-
SL Vs BAN: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్.. టెస్ట్ క్రికెట్లో ఒకే ఒక్కడు..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు దిగి, ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ప్లేస్లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్ ఇన్నింగ్స్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. 92 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు. -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్బాల్ క్రికెట్పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్బాల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు. సోమవారం బంగ్లా సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది. అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్తో టెస్ట్ ఆడాడు . శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో భీకర ఫామ్లో ఉండిన హిట్మ్యాన్ ఈ సిరీస్లో ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 యేళ్ళ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 579 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్ల్లో గెలవగా, 178 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 222 మ్యాచ్లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. అయితే భారత జట్టు టెస్టు చరిత్రలో విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా రావడం ఇదే తొలిసారి. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ గెలుపు ఓటముల నిష్పత్తి సమానం కాలేదు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డుకు ధర్మశాల వేదికైంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైశ్వాల్ ఈ సిరీస్ ఆసాంతం అద్బుతమైన కనబరిచాడు. 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: #Shreyas Iyer: ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement