-
TS: 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఖాళీల భర్తీల్లో భాగంగా మరో నోటిఫికేషన్కు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో 5, 089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందకు వెళ్లనుంది. మొత్తం 5,089లో.. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ కాదు.. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గతంలో మాదిరిగా డీఎస్సీ(జిల్లా ఎంపిక కమిటీలు) ద్వారా నియామకాలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంటే.. టెట్లో అర్హత సాధించిన వాళ్లంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులన్నమాట. అందులో అర్హత సాధించిన వాళ్లను డీఎస్సీకి పంపుతారు. ఆయా జిల్లాల డీఎస్సీలు నియమకాలు చేపడతాయి. టెట్ ఎప్పుడంటే.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సెప్టెంబర్ 15వ తేదీన ఉండనుంది. అదే నెల 27వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత వెంటనే ఉపాధ్యాయుల పోస్టుల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్దీకరించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్దీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం
పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్లో 21,077, ఉత్తర ప్రదేశ్లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!) – మోటె చిరంజీవి, వరంగల్ -
బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
సికింద్రాబాద్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్).. టీచర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితరాలు. ► విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ తదితరాలు. ► పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► లైబ్రేరియన్: అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ► సెక్యూరిటీ సూపర్వైజర్: అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాధాన్యం ఇస్తారు. ► కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్: అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021 ► వెబ్సైట్: http://www.apsbolarum.edu.in/index.html మరిన్ని నోటిఫికేషన్లు: టీటీడబ్ల్యూఆర్డీసీఎస్లో పార్ట్టైం టీచింగ్ పోస్టులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం టీచర్ల నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పెండింగ్లో ఉన్న డీఎస్సీ–2018 ఉపాధ్యాయ నియామకాలకు మోక్షం లభించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ కన్వీనర్ కె.రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జరిగిన డీఎస్సీ–2018 కౌన్సెలింగ్ ప్రక్రియను రవీంద్రనాథ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 ప్రక్రియ పరీక్షలకే పరిమితమైందన్నారు. న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ సీఎం వైఎస్ జగన్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా చేపట్టిన కౌన్సెలింగ్లో 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే జాబితాల విడుదల, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ చేపట్టి నియామకాలను పూర్తి చేశామన్నారు. -
‘వచ్చే నెల 4లోగా టీచర్ల నియామకాలు పూర్తి’
న్యూఢిల్లీ : ఉపాధ్యాయుల నియామకాలు సెప్టెంబర్ 4వరకు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని పేర్కొంది. మరోవైపు 4,444 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్ ఉండటంతో నియామకాలు చేపట్టడం ఆలస్యం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే తెలంగాణ అంశాన్ని వచ్చే వారం విచారిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement