-
ఫ్లాప్ హీరోకి 38 కోట్లా..?
బాలీవుడ్ మోస్ట్ అన్ లక్కీ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న ఈ యంగ్ హీరో, హిట్ ఇవ్వడంలో మాత్రం వెనకపడుతున్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో పాటు, నటుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న రణబీర్, ఇంత వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే తాజాగా ఈ హీరో ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగిన నేపధ్యంలో ఒక ఆసక్తి కరమైన విషయం బయటికి వచ్చింది. వరుస ఫ్లాప్ల తరువాత రణబీర్ హీరోగా నటించిన తమాషా సినిమాకు, ఈ హీరో ఏకంగా 38 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. తన మార్కెట్ కన్నా కూడా రణబీర్ తీసుకున్న రెమ్యూనరేషనే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ యంగ్ హీరో నటించిన గత చిత్రం బాంబే వెల్వేట్ కేవలం 24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నేపథ్యంలో రణబీర్కు 38 కోట్లు ఇవ్వటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన తమాషా సినిమాను 75 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. అయితే తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పటివరకు కేవలం 61 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రణబీర్ రెమ్యూనరేషన్ బయటకు రావటంతో యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారు. -
మహేశ్బాబుకు థాంక్స్ చెప్పిన దీపిక!
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబుకు థాంక్స్ చెప్పింది. తన తాజా సినిమా 'తమాషా' హిట్టవ్వడంతో ఆనందంగా ఉన్న దీపిక.. మహేశ్బాబుతో కలిసి నటించేందుకు గతంలో ఆసక్తి కనబర్చింది. తెలుగు హీరోల్లో తన ఫేవరెట్ స్టార్ మహేశ్బాబు అని ఆమె ఓసారి చెప్పింది కూడా. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పేపర్కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్బాబు ' ఒకప్పుడు నా ఆల్టైమ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడు మాత్రం దీపికా పదుకొనే. ఆమె అద్భుతమైన నటి. 'పీకూ'లో ఆమె నటన చూసి ముగ్ధుడిన్నయాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. దానికితోడు అలాంటి నటన కూడా ప్రదర్శించడం చాలా గొప్ప విషయం' అని చెప్పారు. దీంతో మహేశ్ ప్రశంసలతో కదిలిపోయిన దీపిక ఆయనకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'తమాషా' చిత్రంలో దీపిక అద్భుతమైన నటనను ప్రశంసిస్తూ ఆమెకు వ్యక్తిగతంలో మహేశ్ కాల్ చేసినట్టు తెలిసింది. దీపిక ప్రస్తుతం సంజయ్లీలా భన్సాలీ 'బాజీరావు మస్తానీ'లో నటిస్తుండగా.. మహేశ్బాబు 'బ్రహ్మోత్సవం' వచ్చే ఏడాది ప్రేక్షకులను పలుకరించనుంది. -
'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు..
ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతం వినిపించినపుడు గౌరవ సూచకంగా లేచి నిలబడలేదనే కారణంతో ఓ మతానికి చెందిన కుటుంబాన్ని ఆ థియేటర్ నుంచి బయటకు పంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత శుక్రవారం విడుదలయిన హిందీ చిత్రం 'తమాషా'ను ప్రదర్శిస్తున్న ఓ మల్టీప్లెక్స్లో ఈ సంఘటన జరిగింది. తమాషా చిత్రం ప్రారంభకాకముందు జాతీయ గీతాన్ని ప్లే చేశారు. థియేటర్లోని ప్రేక్షకులు లేచి నిలబడగా, ఆ సమయంలో ఓ కుటుంబ సభ్యులు మాత్రం సీట్లలోనే కూర్చున్నారు. ఇది గమనించిన ప్రేక్షకులు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని బయటకు పంపారు. ఆ కుటుంబం వెళ్లడంతో ఇతర ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం కచ్చితంగా తెలియరాలేదు. బెంగళూరులోని అని కొన్ని, ముంబై కుర్లా ప్రాంతంలో అని మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించలేదు. కొందరు నెటిజన్లు మాత్రం వెంటనే స్పందించి ప్రేక్షకుల చర్యను సమర్థించారు. -
జోరుగా కలెక్షన్ల 'తమాషా'!
ముంబై: బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల 'తమాషా' జోరుగానే కొనసాగుతున్నది. రణ్బీర్ కపూర్, దీపికా పదుకొణే జంటగా తీసిన 'తమాషా' చిత్రం దేశంలో తొలిరోజే రూ. 10.87 కోట్లు వసూలు చేసింది. రణ్బీర్ కపూర్ కెరీర్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ ఇదే. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. 'తమాషా'లో రణ్బీర్, దీపికా అభినయానికి మంచి మార్కులే పడుతున్నాయి. దీనికి తోడు ప్రేక్షకుల 'మౌత్ పబ్లిసిటీ' కూడా సినిమాకు బాగా కలిసి వస్తున్నది చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం భారీ సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం 'తమాషా'కు కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం బరిలో లేకపోవడంతో మొదటి వారాంతంలో భారీగా వసూళ్లు ఉంటాయని చిత్రబృందం ఆశిస్తున్నది. యూటీవీ మోషన్ పిక్చర్స్, నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త సమర్పణలో సాజిద్ నదియావాలా ఈ సినిమాను రూపొందించారు. -
రణ్బీర్తో రైలు ప్రయాణం!
ఇప్పుడు బాలీవుడ్లో ప్రచార కార్యక్రమాలతో సందడి చేస్తున్న జంటల్లో రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనేల జంట ఒకటి. ఈ మాజీ లవర్స్ నటించిన తాజా చిత్రం ‘తమాషా’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఫ్లయిట్ టికెట్స్ బుక్ అయిపోయాయి. దీపికా మాత్రం ముంబయ్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్లో వెళితే బాగుండు అనుకున్నారట. ఈ విషయం రణ్బీర్కి తెలిసిపోయింది. అంతే.. ఫ్లయిట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించేసి, ట్రైన్ టికెట్స్ బుక్ చేయించేశారు. దీపికా హ్యాపీగా ట్రైన్ ఎక్కి, ‘అండ్ ది జర్నీ బిగిన్స్’ అని ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది. దీపికా ఇష్టపడితే రణ్బీర్ ఎందుకు తీర్చాలి? ఈ విషయంలో ఆయన తాజా ప్రేయసి కత్రినా కైఫ్కి కోపం వచ్చే అవకాశం ఉందేమో అని పరిశీలకులు అంటున్నారు. పాయింటే కదా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement