-
నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్కు మిత్రునిగా పేరుపొందిన నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా(79) మంగళవారం కన్నుమూశారు. దేశ రాజధాని కఠ్మాండు శివార్లలోని మహరాజ్గంజ్లో స్వగృహంలో తెల్లవారుజాము 12.50 గంటలకు(స్థానిక కాలమానం) శ్వాససమస్యతో తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న సుశీల్కు న్యుమోనియా సోకింది. సోమవారం ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ అంత్యక్రియలను బుధవారం నిర్వహిస్తారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుశీల్ భారత్తో స్నేహసంబంధాలకు గట్టి మద్దతుదారుగా పేరుపడ్డారు. 2014 ఫిబ్రవరి -2015 అక్టోబర్ మధ్య నేపాల్ ప్రధానిగా పనిచేశారు. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్లో సుస్థిరత తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. భారత్తో చక్కని సంబంధాలను కొనసాగించారు. అయితే పదవీకాలం చివరిలో కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో గత అక్టోబర్లో తన పదవికి రాజీనామా చేశారు. 1954లో రాజకీయాల్లోకి వచ్చిన సుశీల్ నేపాల్లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. అవివాహితుడైనా యన 16 ఏళ్లు భారత్లో ప్రవాస జీవితాన్నిగడిపారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని భారత బృందం నివాళి.. భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కఠ్మాండులోని దశరథ్ రంగశాల స్టేడియంలో ఉంచిన సుశీల్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి ఘటించింది. సుశీల్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బృందంలో ఆనంద్శర్మ(కాంగ్రెస్), శరద్ యాదవ్(జేడీ-యూ), సీతారాం ఏచూరి(సీపీఎం), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. కాగా సుశీల్ కొయిరాలా మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. -
కొయిరాలా రాజీనామా.. మళ్లీ పోటీకి సై
ఖట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంబరణ్ యాదవ్కు సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగించాలని సూచించారు. ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు పార్లమెంటు సమాయత్తం అవుతుండగా... ఇప్పటికీ కొ్తత ప్రధాని ఎవరనే దానిపై ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ సంక్షోభం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు కీలక భారత్ సరిహద్దు వాణిజ్య ఒప్పందంపై దేశమంతటా నిరసనలు, రోడ్డు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ప్రధాని పదవికి కొయిరాలా రాజీనామా లాంఛనం మాత్రమే. ఆదివారం పార్లమెంటులో జరగబోయే నూతన ప్రధాని ఎన్నికలో ఆయన కూడా ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోయిరాల ప్రధానంగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలితో పోటీపడుతున్నారు. -
ఆదమరచి ఉండగా దెబ్బతీసింది
తాజా భూకంపంపై నేపాల్ ప్రధాని కఠ్మాండు: పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో.. తాజాగా మంగళవారం సంభవించిన భూకంపాన్ని ఎదుర్కోలేకపోయామని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. ‘‘మేం ఆదమరచి ఉండగా దెబ్బతీసింది’’ అని చెప్పారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన తాజా భూకంపం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆయన గురువారం దోలఖా ప్రాంతంలో పర్యటించారు. కాగా, తాజా భూకంపంలో మృతుల సంఖ్య 110కి పెరిగింది. -
భారత్ సాయంతో నేపాల్కు ప్రమాదమా?
భూకంపం సంభవించగానే నేపాల్ ప్రభుత్వం కంటే ముందుగా స్పందించి.. శిథిలాల తొలిగింపు, బాధితుల తరలింపు కార్యక్రమాల్ని చేపట్టిన భారత్ చర్యలు ఆ దేశ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయా? నేపాల్- చైనా సంబంధాలపై ప్రభావం చూపేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి నేపాల్ మావోయిస్టు పార్టీలు! భూకంపం అనంతర పరిణామాలపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా నేతృత్వంలో శనివారం కఠ్మాండులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో యూసీపీఎన్ (యూనైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- మావోయిస్టు) ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. భూకంప బాధితులకు సహాయం పేరుతో భారత సైన్యం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని, వారి చర్యలు నేపాల్ అంతర్గత భద్రతను ప్రమాదకర స్థితిలోకి నెట్టేవిగా ఉన్నాయని, ఈ విషయంలో భారత సైన్యానికి తగిన మార్గదర్శకాలు సూచించాలని యూసీపీఎన్ కూటమి అధ్యక్షుడు పుష్ప కమల్ దహాల్, మోహన్ బైద్య, మజ్దూర్ కిసాన్ పార్టీ నాయకుడు నారాయణ్ మాన్.. ప్రధాని కోయిరాలాకు సూచించినట్లు నేపాల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. త్రిభువన్ ఎయిర్పోర్టు, నేపాల్- చైనా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే భారత సైన్యం కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఇది నేపాల్- చైనా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని కమ్యూనిస్టు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీడియాలో వినవస్తోన్న వార్తల్లో నిజం లేదని, నేపాల్ ప్రభుత్వం ఆదేశాలమేరకే ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం పనిచేస్తున్నదని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నేపాల్కు భారత్ అందించేది స్నేహహస్తమేనని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అన్నారు. -
రక్తదానం చేసి ఆదుకోండి
ఖాట్మాండూ: రక్తదానం చేసి భూకంప క్షతగాత్రులను ఆదుకోవాలని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కోయిరాల అన్నారు. ప్రజల రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని విన్నవించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. క్షతగాత్రులతో నేపాల్ లోని ఆస్పత్రులు నిండిపోయాయి. ఆస్పత్రులకు తీసుకువస్తున్న వారిని బయటే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. శనివారం నేపాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల 2200 మందికిపైగా మరణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement