-
వేసవిలో బదిలీలు చేయూలి
ఖమ్మం: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మా ట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్వీసు గరిష్ట కాలపరిమిపై హడావుడిగా కాకుండా శాస్త్రీయ దృష్టితో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పదోన్నతులు ఎలా సాధ్యమైతే ఆలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పదవ తరగతి మూల్యాంకనం రేట్లను మూడు రెట్లు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ ఇవ్వాలని, నూతన పీఆర్సీ ప్రకారం టీఏ, డీఏ అమలయ్యేలా స్పాట్ ముగిసేలోపు ఉత్తర్వ్యూలు జారీ చేయాలన్నారు. రేషలైజేషన్ ఆలోచనను విరమించుకోవాలని ప్రాథమిక పాఠశాలలను విలీనంచేసి ఆంగ్లమీడియంబోధన ప్రవేశపెట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు. పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్ నగదు ఇవ్వాలని స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు, కనకదుర్గ, వెంకట్రెడ్డి, జయరాజ్, శ్రీనివాస్చ ప్రసాద్, అబ్రహం, రంగారావు, రియాద్, నరసయ్య, వెంకటేశ్వరావు, సోమాల్ల తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ శోకం
- ప్రమాదకర స్థాయికి పడిపోయిన నీరు - ములుగు, తూప్రాన్లో 34 మీటర్ల లోతుకు.. - ఏడాదిలోనే 6.31 మీటర్ల దిగువకు - బోర్లు తవ్వుతున్నా పడని నీరు -ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం - వచ్చే సీజన్లో కురిసే వర్షాలే ఆధారం జిల్లాలో ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నాయి... రోజు రోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి... బోరుబావులు, చేతిపంపులు ఎండిపోతున్నాయి... చెరువుల్లో నీరు లేకుండా పోయింది... అక్కడక్కడా అవసరానికి మించి నీటి విని యోగం పెరిగిపోయింది... ఎన్ని బోర్లు వేసినా నీరొచ్చే పరిస్థితి లేదు. విషయం తెలియని రైతులు బోర్ల మీద బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారు... ఈ వేసవిలో తాగు నీటికీ కష్టాలు తప్పేట్టు లేదు... వచ్చే సీజన్లో వాన దేవుడు కరుణించకపోతే నీటి యుద్ధాలు తప్పేట్టు లేదు. సాక్షి, సంగారెడ్డి :జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 6.31 మీటర్ల లోతుకు చేరాయి. గత ఏడాది మార్చిలో 12.48 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 18.79 మీటర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత వేసవిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. దీనికితోడు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతోండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బోరుబావులు ఇప్పటికే ఎండిపోయాయి. దీనికితోడు చేతి పంపులు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో వ్యవసాయ బోరుబావులు సైతం నీరు పోయడం తగ్గింది. రబీలో వరి, చెరకు పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరానికి మించి బోర్లు వేయటం. భూగర్భజలాలను వాడుకోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బోరుబావుల ద్వారా వందశాతం భూగర్భజలాలు వాడుతున్న గ్రామాలు జిల్లాలో 377 వరకున్నాయి. డార్క్ ఏరియా ప్రాంతాలు అత్యధికంగా ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే మెదక్ అగ్రభాగాన ఉంది. భూగర్భ జలాలు పడిపోతున్నా ఇది తెలి యక రైతులు ఆశతో బోర్లు వేసి నీళ్లు పడక అప్పులపాలవుతున్నారు. ములుగులో 34.03 మీటర్ల లోతుకు చేరిన నీరు.. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా ములుగు గ్రామంలో 34.03 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తూప్రాన్లో 33.35 మీటర్లు, గజ్వేల్లో 30.80 మీటర్ల మేర పడిపోయాయి. కొల్చారం మండలం రంగంపేటలో 32.50, టేక్మాల్ 29.10, రామచంద్రాపురం 28.38, జిన్నారం మండలం అన్నారం గ్రామంలో 27.90, దౌల్తాబాద్ మండలం రాయిపోల్లో 26.31, దుబ్బాక మండలం చిట్టాపూర్లో 26.23, దుబ్బాక మండలం గంబీర్పూర్లో 25.21 మీటర్ల మేరకు చేరుకున్నాయి. జగదేవపూర్ మండలం ధర్నారంలో 23.59, ములుగు మండలం జప్తిసింగపల్లిలో 23.57 మీ., మునిగడపలో 22.50 మీ., జహీరాబాద్ మండలం రంజోల్లో 21.50 మీ., ములుగు మండలం అడవి మజీద్పల్లిలో 21.42 మీ., మనూరు మండలం పూసల్పాడ్ గ్రామంలో 20.75 మీ., చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో 20.29 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. వీటికితోడు 10 మండలాల్లో 20 నుంచి 15 మీటర్లకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండడంతో గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. బావుల్లో సైతం నీళ్లు అడుగంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో సమస్య మరింత తీవ్రమవుతుంది. వర్షాల పైనే ఆశ.. కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపితేనే మేలు ఉంటుంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే (పైకి వచ్చే) అవకాశం ఉంది. లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 1.60 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం అవసరానికి మించి నీటిని వాడుతున్నారు. బోరుబావులున్న రైతులు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వైపు మళ్లితే ఫలితం ఉంటుంది. అధికారులు వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే మేలు జరుగుతుంది. -
చుర్రుమంటోంది..
ఠారెత్తిస్తున్న ఎండలు ఉష్ణోగ్రతలు ఉధృతం గాలులతో కాస్త ఉపశమనం ఎండలు ఠారెత్తించడంతో జిల్లాలో కాక పుడుతోంది. ఉదయం నుంచి ఉడుకు మొదలవుతోంది. వేసవి ఊపందుకోవడంతో దాని ఉధృతి కూడా పెరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు విశాఖపై ఎలాంటి ద్రోణులూ ప్రభావం చూపడం లేదు. అందువల్ల ఆకాశంలో మేఘాలు లేవు. దీంతో భానుడి ప్రతాపం నేరుగా భూమిపై పడి సత్వరమే వేడెక్కుతూ సెగలకు కారణమవుతోంది. విశాఖపట్నం: జిల్లా గరంగరంగా మారిపోతోంది. ఉదయం 9 గంటలకే చుర్రుమంటోంది. వీథుల్లోకి అడుగు పెట్టడానికి జనం భయపడుతున్నారు. హుద్హుద్ దెబ్బకు లక్షల చెట్లు నేలకూలాయి. ఫలితంగా ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఇటు విశాఖపైన, అటు జిల్లాపైన పడుతోంది. వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుంటాయి. ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అయితే హుద్హుద్కు జిల్లాలో చెట్లు చాలావరకు ధ్వంసమయ్యాయి. దీనివల్ల విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ గాలిలో అలాగే ఉండిపోతోంది. దీంతో భూతాపం పెరిగిపోతూ ఉష్ణ తీవ్రతకు కారణమవుతోంది. విశాఖలో ఆదివారం 36 డిగ్రీల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. గాలులతో మేలు.. : వేసవి వచ్చిందంటే విశాఖ వాసులకు ఉక్కపోత బెడద వెంటాడుతుంది. ఇతర ప్రాంతాల కంటే విశాఖలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలి కూడా తగ్గుతుంది. చెట్లు లేకపోతే తేమ శాతం మరింత పెరుగుతుంది. వెరసి ఉక్కపోతకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. అందువల్ల గాలిలో తేమను ఒక చోట ఉంచకుండా ఉక్కపోత లేకుండా చేస్తున్నాయి. కొద్దిరోజులపాటు గాలులు వీస్తాయని, గాలులు తగ్గితే ఉక్కపోత మొదలవుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
హాయి హాయిలే వాటర్ మేలే నులే!
ఎర్రటి ఎండల్లో ఎర్రెర్రెగా నోరూరించే వాటర్మెలాన్లు చూసి లొట్టలేయకుండా వాటిని హాయి హాయిగా చల్లచల్లగా ఆరగించండి. ఎండకు గట్టి పోటీ ఇవ్వండి. కూల్గా ఉండండి. ఇంతకీ ఏమిటా లాభాలు? ఇదిగో: వేసవి దాహాన్ని తట్టుకోవడానికి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన బహుమతి వాటర్ మెలాన్. దాహం తీర్చడమే కాదు విటమిన్-ఎ తాలూకు సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది వేసవిలో చర్మసంరక్షణకు తోడ్పడుతుంది గుండెకు సంబంధించి రుగ్మతలు, ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది శక్తి ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్-బి దీనిలో ఉంటుంది. గమనిక: ఉప్పులాంటి వేవీ అద్దుకోకుండా, వీటిని తాజాగా, సహజంగా తింటేనే మంచిది. ఒక చల్లటి పొగడ్త: సుఖాలలోకెల్లా గొప్ప సుఖం... వాటర్ మెలాన్ను భుజించడం. దేవుడి ఆశీస్సులతో ఈ భూమి మీద ఉన్న అన్ని పండ్లకు రారాజుగా కొనసాగుతోంది. దేవతలు ఏంతింటారో తెలుసుకోవాలనుకునేవారు దీన్ని తింటే చాలు.. తెలిసిపోతుంది. - మార్క్టైన్, రచయిత -
కాటన్ దుస్తులు కళకళలాడాలంటే...
వేసవి వచ్చిందంటే మన వస్త్రధారణను ఉన్నపళాన మార్చేస్తాం. కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి కూడా భయపడతాం. వేసవి ఉగ్రత నుంచి కాపాడటమే కాక... కాటన్ మనకు అందాన్ని, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే కాటన్కు అందాన్ని తెచ్చేది మాత్రం గంజి! నిజానికి మార్కెట్లో దొరికే గంజి పౌడర్ కంటే... ఇంట్లో చేసుకున్న గంజివల్ల బట్టలు మరింత అందంగా ఉంటాయంటారు వస్త్ర నిపుణులు. అంతేకాదు.. ఆరు రకాలుగా గంజిని తయారు చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఇవే ఆ ఆరు రకాలు... మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో వేసి కలిపి బాగా మరిగించాలి. ఇందులో ముంచి ఆరబెడితే కాటన్ దుస్తులు చక్కగా ఫెళఫెళలాడతాయి. బంగాళాదుంప ఆరోగ్యానికి ఎంత మంచిదో, కాటన్ దుస్తులకూ అంతే మంచిది. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. ఆ నీటిని రాత్రంతా ఉంచి, ఉదయం లేచాక వడగట్టుకుని బట్టలకు పెట్టాలి. అన్నం ఉడికించిన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపితే మంచి గంజి తయారవుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే కూరగాయలు, కాటన్ దుస్తుల అందాన్నీ ఇనుమడింపజేస్తాయి. పచ్చి కూరగాయల్ని శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకుని, అందులో బట్టల్ని ముంచి తీసి ఆరబెట్టాలి. చేమదుంపల్ని కెమికల్ ట్రీటెడ్ స్టార్చ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీనితో కూడా మనం గంజి చేసుకోవచ్చు. ముందుగా వీటిని చెక్కి, మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి బట్టలకు పట్టించాలి.అన్నం ఉడికించిన నీళ్లు గంజిలా ఉపయోగపడినట్టే... గోధుమల్ని ఉడికించిన నీళ్లు కూడా గంజిలాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలా ప్రయత్నించినా ఫర్వాలేదు. గమనిక: ఏ గంజి అయినాగానీ... చల్లారిన తర్వాతే దుస్తులకు పెట్టాలి తప్ప వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement