాల్సి ఉన్నా, అధిక డబ్బులకు ఆశపడుతూ, రోగుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం రెండు గంటల్లోనే రక్తమార్పిడి ప్రక్రియను మమ అనిపించేస్తున్నారు. డయాలసిస్ సరిగా చేయక పోవడంతో వ్యాధి ముదరబెట్టుకుంటూ చెన్నై, బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారు. రోగులు ఎక్కువ.. మిషన్లు తక్కువ రుయా ఆస్పత్రి ఆరోగ్యశ్రీ రోగులకు అండగా నిలుస్తోంది. రుయాలో మొత్తం 10 డయాలసిస్ మిషన్లు ఉండగా ఒక్కో మిషన్ ద్వారా రోజుకు నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. రక్తమార్పిడి కోసం 593 మంది నమోదు చేసుకోగా అందులో ప్రస్తుతం 507 మంది డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇంకా 86 మంది వెయిటింగ్లో ఉన్నారు. వీరికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. మరో 20 మిషన్లు ఏర్పాటు చేస్తే గానీ ఇక్కడ రోగులకు సరైన సేవలు అందించలేని పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న స్విమ్స్లో గత వారంలో 700 మంది డయాలసిస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 400 మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉన్నారు. వీరందరికీ కేవలం 35 మిషన్ల ఉన్నాయి. ఒక్కో మిషన్ రోజుకు ముగ్గురు రోగులకు డయాలసిస్ చేస్తోంది. వెయిటింగ్లో చాలా మంది ఉన్నట్టు సమాచారం. ఇక్కడ మరో 65 మిషన్లు కొనుగోలు చేసేందుకు, పక్కా భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించినా అమలుకు నోచుకోవడం లేదు. -
చరిత్రలో రక్తాక్షరాలు
తొలి మార్పిడి జూన్ 15, 1667. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జీన్ బాప్టిస్ట్ డెనీస్ చరిత్ర సృష్టించిన రోజు. పద్నాలుగవ కింగ్ లూయిస్కి వ్యక్తిగత వైద్యుడైన డెనీస్ పదిహేను సంవత్సరాల బాలుడికి విజయవంతంగా రక్త మార్పిడి చేసిన రోజు. గొర్రె రక్తాన్ని ఆ బాలుడికి ఎక్కించాడు. ప్రపంచ వైద్య పరిశోధనల చరిత్రలోనే అది మొట్టమొదటి రక్తమార్పిడి ప్రయోగం. మాంట్ పెలియర్లో ఉన్నతవిద్య అభ్యసించిన డెనీస్కి రక్తమార్పిడి ప్రయోగంపై ఆసక్తి. అనేకసార్లు ఆవుల నుంచి కుక్కలకు రక్తమార్పిడి చే శాడు. ఎప్పటికైనా మానవులకు రక్తమార్పిడి చేయాలని అతడి కల. ఆ కల నెరవేరే రోజు రానే వచ్చింది. అతని దగ్గరకు పదిహేను సంవత్సరాల వయసున్న బాలుడిని తీసుకువచ్చారు. అతడి దగ్గరకు వచ్చేసరికి ఆ బాలుడు మగతగా ఉన్నాడు. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతోంది. అందుకు కారణం అతడిని జలగ పట్టుకుంది. చాలా రక్తం పీల్చేసింది. వెంటనే డెనీస్ 12 ఔన్సుల గొర్రె రక్తాన్ని ఆ బాలుడికి ఎక్కించాడు. ఆ బాలుడు అతి త్వరగా కోలుకున్నాడు. అందరికీ అతడిని చూస్తే ఆశ్చర్యం వేసింది. మొట్టమొదటి రక్తమార్పిడి విజయవంతం అయింది! ఆ తర్వాత డెనీస్ మరింత మందికి రక్తమార్పిడి చేయడానికి సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు, ఆ తరవాత చేసిన రక్తమార్పిడి చికిత్సలో విజయం సాధించలేకపోయాడు. చాలామంది చనిపోయారు. ఫ్రాన్స్లో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. 1670లో అతడిని రాజాస్థాన విధుల నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఇక ఎన్నడూ ఆ ప్రక్రి యను చేపట్టలేదు డెనీస్. తన వైద్యవృత్తిలోనే సాధారణ జీవితం గడిపాడు. ఏది ఏమైనప్పటికీ చరిత్రలో డెనీస్ తొలిసారి మానవులకు రక్తమార్పిడి జరిపిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. దాంతో రక్తమార్పిడి చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని మానవాళి తెలుసుకుంది. సుమారు 230 సంవత్సరాల తరువాత 1900లో కార్ల్ ల్యాండ్స్టీనెర్ అనే ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త రక్తంలో నాలుగు విభాగాలు ఉంటాయని గుర్తించాడు. అందుకుగాను నోబెల్ బహుమతి కూడా అందుకున్నాడు స్టీనెర్. ఆయన చేసిన సునిశిత పరిశోధన కారణంగానే సురక్షితంగా రక్తమార్పిడి చేయగలుగుతున్నారు. ఆయన చేసిన పరిశోధన వల్లే ఈరోజు లక్షల మంది ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు. అయినప్పటికీ రక్తమార్పిడి ప్రక్రియకు దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా డెనీస్ను యావత్ప్రపంచం గుర్తించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
చిన్న ఉపాయమే ఈ సోలార్ ఫ్యాన్.. నాన్స్టాస్ వ్యాపారం!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement