-
కలహాల కాపురం..
కాపురానికి రానన్న భార్య మనస్తాపంతో భర్త ఆత్మహత్య రామరాజుపల్లిలో విషాదఛాయలు పెళ్లంటే నూరేళ్ల పంట. సాఫీగా సాగిపోవాల్సిన కాపురంలో దంపతుల మధ్య కలహాలు వచ్చాయి. కలిసి ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరిపోసుకుని ఊపిరి తీసుకున్నాడు. గుత్తి రూరల్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవడుగూరు మండలం చిట్టూరు రామరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామరాజుపల్లికి చెందిన కూలీ చిన్న తిరుపాలు (26)కు పామిడి మండలం సొరకాయలపేటకు చెందిన ఆశాతో ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆశా తరచూ పుట్టింటికి వెళ్లేది. అలా వెళ్లినపుడల్లా తిరిగి మెట్టినింటికి వచ్చేకి మొండికేసేది. ఈ క్రమంలో పెద్ద మనుషులు దాదాపు పదిసార్లుపం చాయితీలు కూడా చేశారు. ఇందులో భాగంగా సోమవారం కూడా భార్య ఊరిలోనే మరోసారి పంచాయితీ జరిగింది. భర్తతో కాపురానికి వచ్చేందుకు ససేమిరా అంది. మనస్తాపానికి గురైన తిరుపాలు స్వగ్రామం రామరాజుపల్లికి తిరిగి వచ్చి.. ఆ రాత్రంతా ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశామని ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. -
అర్ధరాత్రి.. కాళరాత్రి!
⇒పెళ్లి బృందం లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య ⇒వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న 31 మంది క్షతగాత్రులు ⇒సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తుముల, జేసీ ⇒మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఓదార్పు గిద్దలూరు : పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 31 మంది క్షతగాత్రులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం- కర్నాలు జిల్లా సరిహద్దులోని నలమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద పెళ్లి బృందం లారీ శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు, క్షతగాత్రుల స్వగ్రామం నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, అక్కడి ప్రైవేటు వైద్యశాలలో ఒకరు, నంద్యాలలో ముగ్గురు, ఒంగోలులో ఒకరు, నరసరావుపేటలో ముగ్గురు, గిద్దలూరులోని డీజీఆర్ వైద్యశాలలో ఏడుగురు, ఆరోగ్యశ్రీ, ఏరియా వైద్యశాలలో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కర్నూలు, నరసరావుపేటల్లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు వీరే.. చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు (55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ (45)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్రెడ్డి, జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ముత్తుముల విషయం తెలుసుకుని వెంటనే కర్నూలు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న 12 మందిని పరామర్శించారు. అనంతరం నంద్యాలలో పలు వైద్యశాల్లో చికిత్సలు పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు. మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించాలని వైద్యులను కోరారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి లారీని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల, డీజీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యం అందుతున్న తీరును డాక్టర్ సూరిబాబు, డాక్టర్ హరనాథరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారిని తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు మార్చాలని ఆర్డీఓ చంద్రశేఖరరావును జేసీ ఆదేశించారు. ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నాయకులు రెడ్డి కాశిరెడ్డి, సీవీఎన్ ప్రసాద్, దప్పిలి కాశిరెడ్డి, దమ్మాల జనార్దన్, వైజా కృష్ణారెడ్డి, బొర్రా కృష్ణారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సాయం రూ.లక్ష మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్ శనివారం గిద్దలూరు వచ్చి ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్రెడ్డి రూ. 20 వేలు చొప్పున సాయం చేయనున్నట్లు చెప్పారు. రాచర్ల ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి కాశిరెడ్డిలు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. క్షతగాత్రులకూ ఎక్స్గ్రేషియో ఇవ్వాలి : ముత్తుముల లారీ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి కోరారు. కలెక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జేసీ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచేలా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాననిహామీ ఇచ్చారు. ఒంగోలు టౌన్ : పెళ్లి బృందం లారీ బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో మంజూరు చేసినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు గిద్దలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
బధిరుడి హత్య.. అవయవాలు మాయం!
చెత్తతో మృతదేహం దహనానికి యత్నం వింజమూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట దళితవాడకు చెందిన బధిరుడు(మూగ, చెవుడు) దమ్ము తిరుపాలు(35) దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. అయితే మృతుడి అవయవాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం కూలి పనికి వెళ్లి వచ్చిన తిరుపాలు ఆ తర్వాత కనిపించలేదు. అతడి కోసం రాత్రి వరకు కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే సోమవారం ఉదయం స్థానిక లోతువాగు సప్లయి చానల్లో తిరుపాలు మృతదేహాన్ని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహన్ని పరిశీలించగా కిడ్నీలు మాయమైనట్లు గుర్తిం చారు. సమీపంలోనే మరికొన్ని అంతర్గత భాగాలు కూడా పడి ఉన్నాయి. కాళ్లు, చేతులను మృతుడు ధరించిన దుస్తుల తోనే కట్టి వేసి, గొంతుకు కండువా గట్టిగా బిగించి లాగారు. ఆనవాలు గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై చెత్త వేసి తగులబెట్టారు. అవయవాల సేకరణ ముఠా ఈ దురాగతానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. మృతుడికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమ్యూనిటీ హాళ్లు.. కల్యాణ మండపాలు
ఫోన్ చేస్తే ఓటు వివరాలు
వెస్ట్.. బెస్ట్
సుందర తీరం.. ప్రకృతి రమణీయం
పార్కులు.. రోడ్లు.. ఇంకా..
శారదా పీఠంలో ముగిసిన మహాక్రతువు
ఎంపీ బ్యాలెట్ పత్రాలు వచ్చేశాయ్
తీరుమారని ఏయూ ప్రొఫెసర్
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement