-
జయమ్మ కోసం ఆటోడ్రైవర్ సేవ
చెన్నై: గడిచిన 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాగుపడాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. 'అమ్మ' పథకాలతో లబ్దిపొందిన ఇంకొందరు ఆమె పేరున తోచిన రీతిలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ సుగుమార్.. జయ అపోలోలో చేరననాటి నుంచి ఆ ఆసుపత్రి ప్రాంగణంలోనే కనిపిస్తున్నాడు. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారిని సుగుమార్ తన ఆటోలో వారు కోరుకున్న చోట దిగబెడుతున్నాడు. 17 రోజులుగా అతను ఇదే పనిలో ఉన్నాడు. 'అమ్మ తొందరగా కోలుకోవాలన్నదే నా ప్రార్థన.. ఆసుపత్రి నుంచి వెళ్లేవారిని ఆటోలో ఉచితంగా దింపడం ద్వారా నాకు తోచిన సేవ చేస్తున్నా. ఆ పుణ్యమంతా అమ్మకే దక్కాలి. అమ్మ బాగుండాలి' అని సుగుమార్ అంటున్నాడు. -
ఇదేనా పాలన?
సాక్షి, చెన్నై : రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్నదని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వానికే దక్కిందని మండి పడ్డారు. ఇదేనా ప్రజలకు అందిస్తున్న సుపరి పాలన అని ప్రశ్నించారు. ఆదివారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2011 ఎన్నికల ముందు రాష్ట్రంలో కేవలం 95కోట్ల అప్పుల్లో ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అప్పులు భారీగా పెరిగాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పు రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని జయలలిత గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు వెలుగు చూస్తున్న లెక్కల మేరకు రాష్ట్రంలో రెండు లక్షల 11 వేల 483 కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. ప్రత్యేక పథకాల ద్వారా రానున్న ఐదేళ్లల్లో లక్షా 20 వేల కోట్ల ఆదాయన్ని ఆర్జించి తీరుతామని ప్రగల్బాలు పలికిన సీఎం జయలలిత, ఇప్పుడు పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో అని ఎద్దేవాచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన రూ. 28 వేల మేరకు అప్పును ప్రభుత్వం రుద్ది ఉన్నదని పేర్కొన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం వెనుక బడి ఉన్నా, అప్పుల్లో మాత్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఉండడం విచారకరంగా పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయేందుకు ప్రధాన కారణం అధ్వానమైన పాలన, అవినీతి మయం అని ఆరోపించారు. పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15 ఆర్థిక పరిశీలన నివేదిక మేరకు లక్షా 91 వేల 300 కోట్లను అప్పుగా చూపించి ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. సుపరి పాలన అంటూ ప్రజల్ని అప్పుల్లోకి నెట్టడమేనా పాలన అని సీఎం జయలలితను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పులతో రాష్ట్రానికి తలవంపు తీసుకొచ్చి పెట్టిన ఈ పాలకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement