-
తిరుపతి చేరుకున్న సీఎం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆయన వెంట కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు సుగుణమ్మ, తలారి ఆదిత్య, జెడ్పీ చైర్మపర్సన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి స్వాగతం పలికిన వారిలో వున్నారు. చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి వచ్చారు. రాత్రి పద్మావతీ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళ, బుధవారాల్లో తిరుపతిలోనే వుంటారు. మంగళవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానితో పాటు హాజరవుతారు. బుధవారం చిల్డ్రన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సదస్సులను సీఎం ప్రారంభిస్తారు. -
ప్రజలకు చేరువగా పరిశోధనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష ఐఈఏ సదస్సు ప్రారంభం పలు ఆర్థిక అంశాలపై చర్చ మూడు రోజుల పాటు సదస్సు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో మూడు రోజులు జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ వార్షిక సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమావేశంలో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పోటీతత్వం పెరగాలని, గ్రేడింగ్ విధానం అమలు కావాలని చెప్పారు. వివిధ విభాగాల్లో నిర్వహించే పరిశోధనలు సామాన్యప్రజలకు చేరువకావాలని పిలుపుని చ్చారు. ఎస్వీయూనివర్సిటీ పురోగతిలో పయనిస్తోం దని కితాబు ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు నిధుల సమీకరణపై దృష్టి సారించాలని, కన్సల్టెన్సీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. తాను పీజీ విద్యార్థిగా ఎస్వీయూలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. ప్రతి గ్రామాన్నీ డిజిటల్ విలేజ్గా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఐఈఏ కీలక భూమిక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఏ అధ్యక్షుడు సుఖ్దేవ్థోరట్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వి«ధానాల రూపకల్పనలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఐఈఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక జర్నల్ను రూపొందించి అందజేస్తున్నామని చెప్పారు. ఐఈఏ సెక్రటరీ అనిల్కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ఐఈఏ వార్షిక సదస్సుల ద్వారా ఆర్బీఐ, నీతి అయోగ్, ఐసీఎస్ఎస్ఆర్ తదితర సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు హాజరై సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. హైదరాబాద్లోని చెస్ సంస్థ చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా అనేక ఆర్థిక అంశాలపై విశేష చర్చ జరుగుతుందని, బ్యాంకింగ్, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ప్రత్యేకంగా వ్యవసాయాభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్ యూనివర్సిటీ చాన్సలర్ వైకె అలగ్ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఈసందర్భంగా ఎకనామిక్స్ అసోసియేషన్ రూపొందించిన సావనీర్ను సీఎం ఆవిష్కరించారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ వర్సిటీ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఈ సదస్సు బుధ గురువారాలో కూడా జరగనుంది. -
చదువులు సాగేదెలా?
ఎస్వీయూను పట్టిపీడిస్తున్న ప్రొఫెసర్ల కొరత సగానికి పైగా తగ్గిన దూర విద్య అడ్మిషన్లు అరకొర వసతులతో అవస్థలు పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అరకొర వసతులు, నిలిచిపోయిన యూజీసీ నిధులు, ప్రొఫెసర్ల కొరతతో విద్యార్థులు అంతంత మాత్రపు చదువులు సాగిస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కారమై, పురోగతి వైపు అడుగులు వేయాల్సిన విశ్వవిద్యాలయం రాజకీయాలకు నిలయంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. పట్టించుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో సమస్యలన్నీ జఠిలంగా మారుతున్నాయి. తిరుపతి : ఎస్వీయూ ప్రాభవం మసకబారుతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన వర్సిటీ చదువులు నేడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. విశ్వవిద్యాలయం పురోగతి స్తంభించింది. సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు విద్యావిధానంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఏయేటికాయేడు వర్సిటీకున్న పేరు దెబ్బతింటోంది. రెండేళ్లుగా భర్తీకాని ఖాళీలు రెండేళ్లుగా ఎస్వీయూలో ప్రొఫెసర్ల కొరత నెలకొంది. 2014 నాటికే 63 ఫ్రొఫెసర్లు, 96 అసోసియేట్ ఫ్రొఫెసర్లు, 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పడీ సంఖ్య పెరిగింది. దీనివల్ల అన్ని విభాగాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులను గాడిలో పెట్టేవారు, వారిని సరైన విధానంలో నడిపించే వారు కరువయ్యారు. అధ్యాపకుల కొరత వల్ల రెండేళ్ల నుంచి యూజీసీ నిధుల విడుదల ఆగిపోయింది. వర్సిటీలో ఎంఫిల్ భోధన చేసే వారు లేక ఆ కోర్సును రద్దుచేశారు. పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రయోగశాలలు, ఇతరత్రా పరికరాలు లేక బయటకు వెళ్లి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న పురోగతి ఎస్వీయూ పురోగతి పూర్తిగా దెబ్బతింది. వైఎస్ హయాంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్గాంధీ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్సు హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 60 శాతం పనులు పూర్తయ్యాక ఆయా నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్సిటీ క్యాంపస్లో రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలకు విరివిగా నిధులు మంజూరు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆశించిన మేర నిధులు మంజూరైన దాఖాలాలే లేవు. లైబ్రరీల పరిస్థితి అంతంత మాత్రంగా మారింది. ఎప్పుడో ఐదేళ్ల కిందట పెట్టిన జర్నల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దీంతో పరిశోధక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015లో ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ సెల్లో జర్నల్స్ పెట్టకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం మానేశారు. ఇంటర్నెట్ హబ్ భవనం కూడా మూత పడింది. ఇక్కడున్న కంప్యూటర్లన్నీ పాడయ్యాయి. పరిశోధకులకు సౌకర్యాలు కల్పించాలి ఎస్వీయూలో చదువుతున్న పరిశోధకులకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రయోగశాలలో సౌకర్యాలను పెంచాలి. కొంతమంది అధ్యాపకులు విద్యార్థులను ప్రయోగశాల కోసం బయటకు పంపుతున్నారు. దీనిని నివారించాలి. యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ సమావేశాలు సకాలంలో నిర్వహించి సంబంధిత ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలి. - హేమంత్ యాదవ్, పరిశోధక విద్యార్థి అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి ఎస్వీయూలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. బోధనా ప్రమాణాలు పెంచాలి. దూరవిద్యావిభాగాన్ని బలోపేతం చేయాలి. సరైన సమయంలో పరీక్షల నిర్వహించి, సకాలంలో ఫలితాలు విడుదల చేయాలి. విద్యార్థులకు భరోసా కల్పించాలి. మెస్లను, వసతి గృహాలను ఆధునీకరించాలి. - రమేష్, ఎంఎ విద్యార్థి , ఎస్వీయూ -
ఎస్వీయూలో అంబేద్కర్ ఫ్లెక్సీల చించివేత
పోలీసులకు ఫిర్యాదు క్యాంపస్లో మరో వివాదం యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూ ప్రాంగణంలో మంగళవారం మరో వివాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్ చిత్రాలున్న ఫ్లెక్సీలను చించివేశారు. దీనిపట్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. మంగళవారం రిపబ్లిక్డే నేపధ్యంలో సోమవారం ఎస్వీయూలోని అన్నమయ్య భవన్లో బుద్ధవిహార్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్, బుద్ధుని ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. మంగళవారం ఉదయం కార్యక్రమా ప్రారంభించే సమయానికి ఫ్లెక్సీలు చించివేసి ఉన్నాయి. ఈసంఘటనపై ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, మాదిగ విద్యార్థి సమాఖ్యలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఈసంఘటనపై విద్యార్థినాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీసీ దామోదరం, తిరుపతి వెస్ట్ డీఎస్పీ అన్నమయ్య భవన్ను సందర్శించి చించి వేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు. ఎస్వీయూలో బుధవారం జరగనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈనేపధ్యంలో ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఓ విద్యార్థిసంఘ గోడరాతలను మరో విభాగం తుడిచి వేయించింది.దీనిపట్ల విద్యార్థి నాయకులు సోమవారం రాత్రి ఆందోళన చేశారు. రెండు సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ దామోదరం స్వయంగా వెళ్లి విద్యార్థులకు నచ్చచెప్పారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ ఫొటోలున్న ఫ్లెక్సీలు చించి వుండడం విశేషం. ఈ పని ఆకతాయిలదా లేక రాత్రి గొడవ పడ్డ విద్యార్థి సంఘ నాయకులు చించివేశారా అనేది మిస్టరీగా మారింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అయ్యా.. అమ్మా నీళ్లు ఇవ్వండి
ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు వీసీ ఘెరావ్ యూనివర్సిటీక్యాంపస్: అయ్యా నీళ్లు ఇవ్వండి.. అమ్మానీళ్లు ఇవ్వండి అంటూ ఎస్వీయూలో విద్యార్థులు గొంతెత్తి అరిచారు. నీళ్లు ఇచ్చి ఎండిన గొంతును తడపాలని వేడుకున్నారు. మహిళా వసతి గృహంలో మూడు రోజులుగా తీవ్ర నీటి సమస్య నెలకొంది. తాగడానికి చుక్క నీరు లేదు. మంగళవారం రాత్రి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఫలితం దక్కలేదు. యూని వర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు. బుధవారం ఉద యం తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించా రు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వసతి గృహానికి సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదన్నారు. 80 మందికి రెండు బాత్రూమ్లే ఉన్నాయని తెలిపారు. పాచిపట్టిన నీటితోనే వంట చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. వార్డెన్ను తొలగించాలని, రిజిస్ట్రార్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా శ్వేత భవనం వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇన్చార్జి వీసీ రాజగోపాల్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు సంతృప్తి చెందకపోవడంతో వీసీ బయలుదేరుతుండగా వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా ఘెరావ్ చేశారు. దారికి అడ్డంగా కూర్చుని కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు వలయంగా ఏర్పడి పరిపాలనా భవనం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఇన్చార్జి వీసీ యూనివర్సిటీ అధికారులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, హేమంత్ యాదవ్, హేమంత్రెడ్డి, కిషోర్రెడ్డి, మాదిగ విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, బీవీఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement