-
ఆపరేషన్ చేసిన రెండురోజులకే బాలింత మృతి!
సాక్షి, మెదక్ : జిల్లాలోని తుఫ్రాన్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలలు నిండకముందే గర్భిణీకి వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆపరేషన్ నిర్వహించిన రెండురోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆగ్రహించి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. 25 ఏళ్ల వసీమా అనే గర్భిణీ ఇటీవల తుఫ్రాన్లోని దేవీ ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమెకు నెలలు నిండకముందే వైద్యులు హడావిడిగా ఆపరేషన్ నిర్వహించారని వసీమా బంధువులు తెలిపారు. ఆపరేషన్ చేసిన రెండురోజులకే వసీమా ప్రాణాలు విడిచిందని, ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వసీమా ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ఒంటరైన చిన్నారి
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ దేవేంద్ర పిల్లలు ఒంటరిగా మిగిలారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ రామలక్ష్మణులపల్లెకు చెందిన ఊబిది లచ్చవ్వ, మల్లయ కూతురు దేవేంద్రకు దోమకొండకు చెందిన రఘుతో వివాహం జరిపించారు. రఘు ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లగా.. దేవేంద్ర సమీప బంధువు కాశీరాంకు దగ్గరైంది. పెద్దల పంచాయతీతో ఇరువురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దేవేంద్ర కూతురు శ్రీవల్లి, కుమారుడు ఒంటరయ్యారు. శ్రీవల్లిని అమ్మమ్మ ఊరు రామలక్ష్మణుపల్లెకు తీసుకువచ్చారు. కుమారుడు తండ్రి రఘు ఇంట్లో ఉన్నాడు. -
పేకాట అడ్డాపై దాడి: 8మంది అరెస్ట్
తూఫ్రాన్ (మెదక్) : పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో జరిగింది. సీఐ రమేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం... రావెల్లి గ్రామ సమీపంలోని మామిడి తోట వద్ద శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్.ఐ.వెంకటేశ్ సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేయగా కొందరు పారిపోగా 8 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14, 085, రెండు బైక్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
తండ్రి దారుణహత్య: కొడుకుపై అనుమానం
తూఫ్రాన్ (మెదక్) : వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్పేట్ మండలం జీడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆశయ్య(68) వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న క్రమంలో అనుమానం రావడంతో ఆశయ్య కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఆస్తి కోసం కొడుకే తండ్రిని హతమార్చి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement